Tag Archives: sister

Aadi Reddy: లక్షల్లో సంపాదిస్తున్న ఆదిరెడ్డి చెల్లికి పెళ్లి చేయకపోవడానికి కారణమేంటో తెలుసా?

Aadi Reddy: ఆదిరెడ్డి పరిచయం అవసరం లేని పేరు ఒక కామన్ మాన్ గా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించినటువంటి రివ్యూలు ఇస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ఆదిరెడ్డికి ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ఈయన బయటకు వచ్చారు.

ఒకప్పుడు కఠిన పేదరికంలో ఉన్నటువంటి ఈయన బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ భారీగా సంపాదించారు. ఇకపోతే ఒకానొక సమయంలో ఈయన లక్షల్లో ఆదాయం వచ్చిందని కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆదిరెడ్డి లక్షల్లో సంపాదించడమే కాకుండా కారు బంగ్లాలు అంటూ నేడు గొప్ప స్థాయికి చేరుకున్నారు. అయితే ఇటీవల ఆదిరెడ్డికి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ప్రశ్న ఎదురయింది.

లక్షల్లో సంపాదన ఆస్తులు బంగ్లాలు కార్లు ఉన్నా కూడా ఎందుకని మీరు మీ చెల్లికి పెళ్లి చేయలేదు అనే ప్రశ్న ఆదిరెడ్డికి ఎదురయింది. ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మి ప్రస్తుతం తన ఇంట్లోనే ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నా చెల్లెలు నాగలక్ష్మికి ఐదు శాతం మాత్రమే చూపు ఉంది ఆమెకు ఆపరేషన్ చేయించిన కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పారు.

కంటి చూపు రాదు…

ఒకసారి ఇంట్లో మొత్తం తిరిగింది అంటే ఆమె ఏ వస్తువు ఎక్కడ ఉందనే విషయాలను గుర్తిస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసే అత్తారింటికి పంపించి అక్కడ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్న ఉద్దేశంతోనే నేను తనకి పెళ్లి చేయలేదని తన చెల్లెలను తన భార్య కవిత చూసుకుంటుందని వారిద్దరూ చాలా మంచిగా ఉంటారు అంటూ ఈ సందర్భంగా ఆదిరెడ్డి తన చెల్లికి పెళ్లి చేయడం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Ramya Krishna: ఓకే నటుడికి కూతురుగా, భార్యగా, చెల్లిగా నటించిన రమ్యకృష్ణ… ఆ నటుడు ఎవరో తెలుసా ?

Ramya Krishna: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాలో ఒక్కో విధమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఒక సినిమాలో ఒక నటుడికి చెల్లెలుగా నటిస్తే మరొక సినిమాలో భార్యగా నటించాల్సి ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది భార్యాభర్తలుగా అన్నా చెల్లెలుగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ మాత్రం ఒక నటుడితో చెల్లిగా భార్యగా కూతురిగా నటించి మెప్పించారు.

ఈమె ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలు సరసన నటించే సందడి చేశారు. అయితే ఇండస్ట్రీలో ఈమె ఒక నటుడికి కూతురిగా చెల్లిగా భార్యగా కూడా నటించారు. ఇలా అన్ని రకాలుగా ఆ నటుడితో రమ్యకృష్ణ నటించిన సందడి చేశారు. మరి రమ్యకృష్ణ నటించిన ఆ హీరో ఎవరు? ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే?

రమ్యకృష్ణ నటుడు నాజర్ తో కలిసి వివిధ సినిమాలలో ఒక్కో పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. విలన్ పాత్రలలో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటుడు నాజర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణకు భర్త పాత్రలో నటించారు. ఇందులో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించగా నాజర్ బిజ్జల దేవుడి పాత్రలో నటించారు.

Ramya Krishna: విలన్ గా మెప్పించిన రమ్యకృష్ణ..

రజనీకాంత్ సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ విలన్ పాత్రలో నటించారు. నీలాంబరి పాత ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమ్యకృష్ణ ఈ సినిమాలో నాజర్ కి చెల్లెలు పాత్రలో నటించారు. ఇలా విలన్ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించిందని చెప్పాలి. ఇక తమిళంలో వంత రాజవతాన్ వరవెన్ సినిమాలో రమ్యకృష్ణ నాజర్ కూతురి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మంచి విజయం అయింది. ఈ సినిమాకి రీమేక్ చిత్రంగా తెలుగులో అత్తారింటికి దారేది సినిమా వచ్చింది. ఈ సినిమాలో నదియా రమ్యకృష్ణ పాత్రలో నటించారు.

Ram Gopal Varma: వర్మను చూసి అమ్మాయిల పిచ్చోడు అనుకుంటారు. అసలు విషయం బయట పెట్టిన సోదరి విజయలక్ష్మి…!

Ram Gopal Varma:టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు చిరునామాగా నిలిచిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో వివాదాల ద్వారా నిత్యం వార్తల్లో ఉంటారు.దర్శకుడిగా ఒకప్పుడు ఎంతో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల పై కన్న సోషల్ మీడియా పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.

Ram Gopal Varma: వర్మ వ్యక్తిత్వం గురించి అసలు విషయాలు బయట పెట్టిన సోదరి విజయలక్ష్మి… ఏమన్నారంటే?

ఇక వర్మ ఏం మాట్లాడినా దానిలో ఎంతో లాజిక్ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే వర్మ ఇప్పుడే ఇలా ఉన్నారా లేదా చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఈ క్రమంలోని సోదరి విజయలక్ష్మి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా వర్మ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Ram Gopal Varma: వర్మ వ్యక్తిత్వం గురించి అసలు విషయాలు బయట పెట్టిన సోదరి విజయలక్ష్మి… ఏమన్నారంటే?

ఈ సందర్భంగా వర్మ సోదరి విజయలక్ష్మి ఓ ఇంటర్వ్యూ ఛానల్ తో మాట్లాడుతూ అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా ఎంతో సరదాగా భిన్నంగా ఆలోచించే వ్యక్తిత్వం కలవాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే మేము చిన్నప్పుడు మా మామయ్యతో కలిసి సినిమాకి వెళ్ళామని అయితే ఆ సినిమాలో విలన్ ట్రైన్ పేల్చడం కోసం ఒక బాంబు టైమ్ సెట్ చేసి ట్రైన్ పెల్చేసాడు. ఆ సన్నివేశాన్ని చూసిన మా అన్నయ్య మన దేశంలో ఎప్పుడు ట్రైన్స్ టైం కి రావు కదా అతను ఎలా సెట్ చేసి పేల్చాడు అంటూ ప్రశ్న వేశారు.ఇలా ఎంతో లాజికల్ ప్రశ్నలు అడుగుతూ అందరిని ఆలోచింప చేసేవాడు అంటూ విజయలక్ష్మి తెలిపింది.

వారి సంతోషం కోసమే అలా…


ఇక అన్నయ్య అమ్మాయిల పిచ్చోడని చాలా మంది అనుకుంటారు. నిజానికి తను ఏం మాట్లాడినా అమ్మాయిలు సంతోషంగా ఉండేలా మాట్లాడుతారని తన సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ క్రమంలోనే చిన్నప్పుడు నా స్నేహితురాలు ఇంటికి రావడంతో తనని చూసిన వర్మ మీ కళ్ళు బాగున్నాయని తనతో చెప్పాడు ఆ మాట విన్న నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని అయితే తాను అన్నయ్య పొగిడాడని ఎంతో సంతోష పడుతున్న సమయంలో తనను సరిగ్గా చూసావా లేదా తనకు మెల్లకన్ను ఉందని చెప్పాను. అయితే ఆ మాటకు వర్మ నేను అసలు ఆ అమ్మాయిని చూడలేదు ఏదో అలా సరదాగా చెప్పానని చెప్పారని విజయలక్ష్మి తెలిపారు.అన్నయ్య ఏం మాట్లాడినా వారి సంతోషం కోసమే మాట్లాడతారు కానీ అన్నయ్య అమ్మాయిల పిచ్చోడు మాత్రం కాదు అంటూ ఈ సందర్భంగా విజయలక్ష్మి వ్యక్తిత్వం గురించి వెల్లడించారు.

Singers Dance Show: అక్కాచెల్లెళ్ల డ్యాన్స్ తో నెటిజన్లు ఫిదా..! మీరూ ఓ లుక్కేయండి..!

Singers Dance Show: సింగర్ మంగ్లీ.. పేరు తెలియని వారు ఉండరు. ఎక్కువగా బతుకమ్మ సాంగ్స్ పాడుతూ బాగా పాపులర్ అయ్యారు. తర్వాత ఆమె ట్యాలెంట్ ను చూసి ఎన్నో సినిమాల్లో పాటలు పాడేందుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి ఎన్నో ఫోక్ సాంగ్స్ ను పాడింది.

Singers Dance Show: అక్కాచెల్లెళ్ల డ్యాన్స్ తో నెటిజన్లు ఫిదా..! మీరూ ఓ లుక్కేయండి..!

ఇలా ఆమె తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. ఇటీవల ఆమె కవర్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ పుష్పలోని సమంత చేసిన ఐటం సాంగ్ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ అనే చెప్పాలి.

Singers Dance Show: అక్కాచెల్లెళ్ల డ్యాన్స్ తో నెటిజన్లు ఫిదా..! మీరూ ఓ లుక్కేయండి..!

ఎందుకంటే.. ఆ సాంగ్ ప్రతీ ఒక్కరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఐటెం సాంగ్స్ ను కంపోజ్ చేయడంలో తనకు తిరుగులేదని మరో సారి నిరూపించారు దేవీ శ్రీ ప్రాసాద్. అయితే పుష్పలోని ఈ సాంగ్ ను పాడటానికి మంగ్లి సోదరికి అవకాశం ఇచ్చాడు డీఎస్పీ.


సోషల్ మీడియాలో వైరల్ ..

దీంతో ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్‌ ఈ సాంగ్ పాడి.. ఓవర్ నైట్‌ లో స్టార్డం వచ్చింది. ఈ పాటతోనే ఇంద్రావతి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది. మంగ్లీకి మాత్రం కన్నడలో అవకాశం ఇచ్చాడు డీఎస్పీ. ఇక ఎక్కువగా ఇంద్రావతి వాయిస్ కంటే.. ఆమె ఆ పాటలో పాడుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఇలా మంగ్లీ, ఇంద్రావతి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఇక తాజాగా వీళ్లిద్దరు కలిసి రీల్ వీడియో చేశారు. ఇన్ స్టాగ్రాంలో ఈ రీల్ వీడియో తెగ వైరల్ అవుతోంది. వాళ్లిద్దరు కలిసి ఈ రీల్ వీడియోలో వేసిన స్టెప్స్ మామూలుగా లేవు.. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Vaishnavi Chaitanya: అభిమాని చేసిన పనికి ఎమోషనలై.. ఐ లవ్ యూ చెప్పేసిన అల్లు అర్జున్ చెల్లెలు..!

Vaishnavi Chaitanya: అలా వైకుంఠపురం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలసిందే. ఇందులోని క్యారెక్టర్లు కూడా అంతగా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా థమన్ అందించిన సాంగ్స్ ఎంతో సక్సెస్ అయ్యాయి. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచాయి.

ఇదిలా ఉంటే సినిమాలో అల్లు అర్జున్ చెల్లిలిగా నటించిన వైష్ణవి చైతన్య కూడా చాలా ఫేమస్ అయింది.  అంతకు ముందు యూట్యూబ్ లో వైష్ణవి చైతన్య చాలా గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ.. వెబ్ సిరీస్ లతో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా లాక్ డౌన్ పిరియడ్ లో వైష్ణవి చైతన్య చాలా మందికి పరిచయం అయింది.

Vaishnavi Chaitanya: ఐ లవ్ యూ చెప్పేసిన అల్లు అర్జున్ చెల్లెలు..ఆ కథేంటి అంటే..!

ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తో నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సీరీస్ చాలా పెద్ద హిట్ అయింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. అయితే మొదటి సిరీస్ తర్వాత వైష్ణవి చైతన్య కి పెళ్లైంది. అయితే ఈ అమ్మడు ఫ్యాన్స్ మాత్రం మీరే నటించాలని డిమాండ్ చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే వైష్ణవి చైతన్య క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 

Vaishnavi Chaitanya: ఐ లవ్ యూ చెప్పేసిన అల్లు అర్జున్ చెల్లెలు..ఆ కథేంటి అంటే..!


Vaishnavi Chaitanya : క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులకు ముందుకు..

మరోవైపు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో వైష్ణవి చైతన్య ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబీ అనే సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా వైష్ణవి చైతన్యకి చిత్ర యూనిట్ బర్త్ డే విషెస్ తెలిపింది. హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్, నిర్మాతలు అందరూ వైష్ణవి చైతన్య బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఈక్రమంలోనే వైష్ణవి చైతన్య అభిమాని ఒకరు ఆమె పేరును పచ్చబొట్టు వేసుకున్న వీడియోను చూసి ఓకింత ఎమోషనల్ కు గురైంది. మాటలు రావడం లేదు.. ఏం చెప్పాలో తెలియడం లేదు…ఐ లవ్యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

Pawan Kalyan: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నఒకప్పటి హోమ్లీ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

ఈ క్రమంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇప్పటివరకు దృశ్యం సినిమాతో ప్రేక్షకులను సందడి చేసిన మీనా త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Shanmukh-Siri Hanmanthu: రెండు జంటలు విడిపోవడానికి కారణం అయిన బిగ్ బాస్..ఆ పాపం ఊరికే పోదు అంటూ..!

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఈమె పవన్ కళ్యాణ్ కి అక్క పాత్రలో నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాని ప్రకటించినప్పటికీ ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మే నెల నుంచి వరుస షూటింగ్లను జరుపుకోనున్నట్లు సమాచారం.

స్విట్జర్లాండ్‌ లో చక్కెర్లు కొడుతున్న రామ్ చరణ్.. తన చెల్లితో ఇలా..

యావత్ భారతదేశం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. దర్శక ధీరుడు రాజమౌళి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బడా నిర్మాత డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన నాటు నాటు సాంగ్, జనని సాంగ్ మెగా, నందమూరి రెండు లుక్స్ అభిమానులను సందడి చేశాయి. సినిమాలో హై థ్రిల్లింగ్ మూమెంట్స్, హీరో ఇంట్రడక్షన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ సీన్స్ అన్నీ అంతర్లీనంగా సాగుతాయని అభిమానులకు జక్కన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

సినిమా మొత్తం ఆ ఎమోషనల్‌లోనే దాగి ఉంటుందని అంటున్నారు. థియేటర్లలో చూసి ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారని అన్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో తాను మూడు గెటప్ లో కనిపిస్తానని చెప్పాడు. నా పాత్ర మూడు సరికొత్త లుక్స్‌తో ఉంటుందన్నారు. ఇక రాజమౌళి సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావించే తనకు మూడు క్యారెక్టర్లు చేయడమంటే.. ఇంత కంటే గొప్పది మరొకటి ఉండదన్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో షూటింగ్, ఆచార్య మూవీ షూటింగ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ షూటింగ్స్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చి, తన సోదరి శ్రీజతో కలసి స్విట్జర్లాండ్‌ వెళ్లారు. అక్కడ ఎత్తైన కొండల్లో ఫ్యామిలీతో ఫొటో దిగాడు. ఆ ఫొటో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

మాజీ సీఎం బంధువు పరిస్థితి దయనీయం.. పాపం ఆమె ఎలా మారిందంటే…

పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పేరు తెరపైకి ఎందుకు వచ్చిందంటే.. ఆమె మరదలు ఇరా బసు పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో యాచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆమె పీహెచ్ డీ చేసి బెంగాలీ, ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమె ఒక క్రీడాకారిణి కూడా. ఆమె టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవారు. 1976 సంవత్సరంలో ఆమె పాఠశాలలో టీచర్ గా కూడా పనిచేశారు. తర్వాత 2009 లో రిటైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఆమె గత కొన్నిసంవత్సరాల క్రితం కనిపించకుండా పోయింది.

ఇంట్లో వాళ్లు ఆచూకీ కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోనే ఫుట్ పాత్ లపై పడుకుంటూ యాచిస్తుంది. ఆమె పాఠశాలలో పని చేసింది. కానీ రావాల్సిన పెన్షన్ కు సంబంధించి ఎలాంటి దరఖాస్తు సమర్పించలేదని ఆమె పని చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపాడు.

దీనిపై ఆమెను అడుగగా.. టీచర్ గా తాను పని చేస్తున్న సమయంలో ఎవరిపై ఆధారపడాలని అనుకోలేదని.. అందుకనే బుద్ధదేవ్‌తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. తన శ్రమతోనే బాతకాలని అనుకున్నాను.. అందుకనే ఇలా అయింది అంటూ చెప్పారు. ఇక ఆమె ఇలాంటి పరిస్థితిలో ఉందని సోషల్ మీడియాలో వైరల్ కాగా స్పందించిన అధికారులు ఆమెను కోల్ కత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్క కోసం కిడ్నీ త్యాగం చేసిన తమ్ముడు.. నిజమైన రక్షా బంధన్‌కు అర్ధం చెప్పిన అక్కతమ్ముడు!

అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కడతారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. నేడు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి రక్షా బంధన్‌కు నిజమైన అర్థం చెప్పాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న తన అక్కను రక్షించుకున్నాడు.

తన కిడ్నీని దానం చేసి ఆమె జీవితంలో వెలుగులు నింపాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. చాలా రోజుల నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. అయితే ఆమెకు రక్త పోటు కూడా ఉండటంతో పరిస్థితి విషమించిందని ఆకాశ్ హెల్త్‌కేర్ వైద్యులు తెలిపారు. ఆమెకు మొదట ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అవయవాలపై కూడా ప్రభావాన్ని చూపించినట్లు తెలిపారు. వెంటనే ఆమెకు డయాలసిస్ నిర్వహించడంతో.. ఆమె మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభించిందన్నారు. ఇది కాస్త ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి దారితీసింది.

దీంతో ఆమె వయస్సును పరిగణలోకి తీసుకొని కుటుంబసభ్యులకు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. వైద్యులు కిడ్నీ దానం చేసే వ్యక్తి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఆ మహిళ కుటుంబసభ్యులే కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. మొదట ఆమె భర్త కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాగా.. అతడి బ్లడ్ గ్రూప్ సరిపోలేదు. ఆమె 28 ఏళ్ల తమ్ముడి బ్లడ్ గ్రూప్ సరిపోవడంతో అతడు కిడ్నీ దానం చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐదు గంటల సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి కిడ్నీ మార్పిడి పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ.. ‘ఆమె యువ వివాహిత మాదిరిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఆమె కోరుకున్న సమయంలో తల్లి కావచ్చు’అని తెలిపారు.

కిడ్నీ దానం చేసిన వ్యక్తి మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధితో తన అక్క చాలా బాధపడిందని.. ఆమె బాధను చూడలేక తాము తట్టుకోలేకపోయామని .. వైద్యులు తన కిడ్నీ సరిపోతుందని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని అన్నాడు. ఇక నుంచి తన అక్క సంతోషంగా ఉంటుందని.. అంతకంటే ఏం కావాలి అంటూ ఆమె సోదరుడు భావోద్వేగానికి గురయ్యాడు. అయితే రాఖీ పండుగ నేపథ్యంలో ఇలా తన కిడ్నీని దానం చేయడంతో నెటిజన్లు రాఖీ పండుగకు నిజమైన అర్థం ఇచ్చారంటూ ప్రశంసించారు.