Tag Archives: revanth reddy

Chiranjeevi: మెగా విందుకు హాజరైన రేవంత్ రెడ్డి.. చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం?

Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ నటుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇటీవల భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా చిరంజీవి ఎంతో అత్యుత్తమమైనటువంటి ఈ పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలో ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి చిరంజీవిని అభినందిస్తూ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.

భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి చిరంజీవికి శుభాకాంక్షలని తెలిపారు. అనంతరం ఈయన చిరంజీవితో మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా కాసేపు ముచ్చటించారు. ఇక ఈయనతో పాటు ఉపముఖ్యమంత్రి స్పీకర్ ఇతర తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు.

చిరంజీవికి అభినందనలు..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కన్నా ముందు పద్మవిభూషణ్ అందుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు . అక్కినేని పద్మ శ్రీ, పద్మభూషణ్ తో పాటు 2011లో కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది.

Karate Kalyani: సీఎం రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన కరాటే కళ్యాణి.. ఏం జరిగిందంటే?

Karate Kalyani: సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నంది అవార్డుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

చిత్ర పరిశ్రమలో కళాకారులకు ఇకపై నంది అవార్డులు కాకుండా గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇలా గద్దర్ పేరిట వచ్చే ఏడాది ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రముఖ నంది అవార్డుల పేరును మార్చడంతో కరాటే కళ్యాణి ఫేస్బుక్ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గాడ్సే అవార్డులు ఇస్తాను…

గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఇబ్బందే అయినా.. అది మీ ఇష్టం. తప్పేమీ లేదు కానీ.. అత్యుత్తమమైన నంది అవార్డుల పేరు మారిస్తే ఏ సీఎం అయినా తప్పే.. నంది చూసుకుంటాడులే అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా తాను గాడ్సే అవార్డులు కూడా ఇస్తానని అందుకోవాల్సిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటూ ఈమె పరోక్షంగా గద్దర్ ను అవమానిస్తూ కూడా చేసినటువంటి ఈ కామెంట్లు సంచలనంగా మారాయి.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆదేశాలతో తీరిన కుమారి ఆంటీ కష్టాలు.. మరింత పాపులర్ అయిన కుమారి ఆంటీ?

Revanth Reddy: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో ఎంతో ఫేమస్ అయ్యారు ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ జీవనోపాధి కోసం కష్టాలు పడుతున్నటువంటి ఈమె యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అత్యంత తక్కువ ధరలకు ఎన్నో రకాల వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఈమె అందరికీ అందించడంతో ఈమె వద్దకు ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తులు కూడా వచ్చి భోజనం చేసేవారు.

అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్స్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది దీంతో కొందరు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసేసారు. దీంతో ఈమె బిజినెస్ పూర్తిగా క్లోజ్ అయిందని అందరూ భావించారు అంతేకాకుండా ఈమెకు మద్దతుగా కొందరు నిలిచారు.

తాజాగా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి తిరిగి ఈమె ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవచ్చు అంటూ ఆదేశాలను జారీ చేశారు ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వారి పట్ల చూసి చూడకుండా వెళ్లాలి అంటూ ఈయన ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారి ఆంటీ కష్టాలు మొత్తం తీరిపోయాయని తెలుస్తుంది.

కుమారి ఆంటీకి అండగా సీఎం రేవంత్…

ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈమె తిరిగి తన ఫుడ్ బిజినెస్ ప్రారంభం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అండగా నిలవడంతో కుమారి ఆంటీ పాపులారిటీ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. కుమారి ఆంటీ మాటతీరుతో ఎంతోమంది రీల్స్ కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ఈమెకు చివరికి ఆ పాపులారిటీ ద్వారానే తన బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితికి వెళ్లారు కానీ సీఎం చొరవతో ఏదావిధిగా తన బిజినెస్ ప్రారంభించారు.

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపు మేరకు చివరికి ఈ సీఎం రేసు నుంచి ఉత్తమ్ రెడ్డి బట్టి విక్రమార్క తప్పుకోవడంతో ఆ అవకాశం రేవంత్ రెడ్డిని వరించింది అని చెప్పాలి. ఇక ఈయన ముఖ్యమంత్రిగా నిన్న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం కూడా చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా ఎలాంటి పొలిటికల్ నేపథ్యం లేకుండా స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి ఈయన అనంతరం జడ్పిటిసి గాను ఎంపీగాను కొనసాగుతూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. ఇలా రాజకీయాల్లో కొనసాగుతూ నేడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం తన కుటుంబం గురించి అలాగే తన భార్య పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ముఖ్యమంత్రిగా తెలంగాణ బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి నామినేషన్ సమయంలో అఫీడవిట్లో తన ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేశారు.

30 కోట్ల ఆస్తిపాస్తులు..

రేవంత్ రెడ్డి తన ఆస్తి మొత్తం విలువ 30,95,52,652 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. తన దగ్గర ఐదు లక్షల 34 వేల నగదుతో పాటు ఆయన భార్య గీతారెడ్డి దగ్గర 1235 గ్రాముల బంగారం విలువ 83,36,000 ఉన్నాయట. అలాగే 7,17,800 విలువచేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయట. వెండి 9,700 గ్రాముల వరకు ఉన్నట్టు సమాచారం.రేవంత్ రెడ్డి ఆయన భార్య దగ్గర పేరు మీద ఉన్న అప్పు 1,30,19,901 ఉందని తెలుస్తుంది. ఇక వీరికి ఒక మెర్సిడెజ్ బెంజ్ కార్, హోండా సిటీ ఉన్నాయి.ఇక రేవంత్ రెడ్డి దగ్గర 50,000 ఖరీదు చేసే రైఫిల్. రెండు లక్షల ఖరీదు చేసే పిస్టల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సమాచారం మొత్తం రేవంత్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు.

Revanth Reddy: రజనీకి ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకున్న రేవంత్…ఏ ఉద్యోగం ఇచ్చారు జీతం ఎంతో తెలుసా?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆరు గ్యారెంటీ హామీల ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ఇక రెండవ సంతకం దివ్యాంగ మహిళ అయినటువంటి రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ రేవంత్ రెడ్డి రెండవ సంతకం చేశారు.

ఇక ఈయన ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే రజిని ఆహ్వానించి ఆమెకు ప్రభుత్వ కొలువులో నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 17వ తేదీ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రజిని హైదరాబాద్ నగరం నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందినది. ఈమె లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదివారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఈమె తనకు ఉద్యోగం లేదు అంటూ తన బాధను మొత్తం చెప్పకున్నారు అయితే తన పరిస్థితి విన్నటువంటి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తన ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేస్తానని తెలియజేశారు.

టీఎస్‌ఎస్ఓసీఏ మేనేజర్ గా రజిని..

ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ మొదటి ఉద్యోగ నియామక పత్రకం పై సంతకం చేశారు.ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం కల్పించారు ఇక ఈమెకు నెలకు 50 వేల వరకు వేతనం రాబోతుందని నియామక పత్రాలలో పేర్కొన్నారు.

Telangana: రేపటి నుంచి టిఎస్ఆర్టిసి లో మహిళలకు ఉచిత ప్రయాణం…ఫ్రీ కదా అని ఎక్కారో 500 ఫైన్?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేశారు. ముఖ్యమంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించి అనంతరం మొదటి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

క్యాబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడారని ఈయన తెలియజేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకు మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అయితే ఈ ఉచిత ప్రయాణాన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 9వ తేదీ కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక బస్సులోకి ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా తమ ఆధార్ కార్డు కండక్టర్ కి చూపించాల్సిన అవసరం ఉంటుందని కండక్టర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత టికెట్ ఆ మహిళకు ఇస్తారు.

టికెట్ లేకపోతే జరిమానా…

ఈ టికెట్ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడి వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా కాకుండా ఉచితం కదా అని ఫ్రీగా ఎక్కి కూర్చుంటే మధ్యలో చెకింగ్ వచ్చినప్పుడు వారి దగ్గర ఆ టికెట్ లేకపోతే 500 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందని అందుకే తప్పనిసరిగా ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని వెళ్లి కండక్టర్ కి ఆధార్ నెంబర్ చెప్పి టికెట్ తీసుకోవడం కంపల్సరీ అని తెలుస్తుంది. టికెట్ తీసుకోకపోయినా లేదా తీసుకున్న టికెట్ మధ్యలో పడేసిన చెకింగ్ అధికారులు వచ్చినప్పుడు టికెట్ లేకపోతే ఫైన్ చెల్లించాల్సిందేనని తెలుస్తుంది.

Revanth Reddy -Gangavva: కాంగ్రెస్ గెలవగానే పార్టీ మార్చిన గంగవ్వ…గంగవ్వ పార్టీ మార్చిందంటూ ట్రోల్స్?

Revanth Reddy -Gangavva: మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందనే విషయాలన్నింటినీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో యూట్యూబ్ ఛానల్ కు విపరీతమైనటువంటి ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి గంగవ్వకు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఈమెకు ఒక మంచి ఫాలోయింగ్ రావడంతో బిగ్ బాస్ కి వెళ్లి వచ్చారు. అదేవిధంగా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇలా 60 సంవత్సరాల వయసులో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నటువంటి గంగవ్వతో ఎంతోమంది సినీ రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. ఇలా ఒక సినిమా విడుదల సమయంలో సెలబ్రిటీలు గంగవ్వతో మాట్లాడుతూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.

ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో కేటీఆర్ కూడా గంగవ్వతో ముచ్చట్లు పెట్టారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా గంగవ్వ టీం తో కలిసి కేటీఆర్ ముచ్చట్లు పెడుతూ పచ్చని పొలాలలో నాటుకోడి బిర్యానీ వండుతూ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కేటీఆర్ తో ముచ్చట్లు పెడుతూ బిఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేసినటువంటి గంగవ్వ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో అవ్వ కూడా పార్టీ మార్చిందని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి తో గంగవ్వ ముచ్చట్లు…

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రేవంత్ రెడ్డి గెలవగానే గంగవ్వ తనని కలిసి ఆయనతో ముచ్చట్లు పెట్టారు. అంతేకాకుండా తనకోసం ప్రత్యేకంగా మిర్చి బజ్జి తీసుకెళ్లి కూడా తినిపించారు ఇలా గంగవ్వ రేవంత్ రెడ్డితో ముచ్చట్లు పెడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెపై ట్రోల్ చేస్తున్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేసిన గంగవ్వ కాంగ్రెస్ గెలవగానే తను కూడా పార్టీ మార్చింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Balakrishna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య… అంచలంచలుగా ఎదిగావంటూ ప్రశంసలు?

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తెలంగాణ ఎన్నికలలో ఫలితాలు విడుదలైన అనంతరం కాంగ్రెస్ పార్టీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం గురించి ఇప్పటికే చర్చలు జరిగి అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించారు.

ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియమితులు కావడంతో ఎంతో మంది అభిమానులు రాజకీయ నాయకులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను.

నమ్మకాన్ని వమ్ము చేయకుండా…

ముఖ్యమంత్రి మీ పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది.

Congress Party: తెలంగాణ కాంగ్రెస్ సీఎం పదవి కంటే ఆ పదవికే పోటీపడుతున్న నేతలు?

Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి నిన్నటి వరకు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే వినిపించింది దీంతో కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఢిల్లీ పెద్దలను కలిసి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యారు దీనిని అధికారకంగా కూడా ప్రకటించారు.

ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు తాపత్రయపడిన రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించడంతో డిప్యూటీ సీఎం అన్న అవుదామని ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవికి అత్యధికంగా డిమాండ్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవి రేసులో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కతో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ డిప్యూటీ సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్నారు.

తనకు కీలకమైన పోర్ట్ ఫోలియోతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో కూడా పలువురు డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది.సీతక్కకు మంత్రి పదవి ఖాయమైనప్పటికీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను అధికంగా గెలుచుకున్నందుకు తమ వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని ఆదివాసి ఎమ్మెల్యేలు అధిక ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

సీతక్క పట్ల సానుకూలం..

ఇక సీతక్కకు మంత్రి పదవి ఇప్పటికే కారారు అయినప్పటికీ ఆమెకు డిప్యూటీ పదవి కూడా కట్ట పెట్టాలన్న ఆలోచనలు ఉన్నారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా సీతక్క పట్ల సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ముఖ్యమంత్రి పదవికి కాకుండా డిప్యూటీ సీఎం పదవి కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు మరి ఈ పదవి ఎవరిని వరిస్తుంది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్న విషయాలు త్వరలోనే తెలియని ఉన్నాయి.

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి… రేవంత్ కే మద్దతు తెలుపనున్న కాంగ్రెస్ పెద్దలు?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇలా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్న ఆందోళనలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పెద్దలతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఫలించాయని మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని విషయాన్ని ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క కొనసాగుతున్నారని సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పీఠంలో ఎవరు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం ఎంపికతో పాటు సీఎల్పీ నేత ఎంపికపై నాయకులు చర్చించారు.


రేవంత్ రెడ్డికే అధికార పీఠం…

ఇలా ఈ చర్చలు అన్నింటిలో కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డికి మద్దతు లభించిందని దీంతో ఆయనని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హై కమాండ్ హైదరాబాద్ వేదికగా మరి కాసేపట్లో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తే త్వరలోనే ప్రమాణ స్వీకారపు ఏర్పాట్లు కూడా నిర్వహించబోతున్నారని సమాచారం.