Tag Archives: ram charn

RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ నిజమే… కానీ రాజమౌళి డైరెక్టర్ కాదు…మరి హీరోలు ఒప్పుకుంటారా?

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఆర్ఆర్ఆర్.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ద్వారా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవడం విశేషం.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ చిత్రం ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రైటర్ విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని పలు సందర్భాలలో తెలియజేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

RRR Movie: రాజమౌళి డైరెక్టర్ కాదా…


ఈ సినిమా సీక్వెల్స్ తప్పకుండా ఉంటుంది కాకపోతే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చు అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.ఈయన దర్శక పర్యవేక్షణలో మరొక డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాజమౌళి మహేష్ బాబుతో సినిమా పూర్తి చేసిన తర్వాత తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం సినిమా పనులలో బిజీ కానున్నారు దీంతో ఈ సినిమా సీక్వెల్ ఆయన డైరెక్షన్ లో చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి రాజమౌళి కాకుండా వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తారంటే హీరోలు ఒప్పుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Game Changer: క్లైమాక్స్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్!

Game Changer: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరిచిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సన్ని వేషాలను పూర్తి చేసుకున్నట్లు డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే శంకర్ ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు పూర్తి అయ్యాయని తెలియజేశారు. దాదాపు 1000 మందితో ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని పూర్తి చేశారు. ఈ సన్నివేశం కోసం హైదరాబాద్ శివారులో ప్రత్యేకంగా సెట్ వేసి సీక్వెల్ ను షూట్ చేశారు. ‘కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్బు అండ్ అరివు ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ ను రూపొందించారు. షూట్ పూర్తి కావడంతో శంకర్ ఈ విషయాన్ని తెలియజేశారు.

Game Changer: క్లైమాక్స్ పూర్తి…

ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ సినిమా క్లైమాక్స్ పూర్తి అయిందని ఇక రేపటి నుంచి ఇండియన్ టు సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నట్లు శంకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం పూర్తి కావడంతో సినిమాకి కొంత సమయం విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్ టు సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోని ఈయన రేపటి నుంచి ఇండియన్ టు సినిమా షూటింగ్లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

Upasana: దుబాయ్ లో ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్… ఫోటోలు వైరల్!

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. గత పది సంవత్సరాల క్రితం రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోతుండడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఇన్ని రోజులు పిల్లలగురించి ఆలోచించకపోవడానికి కారణం ఉందని ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలని ప్లాన్ చేసుకున్నట్లు ఉపాసన తెలిపారు.

ఇక ప్రస్తుతం తమకు పిల్లలు ఉంటే బాగుంటుందనిపించి పిల్లలను ప్లాన్ చేసుకున్నామని తాజాగా ఉపాసన ఓ సందర్భంలో తెలియజేశారు. ఇకపోతే ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ తన భర్తతో కలిసి పలు వెకేషన్ లకు వెళుతూ పూర్తి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆస్కార్ వేడుకలలో భాగంగా అమెరికాలో సందడి చేసిన ఉపాసన తాజాగా తన భర్త రామ్ చరణ్ తో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు.

ఇలా దుబాయ్ లో కొద్ది రోజులపాటు ఎంజాయ్ చేసిన అనంతరం తిరిగి ఇండియా రానున్నారు.ఇక దుబాయిలో తన స్నేహితులు కజిన్స్ తో కలిసి ఉపాసన ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇకపోతే దుబాయ్ లో ఉన్నటువంటి తన స్నేహితులు కజిన్స్ తనకు సీమంతపు వేడుకలను చేసినట్టు తెలుస్తుంది.

Upasana: స్నేహితులు కజిన్స్ సమక్షంలో బేబీ షవర్..

ఈ క్రమంలోనే దుబాయిలో నమ్మోస్ బీచ్ క్లబ్ లో ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించినట్టు తెలుస్తోంది.ఇక ఈ వేడుకలో రామ్ చరణ్ ఉపాసన స్నేహితులతో పాటు కజిన్స్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఉపాసన తెలుపు రంగుగౌనులో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దుబాయ్ వెకేషన్ పూర్తి కాగానే రామ్ చరణ్ తిరిగి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Orange Movie: అప్పుడు డిజాస్టర్ కట్ చేస్తే ఇప్పుడు బ్లాక్ బస్టర్…. ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Orange Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలు విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమా తిరిగి ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూడు రోజులపాటు థియేటర్లలో సందడి చేసింది.

ఇక ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా రాంచరణ్ జెనీలియా జంటగా నటించారు. నాగబాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 2010 వ సంవత్సరంలో విడుదలయ్యి డిజాస్టర్ గా మిగిలింది.అప్పట్లో ఈ సినిమా నిర్మాత నాగబాబుకు భారీ నష్టాలను తీసుకువచ్చింది.ఇకపోతే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని తిరిగి విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో దర్శక నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇలా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ రావడంతో దర్శక నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లన్నీ కూడా జనసేన పార్టీకి విరాళంగా అందజేస్తామని నాగబాబు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక మూడు రోజులు పాటు థియేటర్లలో సందడి చేసి భారీ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

Orange Movie: మూడు కోట్లు రాబట్టిన ఆరెంజ్ ….

ఆరెంజ్ సినిమా మూడు రోజుల పాటు ప్రదర్శితమవుతూ ఏకంగా మూడు కోట్ల రూపాయలను సాధించింది అంటూ నాగబాబు ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇలా ఒకప్పుడు డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరు మీలో కోటీశ్వరులులో సందడి చేసిన హీరోలు.. ఆసక్తికర విషయాలను చెప్పిన రామ్ చరణ్..

కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ లో ఆదివారం నుంచి ప్రారంభం అయింది. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి హాట్ సీటులో కూర్చున్నారు. ఆర్ఆర్ ఆర్ హీరోలు ఇద్దరూ రావడంతో ఫస్ట్ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. దీనిని త్రివిక్రమ్, కళ్యాణ్ కృష్ణ కురసాల లాంటి దర్శకులు తెరకెక్కించారు. వీటికి సంబంధించి ఎట్రీలను ఈ సంవత్సరం మార్చిలోనే తీసుకున్నారు.

కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సీజన్ కోసం దాదాపు 13 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో నాలెడ్జ్ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోను కూడా భారీ స్థాయిలో లాంఛ్ చేశారు. దీనిలోనే ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ ఆసక్తిగా సమాధానాలు చెప్పారు.

దీనిలో ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలను కూడా అడిగారు. ఈ సందర్భంగా అతడు తన దగ్గర ఆరు కుక్కలు ఉన్నాయని.. మరో వైపు గుర్రాలను పెంచుకోవడం అంటే ఎంతో సరదా అన్నారు రామ్ చరణ్. మగధీర సినిమాలో ఓ గుర్రాన్ని రామ్ చరణ్ బాద్ షా అంటూ పిలవడం మనం చూశాం. అతడు పెంచుకుంటున్న గుర్రాల్లో అది కూడా ఒకటి ఉందని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

మగధీర రిలీజయ్యాక అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటూ నవ్వులు పూయించారు రామ్ చరణ్. రామ్ చరణ్ బోర్ గా ఫీలయినప్పుడల్లా అదుర్స్ సినిమా చూస్తూ ఉంటారని.. అందులో ఎన్టీఆర్ కామెడీ అదుర్స్ అంటూ మెచ్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజుగా నువ్వు.. కొమరం భీమ్‌గా నేను ఎంత కష్టపడ్డామో తెలుసుగా.. అలాంటి గొప్ప యోధుల పాత్రల్లో నటించడం మా జన్మ ధన్యమైంది అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు.

రంగస్థలం సినిమాలో పృద్విరాజ్ సీన్లు తీసేయడానికి కారణం ఏంటో తెలుసా?

సుకుమార్ దర్శకత్వంలో సమంత రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. అప్పటివరకు క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ “రంగస్థలం” సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని బయట పెట్టాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో,అచ్చం పల్లెటూరి యువకుడిలా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత నటుడు రామ్ చరణ్ కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా లోజగపతిబాబు విలక్షణ నటుడి పాత్రలో అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఆది పినిశెట్టి రంగమ్మత్త పాత్రలో అనసూయ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

పృధ్విరాజ్ దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తిచేశారు. అదేవిధంగా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పినప్పటికీ, కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ పాత్రను ఎడిటింగ్ లో తీసేసారనీ తాజాగా పృథ్వి రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ మొత్తం చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ సన్నివేశాలు తొలగించడానికి కారణం ఏంటి అనే విషయాలను కూడా ఓ ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో నాపై సన్నివేశాలు అన్నింటినీ తెరకెక్కించారు, నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. కానీ అమెరికా నుంచి సుకుమార్ స్నేహితుడు ఈయనను ఎందుకు పెట్టుకున్నారు, ఈయన సినిమాలలో ఉంటే రావు గోపాల్ రావుల అవుతారని చెప్పారట అందుకోసమే నేను నటించిన సన్నివేశాలు అన్నింటిని తీసేశారని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తెలియజేశారు.ఇక ప్రస్తుతం పృథ్వి రాజ్ తెలుగు తమిళ సినిమాలలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.