Tag Archives: Okē oka jīvitaṁ

Nag Ashwin: ప్రాజెక్టుకే రూమర్లపై స్పందించిన నాగ్ అశ్విన్.. అన్ని కథలు ఒకేలా ఉండవంటూ కామెంట్స్!

Nag Ashwin: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇకపోతే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని ఈ సినిమా అచ్చం శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాని పోలి ఉంటుందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఒకే ఒక జీవితం ప్రాజెక్టుకే రెండు ఒకే కథంశమని అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నాగ్ అశ్విన్ స్పందించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… ఒకే ఒక జీవితం ప్రాజెక్టుకే సినిమాకు ఏ మాత్రం పోలిక లేదని టైం ట్రావెల్ కథాంశం అయినంత మాత్రాన అన్ని సినిమాలు ఒకేలా ఉండవ్ అంటూ ఈయన పరోక్షంగా మండిపడ్డారు.

Nag Ashwin: ఆ వార్తలన్నీ ఆవాస్తవమే…

ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఈయన స్పందిస్తూ ప్యారడైస్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు అంటూ కామెంట్ చేశారు. ప్రాజెక్టుకే సినిమాల్లో ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా ఎనిమిది నెలల సమయం కేటాయిస్తున్నాము అంటూ ఈ సినిమా గురించి వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమే అంటూ ఈ రూమర్లను ఖండించారు.

Vennela Kishore: ఆ నా కొడుకు అంటూ వెన్నెల కిషోర్ ను అన్న శర్వానంద్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వెన్నెల కిషోర్!

Vennela Kishore: శర్వానంద్ పరిచయం అవసరం లేని పేరు. శతమానం భవతి సినిమా తర్వాత ఈయనకు ఇప్పటివరకు ఈయనకు సరైన హిట్టు పడలేదని చెప్పాలి.శతమానం భవతి సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించిన అన్ని సినిమాలు శర్వానంద్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇకపోతే ఓకే ఒక జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి హిట్ కావడంతో శర్వానంద్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మదర్ సెంటిమెంట్ కూడా తోడవడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శర్వానంద్ వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.వెన్నెల కిషోర్ ని ఉద్దేశిస్తూ ఆ నా కొడుకుకు సినిమా అవకాశం ఇప్పిస్తే ఈవెంట్ కి రాలేదు అంటూ అనడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.

ఇదేంటి శర్వానంద్ అలా అనేసారని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అయితే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పాలి. ఆ రిలేషన్ కారణంగానే సరదాగా శర్వానంద్ వెన్నెల కిషోర్ ను ఆట పట్టించారు.ఇక ఇదే అదనుగా భావించి పలు యూట్యూబ్ ఛానల్స్ దీనినే థంబ్ నెయిల్ గా పెట్టి తెగ వైరల్ చేశారు.

Vennela Kishore: శర్వానంద్ పై పంచ్ వేసిన వెన్నెల కిషోర్…

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి వెన్నెల కిషోర్ శర్వానంద్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఆరోజు నన్ను ఈ నా కొడుకు రాలేదని అన్నావు ఇప్పుడు ప్రియదర్శగాడు ఎక్కడ అంటూ ఫన్నీ చేశారు.మొత్తానికి వీరిమధ్య సాగిన ఈ సరదా సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Sharwanand: ఆ సినిమా ఫ్లాప్ అవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను.. మూడు నెలలు బయటకు కూడా రాలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటులకు హిట్ ఫ్లాప్ సినిమాలు రావడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పుడు చాలామంది ఎంతో డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు.అయితే తాను కూడా అలాంటి డిప్రెషన్ కి గురయ్యానని తాజాగా శర్వానంద్ ఇంటర్వ్యూ ద్వారా తన గత సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాజాగా శర్వానంద్ రీతు వర్మ జంటగా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఈ సినిమా కోసం దాదాపు 140 రోజుల పాటు ఎండ, వాన,అని లెక్కచేయకుండా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశాను ఈ సినిమా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకం కూడా నాలో పెరిగిపోయింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ కావడంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యానని,మూడు నెలల పాటు బయటకు రాకుండా డిప్రెషన్ కి గురయ్యానని ఈ సందర్భంగా శర్వానంద్ వెల్లడించారు.

Sharwanand: ఎండ వానను లెక్కచేయకుండా కష్టపడ్డాను..

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఇలా డిసప్పాయింట్ చేయడంతో నేను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నానని ఈ సందర్భంగా శర్వానంద్ తన కెరియర్లో డిజాస్టర్ గా నిలిచినటువంటి పడి పడి లేచే మనసు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ఇదే కాకుండా తన కెరీర్లో మరికొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా విషయంలో మాత్రం తాను చాలా డిసప్పాయింట్ అయ్యానని తెలిపారు.ఒకే ఒక జీవితం సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈయన ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Nagarjuna: అమల నటన చూసి కంటతడి పెట్టుకున్న నాగార్జున.. సెంటిమెంట్ ను పండించిన అమల!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్యగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే. వివాహానికి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఇలా కుటుంబ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అమల చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె తాజాగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో సందడి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న అమల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమా 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో పలువురు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ చూడటానికి నాగార్జున, అఖిల్, అమల, డైరెక్టర్ హను రాఘవపూడి, చందు మొండేటి వంటి ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.

Nagarjuna: అమల నటనకు ఎమోషనల్ అయిన అఖిల్..

ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల ఎంతో అద్భుతంగా నటించిందని ఈమె తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా సినిమా చేశారంటూ ఈయన చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఇక మదర్ సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఈ సినిమా చూసిన అఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని,ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా నాగార్జున సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు.

Prabhas: ప్రభాస్ అన్నతో చాలా కష్టం.. వద్దన్నా వదిలిపెట్టడు అఖిల్ కామెంట్స్ వైరల్!

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ చిత్ర బృందానికి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ తో పాటు నటించిన ఎంతోమంది నటీనటులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ ఫుడీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తినడమే కాకుండా అందరికీ అలాంటి భోజనమే పెడతారంటే ఎంతో మంది ప్రభాస్ ఆతిథ్యం గురించి వెల్లడించారు.

తాజాగా ప్రభాస్ ఏర్పాటు చేసే విందు గురించి అమల శర్వానంద్ అఖిల్ ముచ్చటించారు.శర్వానంద్ అమల నటించినటువంటి ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్ 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అఖిల్ కలిసి ఈ ముగ్గురు అమ్మ చేతి వంట అనే ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రస్తావన వచ్చింది.

ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి అఖిల్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభాస్ అన్నాను కలిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పగా వెంటనే శర్వానంద్ అవును అంటూ తనకు వత్తాసు పలికారు. ఈ క్రమంలోనే అఖిల్ మాట్లాడుతూ ప్రభాస్ అన్న వద్దు బాబోయ్ అని మొరపెట్టుకున్న ఆయన మాత్రం తినేవరకు వదిలిపెట్టరు అంటూ అఖిల్ అమలకు చెప్పుకొచ్చారు.

Prabhas: ప్రభాస్ తో విందు భోజనం అంటే అట్లుంటది మరి…

ఇలా ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదల కాగా అఖిల్ ప్రభాస్ ఆదిత్యం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఖిల్ మాత్రమే కాకుండా ఇదివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇలా అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు అట్లుంటది మరి మా హీరోతో అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.