Tag Archives: netizens trolling

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యపై నెటిజన్ల ట్రోల్స్.. ఏందుకంటే..

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మరియు వీళ్ల గారాల కుట్టీ ఆరాధ్య మాల్దీవుల నుండి ముంబైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయం నుండి వారు నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాల్దీవులలో ఆరాధ్య పుట్టినరోజు ఘనంగా జరుపుకొని.. తిరిగి వచ్చేశారు. చాలా రోజుల తర్వాత తల్లీకూతుళ్లు జంటగా కనిపించడంతో చాలామంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆ వీడియోలో ఆరాధ్య తన తల్లితో కలిసి ఉండటం, ఆమె చేతిని ఐశ్వర్య పట్టుకోవడం కనిపించింది. ఇక వీడియోపై, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య నడకలో ఎలాంటి మార్పు లేకపోగా.. తన కూతురు ఆరాద్య నడకపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆరాధ్య క్యాట్‌వాక్‌పై.. ఆరాధ్య నడకకు ఏమైంది అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేయగా ఇలా కామెంట్లు చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ ఇది కేవలం సరదా కోసమే ఆరాద్య చేస్తుందని ఒకరు అన్నారు. ఈ వీడియోలో ఐశ్వర్య తన కూతురు చేయి పట్టుకోవడంతో.. ఆమె చేయిని వదిలి పెట్టండి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అదే సమయంలో అభిషేక్ ఆరాధ్య పోజులిచ్చిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. “పుట్టినరోజు శుభాకాంక్షలు యువరాణి’’ అంటూ ట్యాగ్ చేసి ఫొటోలను పోస్టు చేశాడు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అందే కాకుండా.. ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నాడు..

“నిన్న ఆరాధ్య 10వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇవే కాకుండా అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య రిసార్ట్‌లోని సిబ్బందితో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మా బస ఇంత సౌకర్యవంతంగా చేసినందుకు @amillafushi యొక్క సిబ్బంది మరియు నిర్వహణకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.

షణ్ముఖ్ పై నెటిజన్ల ఫైర్.. కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడంటూ ట్రోలింగ్..!

తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారం రన్ అవుతోంది. గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సారి హౌస్ లో కామెడీ తగ్గిందనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే.. చిన్న చిన్న విషయాలకు ఒకరిపై ఒకరు గొడవపడుతున్న కంటెస్టెంట్స్, టాస్క్ వచ్చేసరికి ఎవరికి వారు తమదైన శైలిలో మంచి ప్రదర్శనను ఇస్తున్నారు.

ఇందులో ఉన్నవాళ్లు కొందరు వైల్డ్ అండ్ అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఉన్నవారిలో కాస్త సాఫ్ట్ కార్నర్ లో షణ్ముఖ్, మానస్ ఉన్నారు. షణ్ముఖ్ ప్లాన్ మాత్రం నాలుగు వారాలు అవుతున్నా ఎవరికీ అర్థం కావడం లేదు. సిరిహన్మంత్ కు మొదటి నుంచి కూడా మంచి ర్యాపో ఉంది.

వీళ్లిద్దరు కలిసి బయట షార్ట్ ఫిలింలు కూడా తీశారు. దీంతోనే షణ్ముఖ్ వెళ్లిన దగ్గర నుంచి సిరితోనే సన్నిహితంగా ఉంటున్నాడు. అదే సమయంలో ఆమె కూడా షణ్ముఖ్ ని వదలడం లేదు. వీళ్లిద్దరిని కొత్త వాళ్లు చూస్తే మాత్రం లవర్స్ అనే భావన కలుగుతుంది.

ఎక్కడ చూసినా వీళ్లిద్దరే సపరేట్ గా కనిపిస్తున్నారు. అంతకముందు జరిగిన సీజన్ల మాదిరిగానే పెయిర్ ను మెయింటెయిన్ చేయాలని అనుకుంటున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా షణ్ముఖ్ ఆటతీరును ఇటు ప్రేక్షకులు, అటు నెటిజన్స్ తప్పుపడుతున్నారు. దీంతో షణ్ముఖ్ కన్నింగ్ మైండ్ తో ఆడుతున్నాడని నెటిజన్లు షణ్ముఖ్ ను ట్రోల్స్ చేస్తున్నారు.

‘లవ్ స్టోరీ’ సినిమాపై చిన్నారి ఆగ్రహం.. ఆటాడుకున్న నెటిజన్లు..

ఇటీవల నాగచైతన్య, సాయి పల్లవి నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా థియేటర్లలో కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెరకెక్కించగా.. సీహెచ్. పవన్ అందించిన బాణీలు ప్రతీ ఒక్కరికీ అలరించాయి. అయితే ఈ మూవీపై ఓ చిన్నారి తీవ్రపదజాలంతో శేకర్ కమ్ములపై విరుచుకుపడ్డాడు. ఎందుకంటే.. సినిమాలో లక్ష్మీదేవి, ఏసుక్రీస్తు చిత్రపటాలను పక్కపక్కన పెట్టడాన్ని తప్పుపట్టాడు.

అతడి నోటి వెంట అసభ్యకరమైన పదాలు వచ్చాయి. వాటిని ఎవరో చెప్పగా.. బట్టీపట్టి మరీ విచిత్రమైన వేషంలో వచ్చి వీడియోను రికార్డు చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక నిమిషం నిడివి ఉంది. దీనికి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

అతడు చిన్న పిల్లాడు.. చెప్పినవి చెప్పినట్టుగా చెబుతున్నాడు.. ఇలాంటి వాటికి అలవాటు చేయడానికి ప్రోత్సహించిన అతడి తల్లిదండ్రులను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తల్లిదండ్రులు.. పిల్లలకు నేర్పించేది ఇలానేనా.. అంటూ.. తాము సినిమా చూశామని.. తాము కూడా హిందువులమే కానీ మాకుతప్పు అనిపించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మతం గురించి ప్రస్తావన సినిమాలో ఎక్కడా రాలేదని.. హీరోయిన్ హిందువు.. హీరో క్రిష్టియన్‌ ఇద్దరు కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు.. వారి వారి నమ్మకాలకు అనుగుణంగా పూజలు చేశారు.. వాటిలో ఏ మాత్రం మాకు తప్పు అనిపించలేదని ఘూటుగానే కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి నుంచే చిన్న పిల్లలకు ఇలా చెప్పి.. వారి జీవితాలను నాశనం చేయవద్దని వారి తల్లిదండ్రులను వేడుకున్నారు.

డబుల్ గేమ్ ఆడుతున్న రవి..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

బిగ్ బాస్ కార్యక్రమం రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారంలోకి అడుగు పెట్టిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈవారం నామినేషన్ లిస్ట్ లో ప్రియాంక, శ్రీరామ్, ప్రియా, రవి,లహరి ఉన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ పూర్తికాగానే హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొని బిగ్ బాస్ హౌస్ వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది. ముఖ్యంగా ప్రియా -లహరి-రవి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు.

ఈ ముగ్గురి మధ్య జరిగిన మాటల యుద్ధంలో రవి ఒక్కొక్కరి దగ్గర ఒక విధంగా మాట్లాడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నాడని నెటిజన్లు యాంకర్ రవిని ట్రోల్ చేస్తున్నారు. యాంకరింగ్ కోసం లహరి ట్రై చేస్తోందని అందుకే తను నాతో ఉంటుంది. పెళ్లికానీ అమ్మాయి కదా.. నేను ఆమెతో చెప్పలేకపోతున్నారని రవి ప్రియ దగ్గర అన్నారంటూ పింకీ లహరికి చెబుతుంది.దీంతో లహరి నిజం ఎంత ఉందో తెలుసుకోవాలని నేరుగా రవి దగ్గరకు వెళ్లి ఇదే విషయమై నిలదీస్తుంది.

నేను యాంకరింగ్ కోసమే ట్రై చేస్తున్నానని అందుకే నీకు పనులు చేసి పెడుతున్నానని అన్నారట ఇక్కడ పెళ్లికాని వారు చాలామంది ఉన్నారు తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదని అన్నావా..అని నిలదీస్తుంది. దాంతో రవి నేను అలా అనడంలేదని అడ్డంగా తలఊపాడు .కానీ ప్రియా మాత్రం… లహరి సింగిల్ గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతో ఉంటుంది. తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదని రవి అన్నాడని చెబుతోంది. ఈమాట రవి నేను అనలేదని చెప్పడంతో ప్రియ ఏడుస్తూ.. నువ్వు అన్నావు బ్రో నేను విన్నాననీ చెబుతుంది.

ఇలా లహరి దగ్గర ఒక మాట… ప్రియా దగ్గర ఒక మాట మాట్లాడుతూ రవి డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటూ నెటిజన్లు పెద్దఎత్తున తనని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలావుండగా మరోవైపు లోబో ప్రియాంక సింగ్ ని చూసి ఏదో సైగ చేశాడు అని.. వెంటనే వచ్చి తనని అలా తాకడంతో ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ వెంటనే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నానని,లోబో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడనీ పింకీ కాజల్ తో చెప్పుకొని బాధపడుతోంది. ఇలా మొత్తానికి హౌ సభ్యుల మధ్య వేడి వాతావరణం తలెత్తడంతో బిగ్ బాస్ అందరినీ కలపడానికి “హైదరాబాద్ అమ్మాయి -అమెరికా అబ్బాయి” అనే టాస్క్ ఇచ్చి అందరిని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు.

బాబోయ్.. ఇంట్లో అన్నం పెట్టడం లేదు.. ఈ లాజిక్ లేని సీరియల్ ను ఇకనైనా ఆపండ్రా బాబూ.. అంటూ..

కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్‌ అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఎన్నో ట్వీస్ట్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్‌కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్‌.. లీడ్‌ పాత్రల మధ్య గొడవలు పెట్టించి సాగదీస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిగా మారింది.

దర్శకుడు కనిపిస్తే కొట్టేయాలన్న కోపంతో ఉన్నారు నెటిజన్లు. కోర్టులో జరిగిన సీన్ చూస్తే అలానే అనిపిస్తుంది. మోనిత చినిపోయినట్లు .. కార్తీక్ జైలుకు వెళ్లడం.. కట్ చేస్తే.. మొత్తం ఫేక్ అని తెలిసి.. పోలీస్ ఆఫీసర్ రోషిని బలి చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తం లాజిక్ మిస్ అవుతుందని.. అర్థం పర్థం లేకుండా డైరెక్టర్ కథను నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంత పెద్ద పోలీసు ఆఫీసర్ రోషిని సీసీ కెమెరాలు చెక్ చేయాలన్న ఆలోచన లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కార్తీక దీపం వల్ల రాత్రి ఇంటికి వెళ్తే తమకు అన్నం పెట్టడం లేదంటూ.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. లాజిక్ లేకుండా.. ఆసుపత్రిలో మోనిత పేషెంట్ కు నర్సు లేకుండా ఎలా చెక్ చేస్తుంది అంటూ.. మండిపడ్డాడు మరో నెటిజన్.

ఈ సీరియల్ చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఉందంటూ కామెంట్ చేశారు. సీరియల్ ను పొడిగించాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు తప్ప.. ఏ మాత్రం సీరియల్ లో పసలేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత చేసినా.. ఎన్ని నెగెటివ్ కామెంట్లు పెట్టినా.. ఆ సీరియల్ కు వచ్చే రేటింగ్ వస్తూనే ఉంటుంది. నెగెటివ్ గా ఉండే వాళ్లు కూడా ఉంటూనే ఉంటారు.