Tag Archives: rangastalam

Anasuya: అరేయ్ చిట్టిబాబు అంటూ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అనసూయ?

Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అనసూయకు సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ రావడానికి కారణం రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అని చెప్పాలి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో నటించగా అనసూయ రంగమ్మత్త పాత్రలో నటించారు. ఇకపోతే తాజాగా అనసూయ రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది.

ఈ సినిమాలో అనసూయ వేషధారణ మాట తీరు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూతురు పుట్టింది కదా తనకు రంగమ్మత్త స్టైల్ లోనే శుభాకాంక్షలు ఎలా చెబుతారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ అరే చిట్టిబాబు పాప పుట్టిందంటగా చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు. జాగ్రత్తగా ఉండండే అంటూ అనసూయ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

చూడముచ్చటగా ఉన్నారు..
ఈ విధంగా అనసూయ మరోసారి చిట్టిబాబు అంటూ పిలవడంతో మరోసారి అభిమానులందరికీ కూడా రంగస్థలం సినిమా గుర్తుకు వస్తుందని చెప్పాలి ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు అనసూయ పుష్ప 2 సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Allu Ayan: అల్లు అర్జున్ కాకుండా అల్లుఅర్జున్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Allu Ayan: అల్లుఅర్జున్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ స్టార్ హీరో అల్లుఅర్జున్ కుమారుడిగా ఈయన అందరికీ సుపరిచితమే. అల్లు అయాన్, అల్లు అర్హ గురించి నిత్యం అల్లుఅర్జున్ అలాగే స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పిల్లలకు సంబంధించిన విషయాలను పంచుకుంటారు. ఇలా వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.

ఇలా అల్లు అయాన్ కిసంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదేవిధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ కుమారుడికి ఆయన ఫేవరెట్ హీరో కాదనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇలా అల్లు అర్జున్ కాకుండా అయాన్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఈయనకు ఒకరు కాదని ఇద్దరు ఫేవరెట్ హీరోలు ఉన్నారట తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అదే విధంగా మరొక హీరో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని అల్లు అర్జున్ ఓ సందర్భంలో తెలియజేశారు. రామ్ చరణ్ ఒక సినిమా విడుదల అయితే ఆ సినిమాలోని పాటలు మరొక సినిమా విడుదలయ్యే వరకు చూస్తూనే ఉంటారట.

Allu Ayanచెర్రీ మామ అంటూ పిలుస్తారు..


ఇక చరణ్ ను అయాన్ చెర్రీ మామ అంటూ ఎంతో ముద్దుగా పిలుస్తుంటారని అదే విధంగా రంగస్థలం సినిమాలో చరణ్ లుంగీ కట్టుకోవడంతో తనకు కూడా లుంగీ కావాలి అని మారం చేశారు అంటూ తన కొడుకుకు చరణ్ అంటే ఎంత ఇష్టమో అల్లు అర్జున్ ఓ సందర్భంలో తెలిపారు. అల్లు అర్జున్ కుమారుడికి మహేష్ బాబు రామ్ చరణ్ అంటే ఇష్టం అనే విషయం తెలియడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Anupama Parameswaran: ఆ అవకాశం మిస్ చేసుకుని ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను… అనుపమ కామెంట్స్ వైరల్!

Anupama Parameswaran: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్. అయితే ఈమె తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకొని తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక తనకు ఏ విషయం గురించి అయినా నిజాయితీగా మాట్లాడటం ఇష్టం అని ఏ విషయం అయినా తనకు ముక్కుసూటిగా చెబుతాను అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇక మనకు ఉన్నది చాలా చిన్న జీవితం ఈ జీవితంలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు చాలా మంచిగా ఉండాలని ఈమె తెలియజేశారు. అయితే కొందరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు జీవితాంతం మనల్ని బాధపెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అనుపమ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలుస్తోంది.

Anupama Parameswaran:రంగస్థలం సినిమాని వదులుకున్న అనుపమ…


మరి ఈమె జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటి అనే విషయాన్ని వస్తే అనుపమ కెరియర్ పరంగా తనకు రంగస్థలం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.ఈ విధంగా అనుపమ తప్పుకోవడంతో సమంత ఈ సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించారు. అయితే ఈ సినిమాని తాను ఎందుకు మిస్ చేసుకున్నానా అని ఇప్పటికీ బాధపడుతూ ఉంటానని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రంగస్థలం లిప్‌లాక్ సీన్ వెనుక ఇంత కథ నడిచిందా.. !

యూత్ ను టార్గెట్ చేస్తూ.. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా లిప్‌లాక్ సీన్ లు పెడుతున్నారు. ఇలాంటి సీన్ లను ట్రైలర్ రూపంలోనో లేదా పోస్టర్ రూపంలోనో విడుదల చేసి సినిమాపై ఎక్కువ అంచనాలను పెంచుతున్నారు దర్శక, నిర్మాతలు. అలా హీరో, హీరోయిన్ మధ్య పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసిన సినిమాలలో రామ్ చరణ్ రంగస్థలం ఒకటి.

దీనిలో హీరో, హీరోయిన్ లుగా రామ్ చరణ్, సమంత నటించిన విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మైత్రీ మూవీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి. చెవిటి వాడిగా చరణ్ నటన ప్రతి ఒక్కరినీ అలరించింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ముద్దు సీన్ పెద్ద హైలెట్ గా నిలిచింది. అప్పుడే నాగచైతన్యతో వివాహం అయిన సమంత.. ఇలాంటి సీన్ ఎలా ఒప్పుకుందనేది కూడా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ సినిమాను రామ్ చరణ్ కు వివరించే సమయంలో లిప్ లాక్ సీన్ చెప్పాడట. కానీ చరణ్.. ఉపాసాన బాధపడుతుంది.. వద్దు అని అన్నారట. కానీ షూటింగ్ కు వచ్చేసరికి.. రామ్ చరణ్ పెదాలు దగ్గరగా వస్తాయి.. ముద్దు పెట్టే వరకు మీరు వెళ్లండి.. మిగతాది గ్రాఫిక్స్ లో యాడ్ చేద్దాం అని సుకుమార్ సమంతకి చెప్పాడట.

కానీ షాట్ వచ్చేసరికి సమంత.. చరణ్ కు నిజంగానే ముద్దు పెట్టేసిందట. తర్వాత ఈ సీన్ గురించి సుకుమార్ పై చరణ్ అలిగాడట. ఆ తర్వాత లిప్ లాక్ సీన్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఆ వివాదం గురించి తర్వాత అందరూ మర్చిపోయరట.

రంగస్థలం సినిమాలో పృద్విరాజ్ సీన్లు తీసేయడానికి కారణం ఏంటో తెలుసా?

సుకుమార్ దర్శకత్వంలో సమంత రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. అప్పటివరకు క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ “రంగస్థలం” సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని బయట పెట్టాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో,అచ్చం పల్లెటూరి యువకుడిలా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత నటుడు రామ్ చరణ్ కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా లోజగపతిబాబు విలక్షణ నటుడి పాత్రలో అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఆది పినిశెట్టి రంగమ్మత్త పాత్రలో అనసూయ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

పృధ్విరాజ్ దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తిచేశారు. అదేవిధంగా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పినప్పటికీ, కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ పాత్రను ఎడిటింగ్ లో తీసేసారనీ తాజాగా పృథ్వి రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ మొత్తం చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ సన్నివేశాలు తొలగించడానికి కారణం ఏంటి అనే విషయాలను కూడా ఓ ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో నాపై సన్నివేశాలు అన్నింటినీ తెరకెక్కించారు, నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. కానీ అమెరికా నుంచి సుకుమార్ స్నేహితుడు ఈయనను ఎందుకు పెట్టుకున్నారు, ఈయన సినిమాలలో ఉంటే రావు గోపాల్ రావుల అవుతారని చెప్పారట అందుకోసమే నేను నటించిన సన్నివేశాలు అన్నింటిని తీసేశారని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తెలియజేశారు.ఇక ప్రస్తుతం పృథ్వి రాజ్ తెలుగు తమిళ సినిమాలలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘ఆ రోజు రామ్ చరణ్ కి అది చెప్పడానికి చాలా టెన్షన్ పడ్డా’ : సుకుమార్

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన కెరీర్లో ‘రంగస్థలం’ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రామ్‌చరణ్‌ హీరో, సమంత కథానాయికగా, 1980 నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్‌ సినిమా కథలకు కొత్త దారులు చూపించిన చిత్రమిది.

కమర్షియల్‌ చిత్రాల ట్రెండ్‌కి బ్రేకులు వేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ చెవిటి వాడిగా రామ్‌చరణ్‌ అద్భుతమైన నటనని పలికించాడు.తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సుకుమార్‌. రంగస్థలం కథ చెప్పినప్పుడు రామ్‌చరణ్‌కి బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఓకే చేశారట. కానీ అందులోని ఓ సీన్‌ చెప్పేటప్పుడు మాత్రం తాను చాలా టెన్షన్‌ పడ్డానని చెప్పాడు.

రామ్‌చరణ్‌ ఎలా రియాక్ట్ అవుతాడో, ఆయన దీన్ని తీసుకుంటాడా? లేదా? అని భయపడ్డాడట. ఆ సీన్‌ గురించి చెబుతూ, ప్రకాశ్‌ రాజ్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనకు అన్ని సపర్యలు హీరోనే చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మార్చడం, చివరికి టాయిలెట్‌ బ్యాగ్‌ తనే తీయాల్సి ఉంటుంది. ఈ లైన్‌ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, కానీ చెప్పాక రామ్‌చరణ్‌ మాత్రం మరో మాట లేకుండా చేసేద్దామని కూల్‌గా చెప్పారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సుకుమార్‌.

అది నిజంగా తనకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందన్నారు. ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. టెన్షన్‌ పడుతూనే ఈ సీన్‌ను వివరించాడట. కానీ చరణ్‌ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణమది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్‌చరణ్‌ వందకు వంద శాతం తన పాత్రకు న్యాయం చేశారని సుకుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నాన్న చిరంజీవితో కలిసి ఆచార్య మూవీలో ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. ఇక సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమాని రూపొందిస్తున్నారు…!!

ఆయన అలవాట్లతో ఆస్తి మొత్తం పోయింది : అనసూయ

బుల్లితెర ఫిమేల్ యాంకర్స్ లో జబర్దస్త్ బ్యూటీ అనసూయకు స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు.. ఆకర్షించే అందంతోపాటు అద్బుతమైన ప్రతిభ ఆమె సొంతం. టెలివిజన్ స్క్రీన్ పై తనదైన ముద్రవేసిన అనసూయ.. ఇప్పుడు వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోంది. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్లతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో అలరిస్తోంది.

అయితే.. ఇంత స్టార్ డమ్ రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ఎన్నో కష్టాలు, మరెన్నో ఇబ్బందులతోనే అనసూయ సినీ ప్రయాణం మొదలైంది. తెలుగు అమ్మాయైన అనసూయ ఎంబీఏ పూర్తి చేసి, మొదట్లో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జాబ్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. యాక్టింగ్ వైపు అడుగులు వేసింది.ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న క్రమంలోనే అనసూయకు ‘జబర్దస్త్’ ఆఫర్ వచ్చింది. ఈ కామెడీ షోతో వచ్చిన పాపులారిటీని సరిగ్గా ఉపయోగించుకున్న అనసూయ.. సినిమా అవకాశాలనూ అందుకుంది.

‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి సినిమాలతో సత్తాచాటింది. ఇప్పుడు.. దాదాపు అరడజను సినిమాలు చేతిలో ఉన్న ఈ బ్యూటీ.. కరోనా గోల లేకుంటే దాదా మూడ్నాలుగు సినిమాలతో ఇప్పటికే సందడి చేసేది.అయితే.. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను వెల్లడించింది. ఫ్లాష్ బ్యాక్ లో వీళ్లది రాయల్ ఫ్యామిలీ అంట. చాలా ఆస్తులు ఉండేవని, తమ ఇంట్లో గుర్రాలు కూడా ఉండేవని చెప్పింది.

ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదని వెల్లడించింది అనూ.అయితే.. తన తండ్రికి ఉన్న చెడు అలవాట్ల వల్లనే ఆస్తి మొత్తం పోయిందని చెప్పింది. వాళ్ల నాన్నకు గుర్రపు స్వారీలు, గ్యాంబ్లింగ్ వంటి హ్యాబిట్స్ ఉండేవట. వాటి ద్వారానే ఆస్తి మొత్తం కోల్పోవాల్సి వచ్చిందట. దీంతో.. వాళ్ల కుటుంబ పరిస్థితి మొత్తం మారిపోయిందట. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లో బస్సు టికెట్ కు సైతం డబ్బులు లేకపోతే.. నడుచుకుంటూ వెళ్లేదట..కానీ ఇప్పుడు మాత్రం తమ పరిస్థితి మెరుగుపడిందను చెప్పుకొచ్చింది అనసూయ…!!

‘రంగస్థలం’ కి సీక్వెల్ రానుందట.. ఎప్పుడో తెలుసా..??

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది ‘రంగస్థలం’ చిత్రం..ఈ సినిమాలో చరణ్ ఉత్తమ నటనను కనబరిచాడు.. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇది 2018లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి వీరిద్దరూ మరోసారి కలిసి చేయాలని అభిమానులు కోరుకున్నారు. మీడియాలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం..రంగస్థలం-2 సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేయాలనుకున్నట్లు సమాచారం. ఇవన్నీ త్వరలో జరుగునున్నాయి.రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు చాలా మంచి పేరు వచ్చింది. రంగస్థలంతో జాతీయ మీడియాలోనూ రాంచరణ్ కు గుర్తింపు దక్కింది. ఈ చిత్రం ఖచ్చితంగా నటుడు – దర్శకుడికి ఇద్దరికీ ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.తన ప్రస్తుత చిత్రం ‘పుష్పా’ను తీసిన వెంటనే సుకుమార్ రామ్ చరణ్ తో కలిసి పని చేస్తాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తానన్న సుకుమార్ దాన్ని పక్కనపెట్టి రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రంగస్థలం 2 తీస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.అయితే సుకుమార్- విజయ్ చిత్రం లైవ్ లోనే ఉందని.. ఈ ఊహాగానాలను చిత్ర నిర్మాతలు ఖండించారు, ఎటువంటి మార్పులు లేకుండా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోందని ధృవీకరించారు. కాబట్టి, పుష్పా తర్వాత విజయ్ దేవరకొండ చిత్రంతో సుకుమార్ ముందుకు సాగనున్నారు.

సుకుమార్ విజయ్ సినిమాను చుట్టే సమయానికి, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మరియు దర్శకుడు శంకర్ తో మరో సినిమాను కూడా పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘రంగస్థలం2’ తీసే చాన్స్ ఉంది. ఈ రెండవ చిత్రం పూర్తికావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది. ఇది రంగస్థలం సీక్వెల్ ఉంటుందని మాత్రం టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి…!!