Tag Archives: priyanka singh

Priyanka singh: అమ్మాయిగా మారాలనుకుంటే ముందు ఆ పని చేయండి.. ప్రియాంక సింగ్ కామెంట్స్ వైరల్!

Priyanka singh: ప్రియాంక సింగ్ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయిగా అందరికీ ఎంత సుపరిచితమైనటువంటి ప్రియాంక జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎక్కువగా లేడీ గెటప్స్ వేసేవారు. ఇలా లేడి గెటప్స్ వేసినటువంటి ఈయన అనంతరం సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయి సాయి కాస్త ప్రియాంక సింగ్ గా మారారు.

ఇలా ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా సుమారు 12 వారాలు పాటు హౌస్ లో కొనసాగినటువంటి ప్రియాంక సింగ్ బయటకు వచ్చిన తర్వాత కెరియర్ పరంగా సక్సెస్ అందుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. తాజాగా ఈమె యూట్యూబర్ నిఖిల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితం గురించి ఎన్నో విషయాలు తెలిపారు. నాకు చిన్నప్పటినుంచే అమ్మాయి లక్షణాలు తనలో ఎక్కువగా ఉండటంతో తాను అమ్మాయిగా మారిపోయానని తెలిపారు. అయితే అబ్బాయిలు అమ్మాయిగా ఎవరైతే మారిపోవాలనుకుంటున్నారో అలాంటి వారు ముందుగా హార్మోన్ థెరపీ తీసుకోవాలని తెలిపారు. ఇక నేను అమ్మాయిగా మారడంతో ఎంతోమంది ఎన్నో మాటలు అనేవాళ్ళు ఆ మాటలనే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అన్నారని ప్రియాంక తెలిపారు.

మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా…

ఇలా ఇంట్లో వాళ్ళే నన్ను అపార్థం చేసుకోవడంతో తాను ఏకంగా మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశానని కానీ బ్రతకడంతో నేనేదో సాధించాలని అప్పుడే అర్థమైందంటూ ఈమె తెలిపారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి బ్యాడ్ కామెంట్స్ చేసిన వారిపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ కామెంట్ చేయడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది కానీ చాలామంది లైన్ క్రాస్ చేసి కామెంట్ చేయడంతోనే తాను సీరియస్ అయ్యానని ప్రియాంక తెలిపారు.

Priyanka Singh: ఘనంగా హల్ది వేడుక జరుపుకున్న బిగ్ బాస్ ప్రియాంక సింగ్… వైరల్ అవుతున్న ఫోటోలు!

Priyanka Singh: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈ కార్యక్రమం మొదట్లో లేడీస్ లేకపోవడం వల్ల మగవారే లేడీ గెటప్స్ వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా లేడీ గెటప్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో సాయి తేజ్ ఒకరు. సాయి తేజ్ జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా లేడీ గెటప్స్ ద్వారా ఫేమస్ అయిన సాయి తేజ్ ఏకంగా సర్జరీ ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు. ఇలా సాయి తేజ్ గా ఉన్నటువంటి ఈయన ప్రియాంక సింగ్ గా మారిపోయింది. ఈమె జెండర్ మార్చుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇదే పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మానస్ తో ఈమె లవ్ ట్రాక్ బాగా హిట్ అయిందని చెప్పాలి.ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక సింగ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి ఒక పూజలో కూర్చున్న ఫోటోని షేర్ చేస్తూ ఇట్స్ డన్ అంటూ ఆ ఫోటోని షేర్ చేశారు.

Priyanka Singh: ఘనంగా హల్దీ వేడుక…

తాజాగా ఈమె ఏకంగా హల్దీ ఫంక్షన్ జరుపుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఒకసారిగా వైరల్ అయింది.ఇది చూసిన ఎంతోమంది నెటిజన్లు ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతోందా అంటూ సందేహం వ్యక్తం చేయడమే కాకుండా తనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.ఈ విధంగా ప్రియాంక సింగ్ హల్ది ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా లేకపోతే ఏదైనా షూట్లో భాగంగా ఇలా ఫోటోలు దిగారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Priyanka Singh: ఎద అందాలను ఆరబోసిన ప్రియాంక సింగ్..! ఫోటో వైరల్!

Priyanka Singh: తెలుగులో ఎక్కువగా పాపులారిటీ సంపాధించిన రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. పాపులరిటీతో పాటుగా వివాదాలను కూడా మూటగట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే.

Priyanka Singh: ఎద అందాలను ఆరబోసిన ప్రియాంక సింగ్..! ఫోటో వైరల్!

2021 సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాగా.. ఇది మొదలు పెట్టిన రోజు నుంచే దీనిపై విమర్శలు వచ్చాయి. సీపీఐ నేత నారాయణ ఇది బిగ్ బాస్ షో కాదు అని.. బ్రోతల్ షో అని.. నాగార్జునపై కూడా ఫైర్ అయిన విషయం తెలిసిందే.

Priyanka Singh: ఎద అందాలను ఆరబోసిన ప్రియాంక సింగ్..! ఫోటో వైరల్!

ఇక ఏదేమైనా.. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన వారికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో అయితే విపరీతంగా ఫాలోవర్స్ వచ్చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన కంటెస్టెంట్ ఎవరంటే ప్రియాంకా సింగ్.

వావ్.. వాట్ ఏ ఎక్స్ ప్రెషన్స్..

జబర్దస్త్ లో సాయిగా ఎంట్రీ ఇచ్చి.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అతడు అమ్మాయిగా సర్జరీ చేయించుకొని.. ప్రియాంక సింగ్ గా (పింకీ)మారాడు. తర్వాత కూడా జబర్దస్త్ లేడీ గెటప్ తో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం అదే ఫేమ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 5లో 9వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన పింకీ.. అంత కంటే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ అప్ డేట్స్ ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ప్రియాంక. అందులో‘‘ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యో’’ అనే సాంగ్ తమిళ వర్సెన్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు వావ్ వాట్ ఏ ఎక్స్ ప్రెషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో ప్రియాంక సింగ్ తన అందాలను కాస్త ఎక్కువగానే చూపించదని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ మరొక రెండు వారాలలో చివరి దశకు చేరుకోనుంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సన్నీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హౌస్ లో మొదటి నుంచి సన్నీ అగ్రిసీవ్ గా ఆడుతుండటంతో సన్నీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఇక చూస్తుండగానే బిగ్ బాస్ షో 12 వారాలు విజయవంతంగా పూర్తిచేసుకుని 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ట్రోపి కోసం షన్ను, సన్నీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక అదే సమయంలో శ్రీరామ్, మానస్ లను కూడా పక్కన పెట్టడానికి లేదు. మానస్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక మరొక మూడు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది.

ఇక 13 వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. అయితే ఈసారి డేంజర్ జోన్ లో కాజల్, ప్రియాంక, సిరి లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన ఎలిమినేషన్ చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిన కాజల్ ఎలిమినేట్ అయ్యే ఆస్కారం లేదని, కాబట్టి మిగిలిన ఇద్దరూ సిరి, ప్రియాంక లలో ఎవరో ఒకరు అవుట్ అవుతారు అని అంటున్నారు.

ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి ఎలిమినేషన్ కి రెండు రోజుల ముందు నుంచే ప్రచారం జరుగుతున్నట్లుగానే ఊహాగానాలు నిజమే అవుతున్నాయి. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కనుక నిజం అయితే ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

మానస్ – ప్రియాంక మధ్య లవ్ స్టోరీ.. దీప్తి, షణ్ముఖ్ సీక్రెట్ రివిల్ చేసిన సిరి?

బిగ్ బాస్ లో తాజాగా జరిగిన 61,62 వ ఎపిసోడ్ ఎమోషనల్, గొడవలతో, విభేదాలతో రసవత్తరంగా సాగింది.తాజాగా ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ అనే టాస్క్ ఇవ్వగా ఇందులో సూపర్ విలన్స్ విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత మానస్ కూర్చొని తింటుండగా ప్రియాంక అతని దగ్గరికి వచ్చి మెలికలు తిరిగింది.ఏంటి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నట్టు ఉన్నావ్ అని మానస్ అన్నాడు.

అప్పుడు ప్రియాంక వేరే వాళ్ళు అంటే ఫీల్ అయ్యే దాన్ని కాదని,మానస్ అనడంతో చాలా బాధగా ఉందని తెలిపింది.ఈ విషయం సిరి దగ్గర చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అవ్వడంతో సిరి ఓదారుస్తుంది. ఆ తర్వాత మానస్, ప్రియాంక కలిసి బెడ్ పై హగ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగ్గా, ప్రేమించుకుంటున్నారని కాజల్ చెప్పడంతో, మరి ఇంత పబ్లిక్ గానా అంటూ సన్నీ సెటైర్లు వేశాడు.

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ చిక్కకు దొరకకు అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కానీ మాస్టర్ విజేతగా నిలిచింది. ఈ విషయం పట్ల సిరి ఎమోషనల్ అవుతూ.. చందు ముక్కు తనపై ఎక్కువ బాల్స్ విసిరాడు అంటూ ఫీల్ అయింది. ఒక ఫ్రెండ్ అయి ఉండి తన పై బాల్స్ వేస్తావా అంటూ అతనిపై మండిపడింది. నువ్వు మనసులో ఒకటి పెట్టుకుంటావ్.. బయట ఒకలా ప్రవర్తిస్తావ్ అంటూ అతని పై కామెంట్ చేసింది.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ తననీ హౌస్ నుంచి పంపించేయండి, వెళ్లిపోతానని ఇక్కడ ఉండలేకపోతున్నాను అని ఆమె తెలిపింది.ఈ క్రమంలోనే షణ్ముక్, దీప్తి సునైనల మధ్య రిలేషన్ కి సంబంధించి ఒక బాంబు పేల్చింది సిరి. బెడ్ పై కూర్చుని ఉన్నప్పుడు షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునయన ఇచ్చిన గిఫ్ట్ వాచ్ ని శ్రీ పెట్టుకుంటుంది. ఇన్నాళ్లు తాను పెట్టుకోలేదని అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక షణ్ముఖ్ నుంచి ఎలాంటి గిఫ్ట్ రాలేదని అందుకు చాలా బాధపడుతున్నట్టు తెలిపింది. అందుకే ఈ వాచ్ ఇప్పుడు పెట్టుకున్నట్టు సిరి తెలిపింది.

బిగ్ బాస్ విజేత ఎవరో చెప్పేసిన గూగుల్… విన్నర్ ఎవరంటే?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గత రెండు వారాల క్రితమే ప్రారంభమయ్యి ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే గత సీజన్లో మాదిరి కాకుండా ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లను ఒకేసారి పంపించి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వారాలకు గానీ హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్ ల మధ్య టైటిల్ కోసం తీవ్రస్థాయిలో పోటీ జరుగుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఏ విషయం కూడా బయటకు తెలియకుండా బయట విషయాలు లోపల ఉన్న కంటెస్టెంట్ కు తెలియకుండా నిర్వాహకులు ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఇలా జాగ్రత్తలు పడుతున్నప్పటికీ ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారమే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవడం గమనార్హం.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన మూడు వారాలకే ఈ సీజన్ విజేత ఎవరు అనే విషయం గురించి గూగుల్ బయటపెట్టేసింది. ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేత ఎవరని టైప్ చేయగా అందులో కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్ర పేరు చూపించడం గమనార్హం. ఇలా గూగుల్ విజేత పేరును డిక్లేర్ చేయడంతో ప్రేక్షకులు కొంతవరకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రీ రామచంద్ర అభిమానులు మాత్రం తెగ ఆనంద పడుతున్నారు.

కేవలం శ్రీ రామచంద్ర పేరు మాత్రమే కాకుండా ప్రియాంక సింగ్ పేరు కూడా చూపిస్తూ ఉండటంతో కొందరు ఆనందం వ్యక్తం చేసినా మరికొందరు గూగుల్ తప్పిదాల పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి గూగుల్ సర్వే ప్రకారం ఈ సారి విజేతగా శ్రీ రామచంద్ర గెలుస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

మూడో వారంలో నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రెండు వారాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లకు 17 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ సారి వైల్డ్ కార్టు ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు కానీ ఇంతవరకు హౌస్ లోకి ఎవరూ వెళ్లలేదు. అయితే హౌస్ లో కామెడీ తగ్గిందనే చెప్పాలి. గత సీజన్ కంటే ఈ సీజన్ కాస్తంత బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు.

ఇదిలా ఉండగా ప్రతీ సోమవారం ఆ వారానికి సంబంధించి ఎలిమినేష్ ప్రక్రియ కొనసాగుతుంది. మూడో వారం ఎలిమినేషన్ కు ఎవరు నామినేట్ లో ఉన్నారో తెలిసిపోయింది. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవారం నామినేషన్ లిస్టు లో ప్రియా, ప్రియాంక సింగ్‌, లహరి, శ్రీరామచంద్ర, మానస్‌ లు నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తం ఐదుగురు మూడో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్లకు వచ్చే ఓట్లను బట్టి.. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది. దీనిలో మొదటిసారి నామినేషన్లోకి వచ్చింది శ్రీరామ చంద్ర మరియు లహరి. ఇదిలా ఉండగా..హౌస్ లో సిస్టమ్ సరిగ్గా లేదని ప్రతీ ఒక్కరినీ సెట్ చేస్తానని చెప్పి.. నాగార్జున రెండు రోజులు వారితో ముచ్చటించిన విషయం తెలిసిందే. ప్రియా, ప్రియాంకా సింగ్, మానస్ లు రెండో వారంలో కూడా నామినేట్ అయి సేవ్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ వారం వారు హౌస్ లో కొనసాగుతారా లేదా బయటికి వస్తారో వేచిచూడాలి.

ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ వీళ్ళే..!

బిగ్ బాస్ కార్యక్రమం మొదటి వారం పూర్తిచేసుకుని హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా 19మంది కంటెస్టెంట్ లో ఒకరి ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 18 మంది సండే ఎంతో సరదాగా గడిపిన, సోమవారం నుంచి వీరికి అసలు ఆట మొదలవుతుంది.

సోమవారం నామినేషన్స్ లోభాగంగా కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం జరుగుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఈసారి ఏకంగా ఏడు మంది కంటెస్టెంట్స్ ఉండటం గమనార్హం.ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్స్ ప్రియా, ఉమాదేవి, ప్రియాంక సింగ్, కాజల్, నటరాజ్, లోబో, అనీ మాస్టర్ ఉన్నారు.

ఈ ఏడుగురిలో ఎవరు ఎన్ని ఓట్లు సాధించి హౌస్ లో ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం గురించి సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండడంతో డబల్ ఎలిమినేషన్ ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే ఎలిమినేషన్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

గత వారం రోజుల నుంచి ప్రసారమైన కార్యక్రమాన్ని చూస్తే ఈ వారం ఎలిమినేషన్ లో మోడల్ జస్వంత్, లహరి ఉంటారని చాలామంది భావించినప్పటికీ ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్ట్ లో లేకపోవడం గమనార్హం. ఇక ఈ వారం నామినేషన్ నుంచి హమీద తప్పుకున్నట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్న ఈ ఏడుగురు ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించి ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్తారు, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు అనే విషయం తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్లలో.. నా సపోర్టు ఆమెకే: నాగబాబు

బిగ్ బాస్ రియాల్టీ షోకి సినీ ప్రముఖులు మద్దతు ఎక్కువగా ఉంటుంది. అందులో ఏదో ఒక కంటెస్టెంట్ కు మద్దతు ఇస్తుంటారు. వాళ్లకు సపోర్టు చేస్తూ పోస్టులు.. వీడియోలు చేస్తుంటారు. ఇలా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా అవినాష్ కు జబర్దస్త్ టీం మొత్తం పెద్ద సపోర్టుగా నిలిచారు. రామ్ గోపాల్ వర్మ్ అయితే అరియానాకు సపోర్టు చేసిన విషయం తెలిసిందే.

వాళ్లు సోషల్ మీడియాలో వాళ్ల కోసం చేసిన ప్రచారం మామూలుగా లేదు. ప్రతీ ఒక్కరు వాళ్లు అనుకున్న కంటెస్టెంట్ కు సపోర్టుగా నిలవాలని కోరారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్ అవుతోంది. అందులోకి 19 మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో కొంతమంది చాలామందికి తెలియదు.

మరికొంత మంది యాంకర్లుగా, డ్యాన్సర్ గా, టీవీ సీరియల్ ల్లో నటించిన వారు ఉన్నారు. మిగతావారు దేనిలో ఒకదాంట్లో ప్రావీణ్యం ఉన్నా అంతగా పాపులారిటీ లేని వాళ్లు ఉన్నారు. అయితే అందులో జబర్దస్త్ నుంచి ట్రాన్స్ జెండర్ ప్రియాంక్ సింగ్ కూడా ఉన్నారు. ఆమెకు తన సపోర్టు ఎక్కువగా ఇస్తున్నట్లు ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జిగా వ్యాహరించిన నాగబాబు చెప్పుకొచ్చారు.

తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. ప్రియాంక అబ్బాయిగా (సాయి తేజ) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక సింగ్ టైటిల్ గెలుస్తారా.. లేదా అనేది తెలియదు కానీ.. తన మద్దతు మాత్రం ఆమెకు ఉంటుందని చెప్పారు. ఆమె కష్టాల్లో ఉన్న సమయంలో ఓ కామెడీ షోలో ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఆమెది శ్రీకాకులం జిల్లాగా చెప్పుకొచ్చారు. దయచేసి ఆమెకు సపోర్టుగా నిలవాలని నాగబాబు కోరారు.

మూడు సంవత్సరాలుగా వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నా..: ప్రియాంక సింగ్

గత కొన్ని నెలల నుంచి ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున రెట్టింపు ఉత్సాహంతో బిగ్ బాస్ వేదికపైకి ఒక్కొక్క కంటెస్టెంట్ కు స్వాగతం చెబుతూ వారితో ముచ్చటించి వారిని హౌస్ లోనికి పంపించారు. గత సీజన్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు.

ఒక్కసారిగా కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి వెళ్లడం తో బిగ్ బాస్ హౌస్ లో ఎంతో సందడి నెలకొంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లో జరిగిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాత్రి పెద్ద ఎత్తున గురక పెడుతూ తోటివారికి నిద్రలేకుండా చేస్తున్న లోబో గురకను యాంకర్ రవి ఆపే ప్రయత్నం చేశారు.అలాగే మరికొందరు కంటెస్టెంట్ లు నిద్రపోకుండా ముచ్చట్లు పెట్టుకున్నారు.

ఇక బిగ్ బాస్ ప్రణామం అనే పాటతో కంటెస్టెంట్ లను నిద్రలేపి వారిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రియాంక సింగ్, కాజల్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ తన మనసులోని మాటలను బయట పెట్టారు. తను ట్రాన్స్ జెండర్ గా మారి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన తండ్రికి ఈ విషయం తెలియదని ఈ విషయంలో తన తండ్రిని మూడు సంవత్సరాలనుంచి మోసం చేస్తున్నానని, ప్రియాంక తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఒకరోజు తన తండ్రి మీసం గడ్డం ఏవి రా అని అడిగినప్పుడు లేడీ గెటప్ కోసం తీసేసాను అంటూ అపద్దం చెప్పానని చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే కాజల్ తనని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. తను లింగ మార్పిడి చేయించుకున్న విషయాన్ని బిగ్ బాస్ వేదికగా తన తండ్రికి చెప్పినట్లు ప్రియాంక కాజల్ దగ్గర చెబుతూ ఎమోషనల్ అయింది.