Tag Archives: savitri

Kavya Kalyan Ram: తెలుగమ్మాయి కావడమే నాకు ప్లస్ అయింది.. కావ్య కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

Kavya Kalyan Ram: హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. ఈ సినిమాలో శ్రీ సింహ కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఉస్తాద్ సినిమాకథపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈమె ఆశాభావం వ్యక్తం చేశారు .ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు కాలేజీలకు వెళ్ళగా అక్కడ మాకు భారీ స్థాయిలో స్పందన లభించిందని తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలుగు హీరోయిన్స్ గురించి కావ్య మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తెలుగు వారికి హీరోయిన్గా అవకాశాలు రాలేదన్న వార్త ఇండస్ట్రీలో తరచూ వినపడుతూనే ఉంటుంది.

ఇలా తెలుగు వారికి సినిమా అవకాశాలు ఉండవు అనే విషయం గురించి తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…ఇలా తెలుగువారికి హీరోయిన్గా అవకాశాలు రావడంలేదని ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాలేదని తెలిపారు.ఎందుకంటే సావిత్రి శ్రీదేవి వంటి ఎంతో గొప్ప నటీమణులు కూడా తెలుగు వారే ఇండియాలో ఇప్పటికీ వీరికన్నా అద్భుతంగా నటించిన, వీరికన్నా అద్భుతమైన సక్సెస్ చూసినటువంటి నటీమణులు లేరు.

Kavya Kalyan Ram: ఓకే భాషకే పరిమితం కాకూడదు…


ఇక నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయి కావడం నా అదృష్టం. నేను చేసిన మూడు సినిమాలలోని దర్శకులు కూడా తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని ఆ సినిమాలకు నన్ను ఎంపిక చేశారు. భాష వస్తే చాలు అవకాశం వస్తుందనుకోవడం పొరపాటు.నటీనటులు ఎప్పుడూ కూడా ఒకే భాషకు పరిమితం కాకూడదు అంటూ ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి హీరోయిన్ ఎవరో తెలుసా… ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా?

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోను పవన్ కళ్యాణ్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ఇక పవన్ కళ్యాణ్ గత కొత్త కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయనకు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు.ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం కోసం ఎంతోమంది హీరోయిన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈయన సినిమాలో ఛాన్స్ వస్తే చాలు చిన్న పాత్రలలో నటించడానికి కూడా హీరోయిన్స్ వెనకాడటం లేదు. అంతలా హీరోయిన్స్ పవన్ కళ్యాణం ఇష్టపడుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కి కూడా ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరోయిన్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: సావిత్రి గారు అంటే చాలా ఇష్టం…

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరోయిన్ గురించి మాట్లాడుతూ తనకు ఇష్టమైనటువంటి హీరోయిన్ మహానటి సావిత్రి అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఆమె సినిమాలన్నా నటన అన్న తనకు ఎంతో ఇష్టమని పవన్ తెలిపారు. ఇక నటనపరంగా కన్నా తన వ్యక్తిత్వం వల్ల సావిత్రి గారు అంటే తనకు చాలా ఇష్టమని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Savitri: ఆరోజు సావిత్రి బాగా తాగొచ్చు బోరున ఏడ్చింది… ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జమున!

Savitri: సీనియర్ నటిమని సావిత్రి గురించి పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి చివరి రోజులలో చాలా దుర్భరనీయమైన పరిస్థితులను ఎదుర్కొని మరణించారు.చిత్ర పరిశ్రమలో తన సహజ నటనతో ఎంతోమందిని మెప్పించిన ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఒకానొక సమయంలో స్టార్ హీరోలు కూడా ఈమె డేట్ ల కోసం ఎదురుచూసే స్థాయికి సావిత్రి ఎదిగింది.

ఇలా చిత్ర పరిశ్రమలో సహజ నటిగా మహానటి అనే బిరుదు సంపాదించుకున్న సావిత్రి వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఉదార స్వభావం కలిగి ఉండేవారు. తన వద్దకు ఎవరైనా ఏదైనా కష్టం వచ్చిందని వస్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా వారికి సహాయం చేసేవారు.అయితే ఈమె ఎప్పుడైతే నటుడు జెమినీ గణేషన్ను పెళ్లి చేసుకుందో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులుగా మారిపోయింది.

ఈమె పై ప్రేమతో కాకుండా ఈమె సంపాదించిన ఆస్తి కోసమే జెమినీ గణేషన్ తనని పెళ్లి చేసుకొని తనని చాలా ఇబ్బందులకు గురి చేశారని అందరికీ తెలిసిన సత్యం.ఇక ఇండస్ట్రీలో సావిత్రి జమున ఇద్దరూ అక్క చెల్లెలుగా ఉండేవారు. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు. అయితే తాజాగా జమున ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సావిత్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Savitri: జెమినీ గణేషన్ పెళ్లితో తలకిందులైన సావిత్రి జీవితం….

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ నేను సావిత్రి ఇద్దరు అక్కచెల్లెళ్లుగా ఉండే వాళ్ళం అయితే నా కుమారుడు బారసాల ఫంక్షన్ కోసం సావిత్రిని ఆహ్వానించాను. ఆరోజు ఆమె ఫుల్లుగా తాగి బారసాల కార్యక్రమానికి వచ్చిందని తెలిపారు. ఇలా తాగి నా కుమారుడిని ఎత్తుకొని ముద్దులు పెట్టిందని అనంతరం తనని ఒక గదిలోకి తీసుకెళ్లి తనని హత్తుకొని బోరున ఏడ్చిందని జమున తెలిపారు.నువ్వు చాలా అదృష్టవంతురాలివే చెల్లి మంచి భర్త కుమారుడు నిండు సంసారం కానీ నాకు ఆ అదృష్టం లేదు అంటూ సావిత్రి ఏడ్చిందని జమున అప్పటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సావిత్రి గురించి మాత్రమే కాకుండా ఇతర తారల గురించి ఇండస్ట్రీ ఎందుకు గొప్పగా చెప్పరు..!

సినీనటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ ఒకప్పడు హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు.అప్పట్లో జయప్రద శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ధీటుగా నిలిచారు. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా ఆ ఇద్దరు హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో సినిమాలు కొనసాగించేవారు. అంతేకాకుండా లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే లాంటి వారు ఇవాళ దేశం మొత్తం మీద జయప్రద లాంటి అందమైన తార ఇంకొకరు లేరు అనేశారు.

కానీ శ్రీదేవి మాత్రం కోట్లాది మంది ప్రేక్షకులకు కలలరాణి గా పేరు తెచ్చుకుంది. అలాంటి టాప్ టాప్ హీరోయిన్ లతో పాటుగా నటించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో మహానటి అనే గొప్ప మాటకు సావిత్రి అన్న పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ సావిత్రి తర్వాత ఎంతోమంది నటీమణులు గొప్ప గొప్ప సినిమాలు పాత్రలు చేశారని కానీ వారికి అలాంటి గుర్తింపు రాలేదని బాధపడతారు.

ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రి గారి తర్వాత అంత గొప్ప సినిమాలు వాణిశ్రీ చేశారు. కానీ ఎంతమంది వాణిశ్రీ గురించి చెబుతారు. అలాగే శారద గారు సెకండ్ ఇన్నింగ్స్ హీరోయిన్ గానే కాకుండా మదర్, పోలీస్ ఆఫీసర్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో కూడా నటించారు. పరుచూరిబ్రదర్స్ ఆమెకు అలాంటి పాత్రను సృష్టించారు.

ఉమెన్ ఇన్ తెలుగు అన్ని సినిమా తీసుకుంటే సావిత్రి తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడటం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా సావిత్రి తర్వాత అంతకంటే మంచి సినిమాల్లో నటించిన వారికి కూడా గౌరవం దక్కాలి కదా! వాణిశ్రీ శారద తర్వాత సీరియస్ రోల్స్ చేయడానికి నేను వచ్చాను పెద్ద హీరోలతో చేసే చిన్న చిన్న హీరోలతో ఎందుకు చేస్తావ్ అని నన్ను అన్న వారు కూడా ఉన్నారు. కానీ కేవలం పాత్రలు నచ్చినవి మాత్రమే నేను చేస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు.

సావిత్రి లాగా నేను కూడా మోసపోయాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ షాకింగ్ కామెంట్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి ఎన్నో వందల చిత్రాలలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా తన జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తను పుట్టడమే డైమండ్ స్పూన్ తో పుట్టానని, చివరికి అల్యూమినియం స్పూన్ కూడా దొరకని పరిస్థితికి వెళ్లానని తన జీవితంలో జరిగిన ఒడిదుడుకులు గురించి వెల్లడించారు.

తనకు 4అన్నయ్యలు ఒక తమ్ముడు అని ఎక్కడికి వెళ్లిన వారు తనను ఎంతో బాగా చూసుకునే వారని సుధ వెల్లడించారు. అయితే తన తండ్రికి క్యాన్సర్ రావడం వల్ల ఉన్న డబ్బులు మొత్తం నాన్నకు చికిత్సకు సరిపోయాయని ఆ సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించామని అలా నాన్నకు అనారోగ్యం చేయటం వల్లే కుటుంబం కోసం తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని సుధా తెలియజేశారు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నటిగా మంచి గుర్తింపు సంపాదించుకునప్పటికీ తాను బాగా మోసపోయానని వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు షూటింగుకి వెళ్తే ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చే దాన్ని ఆ సమయంలో తనకు కావలసిన పనులను చేయడం కోసం పూర్తిగా మరొకరిపై ఆధారపడ వలసి వచ్చిందని ఇలా వేరొకరిని నమ్మి వారి చేతుల్లో తాను సంపాదించిన డబ్బులు పెట్టడం వల్ల పూర్తిగ మోసపోయానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

అప్పట్లో సావిత్రి ఏ విధంగా అయితే ఇతరులను నమ్మి తన సర్వస్వం కోల్పోయిందో ఒకానొక సమయంలో నేను కూడా అలాగే ఎంతో డబ్బును నష్టపోయానని సుధా వెల్లడించారు. అయినా నా కష్టాన్ని దోచుకొని తిన్న వారికి ఏమాత్రం సహించదని, ఇది తప్పుని వారు తెలుసుకున్నప్పుడే ఈ విధమైనటువంటి తప్పులు జరగవని ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన డబ్బు గురించి తెలియజేశారు.

వాణిశ్రీ మొదటి పేరు రత్నకుమారి అనే ఈ విషయం మీకు తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి అందాల తార సావిత్రి తర్వాత అంతటి అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో వాణిశ్రీ ఒకరని చెప్పవచ్చు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె అప్పట్లో ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. చాలామంది శ్రీవాణి కొప్పు కట్టు బొట్టు గురించి మాట్లాడుకోవడం గమనార్హం.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోయిన్ గా కాకుండా పలు కామెడీ పాత్రల్లో నటించే వారు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఈమె పేరు శ్రీ కాకుండా రత్న కుమారి అనే పేరుతో నటించారు.’అలెగ్జాండర్’ సినిమాలో నటించడం కోసం వాణిశ్రీ ని మేకప్ వేసి తీసుకురమ్మని కాంతారావు, రాజనాల చెప్పగా ఆమెకు మేకప్ వేసి సెట్ కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆమెకు ఫోటోగ్రఫీ తీయగా చూడగానే కృష్ణస్వామి, నాగరాజారావు ఈ అమ్మాయి సినిమాలకు పనికిరాదని తేల్చి చెప్పారు.

ఆ తర్వాత కొన్ని రోజులకే రణభేరి అనే సినిమాలో కాంతారావు సరసన హీరోయిన్ గా వాణిశ్రీని తీసుకోగా నిర్మాతలకి చెప్పి వాణిశ్రీకు వ్యాంప్ క్యారెక్టర్,రాజశ్రీని హీరోయిన్‌గా ఒప్పించారు కాంతారావు.అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత కాంతారావు మాట నిజం అయింది వాణిశ్రీ వ్యాంప్ క్యారెక్టర్ కు అద్భుతంగా సెట్ అయిందని పలువురు భావించారు. ఈ క్రమంలోనే ఎప్పుడు వ్యాంప్ క్యారెక్టర్ల అంటూ బాధ పడిన వాణిశ్రీ తో కాంతారావు త్వరలోనే మా ఇద్దరం కలిసి నటించే ఈ రోజు వస్తుందని చెప్పాడు. ఆ విధంగానే కాంతారావు వాణిశ్రీ జంటగా దేవుని గెలిచిన మానవుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో వాణిశ్రీ పేరు రత్నకుమారి కాగా ఆమె వాణిశ్రీ గా ఎలా మారింది అనే విషయానికి వస్తే ఎస్ వి రంగారావు రత్నకుమారిగా ఉన్నటువంటి తన పేరును వాణిశ్రీ గా మార్చారు. ఎస్ వి రంగారావు ప్రొడక్షన్ పేరు వాణిశ్రీ కావడంతో రత్నకుమారి పేరును తీసేసి తన ప్రొడక్షన్ పేరును వాణిశ్రీగా పెట్టారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెకు వాణిశ్రీ గా అందరికీ పరిచయం అయింది.