Tag Archives: shed tears

Babu Mohan: చిన్నతనంలోనే అమ్మను కోల్పోయాం.. మా నాన్న ఎక్కడున్నారో తెలియదు… స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్!

Babu Mohan:బాబు మోహన్ పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తన నటనతో అందరిని మెప్పించిన ఈయన ప్రస్తుతం సినిమాలలో నటించకుండా రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి బాబు మోహన్ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఆదివారం జీ తెలుగులో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బాబు మోహన్ పిల్లలు వేసినటువంటి ఒక స్కిట్ చూసి స్టేజ్ పైన ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి స్కిట్ చేశారు.

ఇది చూసినటువంటి బాబు మోహన్ తన ఫ్యామిలీని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… నాకు మాట్లాడటానికి కూడా రావడం లేదు అంటూనే ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి కష్టాలన్నీ అనుభవించాము నేను మూడో తరగతిలో ఉన్న సమయంలోనే మా అమ్మ చనిపోయింది అప్పటికి నాకు ఒక చిన్న చెల్లి కూడా ఉంది తనకు నేనే జడలు వేసి అన్నం తిని పెట్టి అన్ని పనులు చూసుకునేవాడిని.

Babu Mohan:

ఇక నాన్న మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు అలాంటి సమయంలో మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరిగామని ఈ సందర్భంగా బాబు మోహన్ తన చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ ప్రోమో చూసిన వారందరూ అందరిని తెరపై నవ్విస్తూ ఉండే బాబు మోహన్ జీవితంలో ఇంత కన్నీటి గాధ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Dhanraj: నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలియదు అంటూ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న ధనరాజ్!

Dhanraj: ధనరాజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించినటువంటి ఈయన తెలుగు బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ అందరిని మెప్పించారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమంలో ధనాధాన్ ధనరాజు పేరిట ఈయన భారీ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా 10 వారాల పాటు కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండి తెర సినిమాలలో కూడా బిజీగా ఉన్నటువంటి ఈయన జీ తెలుగులో ప్రసారమవుతున్నటువంటి ఫ్యామిలీ నెంబర్ వన్ అనే కార్యక్రమంలో హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ధనరాజ్ వేదికపై తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆయనని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి నా తండ్రి ఎలా ఉంటారనే విషయం తెలియదు. తండ్రి ఆలనా పాలనలో నేను పెరగలేదని తెలిపారు. నా తండ్రి ఇలా ఉంటారా అలా ఉంటారా అని ఊహించుకునే వాడినని తెలిపారు.


Dhanraj: రక్తసంబంధీకులే లేరు…


ఇక నాకు చిన్నప్పుడు నా అనే రక్త సంబంధీకులు అంటూ ఎవరూ లేరు పెళ్లి జరిగిన తర్వాత నా కొడుకులే నా రక్తసంబంధీకులు అంటూ ఈయన తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకొని తన ఫ్యామిలీని చూపించారు. అయితే తన తండ్రి ఇలా వేదికపై ఎమోషనల్ కావడంతో తన పెద్ద కుమారుడు వేదిక పైకి వెళ్లి తన తల్లి తండ్రి తన ప్రపంచం అంటూ తాను కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ధనరాజ్ తన తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా అందరికీ కన్నీళ్లు తెప్పించారని తెలుస్తోంది.

Tamannah: అభిమాని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తమన్న… వైరల్ అవుతున్న వీడియో?

Tamannah: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు అనే విషయాన్ని ప్రకటించారు.

ఇలా గత కొంతకాలంగా తమ ప్రేమా విషయాన్ని రహస్యంగా దాచినటువంటి ఈ జంట తరచూ మీడియా కంటికి చికారు. ఇలా జంటగా కనిపించడంతో ఇద్దరు మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన తమన్నా ఇద్దరం ప్రేమలో ఉన్నాము అనే విషయాన్ని ప్రకటించారు. దీంతో ఒకసారిగా తమన్నా విజయ్ వర్మ ఎంతో పాపులర్ అయ్యారు.

ఇకపోతే తమన్నా తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఇలా ఈమె ముంబై ఎయిర్పోర్టులో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు తనని చుట్టుముట్టేశారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా తమన్న కాళ్లపై పడి తనకు పాదాభివందనం చేశారు.ఇలా తమన్నా పాదాభివందనం చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిన తమన్నా తనని దగ్గరకు తీసుకున్నారు.

Tamannah: తమన్నా టాటూ వేయించుకున్న అభిమాని…


అనంతరం ఆ అభిమాని తమన్నకు బొకే ఇవ్వడమే కాకుండా తన చేతి పై ఉన్నటువంటి తమన్న టాటూని చూపించడంతో ఒక్కసారిగా తమన్న ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక అభిమాని చేతిపై తమన్నా టాటూ మాత్రమే కాకుండా లవ్ యు తమన్నా అంటూ కూడా రాయించుకోవడంతో తన పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి ఒక్కసారిగా ఈమె ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా తనపై చూపిస్తున్నటువంటి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Actress Sadha: ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగడం లేదు… ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న సదా!

Actress Sadha:జయం సినిమాలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ ఒక డైలాగుతో ఎంతో ఫేమస్ అయ్యారు నటి సదా.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అవకాశాలను అందుకొని హీరోయిన్ గా ఎంతో బిజీ అయ్యారు. అయితే తాజాగా సదా సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.

ఇలా సినిమాలకు దూరమైనటువంటి సదా ఫలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు సదా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
సదా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఒక రెస్టారెంట్ కూడా రన్ చేస్తున్నారు.

ముంబైలో ఈమె ఎర్త్ లింగ్స్ కేఫే పేరిటరెస్టారెంట్ నడుపుతుంది అయితే ఈ రెస్టారెంట్ చూసుకోవడం కోసం ఈమె తన పనులన్నింటినీ పక్కనపెట్టి ఈ రెస్టారెంట్ ను ఎంతో అందంగా తీర్చిదిద్ది నడుపుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సంపాదించుకోగా ఈ ప్లేస్ ఓనర్ తనని కాళీ చేయమని చెప్పారంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

2019 ఏప్రిల్ 23వ తేదీ ఈ రెస్టారెంట్ ప్రారంభించాను అని తెలిపారు. అయితే రెస్టారెంట్ ప్రారంభించడానికి ముందు ఇక్కడ అంతా చాలా చండాలంగా ఉండేది అయితే కరోనా సమయంలో తన రెస్టారెంట్ కు కస్టమర్లు రాకపోయినా అధిక సమయం ఇక్కడే ఉంటూ తన రెస్టారెంట్ ను చాలా అందంగా తీర్చిదిద్దుకున్నానని సదా తెలిపారు.

Actress Sadha: కన్నీళ్లు ఆగలేదు….

కరోనా సమయంలో తన రెస్టారెంట్ నడవకపోయినా సరైన సమయానికి అద్దె చెల్లించినప్పటికీ ఓనర్ మాత్రం ఖాళీ చేయమని తనకు నెలరోజులపాటు గడువు ఇచ్చారని తెలిపారు. ఇది నాకు పెద్ద షాకింగ్ విషయమే అని చెప్పాలి.అయితే ఈ రెస్టారెంట్ వదిలి వెళ్లిపోవడం తన వల్ల కాలేదని కన్నీళ్లు కూడా ఆగడం లేదు అంటూ ఈ సందర్భంగా సదా కన్నీటి పర్యంతరం అయ్యారు.

Virupaksha: విరూపాక్ష సక్సెస్.. ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్!

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు విరూపాక్ష సినిమా ద్వారా వచ్చారు.

గత రెండు సంవత్సరాల క్రితం ఈయన తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి విరూపాక్ష సినిమాలో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా సాయి ధరమ్ తేజ్ నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇదే విషయాలను పలువురు ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ సినిమాని పూర్తి చేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సాయిధరమ్ తేజ్ రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండకుండా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను తన భుజాలపై వేసుకొని వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ భారీ స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో చిత్ర బృందం సైతం ప్రేక్షకులతో కలిసి థియేటర్లో ఈ సినిమాని వీక్షించారు. అయితే థియేటర్లో సినిమాకి వస్తున్న ఆదరణ చూసి సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

Virupaksha: రెండేళ్ల నరకానికి సరైన ఫలితం…

ఈ క్రమంలోనే షో పూర్తయిన తర్వాత బయటికి వచ్చిన అనంతరం ఈయన దర్శకుడు కార్తీక్ ను కౌగిలించుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండేళ్ల పాటు అనుభవించిన నరకానికి సరైన ఫలితం దక్కిందని పలువురు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.ఇక పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను కూడా రాబడితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

Anchor Anasuya: మొదటిసారి మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ… జీవితానికి ఇది చాలంటూ ఎమోషనల్!

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ ఒకరు.ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా అనసూయ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నేను ఎమోషనల్ అవుతున్నాను. మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు రంగ మార్తాండ సినిమాలో నేను నటించాను. నా జీవితానికి ఇది చాలు నేను నిన్నే సినిమా చూశాను.ఆల్రెడీ నటసామ్రాట్ చూసి ఏడ్చారు కదా.. మళ్లీ దీనికి ఏం ఏడుస్తాంలే అనుకున్నాను. కానీ.. థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక ఒక ఆడియెన్ గా చూశాను. 


Anchor Anasuya:ఎంతో పుణ్యం చేసుకున్నా…


ఇలా ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమాగా గుర్తుండిపోతుంది. ఇందులో నటించిన వారితో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చిందిఅంటూ ఈమె కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Samantha: వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. గుణశేఖర్… అసలేం జరిగిందంటే?

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ వ్యాధి కారణంగా ఈమె నటించాల్సిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం వాయిదా పడ్డాయి.ఇలా అనారోగ్యంతో బాధపడుతూనే ఒకవైపు చికిత్స తీసుకుంటూ మరోవైపు ఈమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు.

ఇక తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ క్రమంలోనే సమంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గుణ శేఖర్ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక్కడు సినిమాని ఇప్పటికి ఎంతో ఆదరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.

ఇక ఈ సినిమాకి ముగ్గురు హీరోలు కథకు కథానాయకుడు దేవ్ మోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత.ఇక ఈ సినిమాని తెర వెనుక ఉండి నడిపిస్తున్న దిల్ రాజు గారు కూడా ఈ సినిమాకి హీరో అంటూ ఈయన శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

Samantha: గుణశేఖర్ మాటలకు ఎమోషనల్ అయిన సమంత….

ఇక గుణశేఖర్ వేదికపై ఎమోషనల్ అవడంతో అక్కడే ఉన్నటువంటి సమంత కూడా ఎమోషనల్ అవుతూ ఏకధాటిగా కన్నీళ్లను కార్చింది. ఇలా తన పరిస్థితిని తలుచుకొని సమంత ఏకధాటిగా ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకున్నారు. అయితే అభిమానుల అరుపులకు ఈమె తేరుకొని అనంతరం నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సమంతకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

Anchor Suma: యాంకరింగ్ కు గుడ్ బై చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుమ… అదే కారణమా?

Anchor Suma: బుల్లితెర స్టార్ మహిళగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని బుల్లితెర పై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్ ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలు అలాగే సినిమా ఈవెంట్లలో కూడా సుమ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే తాజాగా వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమంలో భాగంగా సుమ తన కెరియర్ గురించి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలియజేశారు. ఈమె కొంతకాలం పాటు యాంకరింగ్ కు విరామం ప్రకటించబోతున్నానని తెలియజేసి అందరికి షాక్ ఇచ్చారు.

ఈ విధంగా సుమ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు కొంతకాలంగా ఒక వ్యాధితో బాధపడుతున్నారని అయితే ఈ వ్యాధి కారణంగానే ఆమె కొంతకాలం పాటు తన యాంకరింగ్ కు విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమ కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు.

Anchor Suma: చర్మ సమస్యలతో బాధపడుతున్న యాంకర్ సుమ…

కెరియర్ మొదట్లో తనకు మేకప్ ఎలా వేసుకోవాలి ఎలా తీయాలి అనే విషయం తెలియక తన చర్మం మొత్తం డామేజ్ అయిందని దాంతో తాను కీలాయిడ్ టెండెన్సీ అనే ఇన్ఫెక్షన్ కి గురయ్యానని తెలిపారు.ఈ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మం పై ఒకచోట గాయం అయితే ఆ గాయం చర్మం మొత్తం వ్యాప్తి చెందుతుందట.అందుకే సుమ కొంతకాలం పాటు ఎలాంటి మేకప్ లేకుండా పూర్తిగా తన షూటింగులకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Samantha: అనారోగ్యం తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన సమంత.. ఆరోగ్యం పై స్పందిస్తూ కన్నీళ్లు పెట్టిన నటి!

Samantha: సమంత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో పెద్ద ఎత్తున నిలుస్తున్నారు.ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అంటే సోషల్ మీడియాలో వార్తల రావడంతో ఈ వార్తలపై సమంత స్పందిస్తూ తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ వ్యాధి కారణంగా తాను ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాననీ తాను ఆ వ్యాధితో పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఈ విధంగా సమంత అనారోగ్యం గురించి ఎంతోమంది స్పందిస్తూ తాను క్షేమంగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇకపోతే సమంత నటించిన పాన్ ఇండియా చిత్రం యశోద సినిమా నవంబర్ 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లకు కూడా సమంత దూరంగా ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక రికార్డు ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన అనారోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తాను భయంకరమైన వ్యాధితోనే పోరాడుతున్నానని అయితే ఈ వ్యాధితో యుద్ధం చేసే చివరికి తానే గెలుస్తానని ఈమె ధీమా వ్యక్తం చేశారు. అయితే తన జీవితంలో ఎన్నో మంచి రోజులు చెడు రోజులు వచ్చాయి. ఒక అడుగు ముందుకు కూడా వేయలేకపోతున్నాననే భావన నుంచి తాను జీవితంలో చాలా వరకు ముందుకు వచ్చానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Samantha: నేనింకా బ్రతికే ఉన్నా…


ఇకపోతే నా అనారోగ్యం గురించి చాలామంది ఎన్నో రకాల వార్తలు రాశారు. కొన్నిసార్లు ఆ వార్తలు చూసినప్పుడు బాదేస్తుందనీ, వాటి గురించి తాను పట్టించుకోనని తెలిపారు.సమంత ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉందన్నట్టు వార్తలు రాశారు. ప్రస్తుతానికి నేను బతికే ఉన్నానని ఇంకా చచ్చిపోలేదని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అనారోగ్య పరిస్థితి గురించి గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Allu Arjun: తమ్ముడి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్… వైరల్ అవుతున్న ఫోటోలు!

Allu Arjun: సాధారణంగా మనం ఏదైనా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక కొన్నిసార్లు కంటతడి పెట్టుకుంటాము.మన గురించి ఎవరైనా ఎమోషనల్ గా చెప్పిన లేకపోతే ఏదైనా బాధాకర సన్నివేశాలు తెలిసిన వెంటనే కళ్ళ నుంచి నీళ్లు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా అల్లు అర్జున్ సైతం తన ఎమోషన్ ని దాచుకోలేక కంటతడి పెట్టుకున్నారు. ఇలా అల్లు అర్జున్ కంటతడి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో.దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మూడేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శిరీష్ అను ఇమ్మానుయేల్ మధ్య ఉన్నటువంటి రొమాంటిక్ లవ్ సన్నివేశాలు, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ యువతను బాగా ఆకట్టుకోనీ ఈ సినిమాకు మంచి హిట్ అందించారు. ఈ విధంగా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదికపై అల్లు అర్జున్ గురించి శిరీష్ మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ కి తమ్ముడిగా పుట్టినందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి. ఆయన నన్ను తమ్ముడిలా కాకుండా ఒక కొడుకుల ట్రీట్ చేస్తారు.

Allu Arjun: నన్ను కొడుకులా ట్రీట్ చేస్తారు…

సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేస్తే ముందు మై బేబీ సిరి అంటూ పోస్ట్ చేస్తారని చాలా రోజుల తర్వాత అన్నయ్యను కలిస్తే కనుక బుగ్గలు గిల్లి తనని ముద్దు చేస్తారని శిరీష్ తెలిపారు. నేను జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అవేవీ మిగల్చకుండా అన్ని నాకోసం చేసి పెట్టారు. అందుకు అన్నయ్యకు థాంక్స్ అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన అన్నయ్య గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.