ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగవంతమైన దర్యాప్తు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ సంచలనం రేపుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా, ప్రభాకర్ రావు వ్యక్తిగత సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ...

























