Tag Archives: sridevi

Uday Kiran: చిరంజీవి.. ఉదయ్ కిరణ్ కు గాడ్ ఫాదర్ .. ఉదయ్ సోదరి కామెంట్స్ వైరల్!

Uday Kiran: ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిత్రం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎంతో మచ్చ సక్సెస్ అందుకున్నారు. అయితే ఉన్నఫలంగా ఈయనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఈ విధంగా ఉదయ్ కిరణ్ మరణించడంతో ఈయన మరణానికి చిరంజీవి కారణమంటూ ఇప్పటికీ చిరంజీవి అంటే సరిపోని వారు కామెంట్లో చేస్తూ ఉంటారు తన కుమార్తెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నందుకే ఈయనని ఇండస్ట్రీలో ఎదగకుండా చేసే అవకాశాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పలువురు భావిస్తూ ఉంటారు.

అయితే తాజగా ఈయన నటించిన నువ్వు నేను సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఉదయ్ కిరణ్ గురించి చిరంజీవి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి సపోర్ట్ చేశారు..

చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ చిరంజీవికి పెద్ద అభిమాని చిరంజీవి గారి తన గాడ్ ఫాదర్ తనని ఒక్కసారి కలిస్తే చాలు అని భావించేవారు ఒక ఈవెంట్లో చిరంజీవి గారితో కలిసిన సమయంలో ఉదయ్ ఎంతో సంతోషించారని తెలిపారు. అయితే ఉదయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు చాలా సపోర్ట్ చేశారంటూ శ్రీదేవి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

RGV: శ్రీదేవి ఫోటోను చూసి ఏడ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఎమోషనల్ ట్వీట్ వైరల్?

RGV: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు.

ఒకరకంగా చెప్పాలి అంటే రాంగోపాల్ వర్మ దర్శకుడుగా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా హైలెట్ అయ్యారని చెప్పవచ్చు. ఇదంతా మొన్నటి వరకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ చాలా తక్కువగా మాత్రమే సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉండే తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. అసలేం జరిగింది రాంగోపాల్ వర్మ ఆ ట్వీట్ లో ఏం రాసుకోవచ్చారు అన్న విషయానికి వస్తే… దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకుంది. ఇకపోతే డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే.

శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది..

ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించానని కూడా తెలిపారు ఆర్జీవి. శ్రీదేవితో కలిసి ఆర్జీవీ రెండు సినిమాలు తీసాడు కూడా. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పుడప్పుడు శ్రీదేవి ప్రస్తావన తన ఇంటర్వ్యూలలో కానీ, సోషల్ మీడియాలో కానీ తీసుకొస్తూ ఉంటాడు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో తయారుచేసిన ఒక శ్రీదేవి ఫోటోని ఆర్జీవీ షేర్ చేసి.. ఆ ఆర్టిఫిషియాల్ ఇంటిలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండటంతో ఆర్జీవికి శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చాడు అనే అర్ధంలో పోస్ట్ చేసాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నీకు కూడా ఏడుపు వస్తుందా!ఏం తాగి పోస్ట్ చేశావా అంటూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/C2cmRZ_pDqb/?utm_source=ig_embed&ig_rid=51e4d1ee-b28d-4e64-9ea0-04154e2752f2

Janhvi kapoor: చిన్నప్పుడు దొంగతనం చేస్తే అమ్మ తెలుగులోనే తిట్టేది.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!

Janhvi kapoor: జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే దేవర సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఎన్టీఆర్ హీరోగా రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

తాను చిన్నప్పుడు అమ్మ గదిలోకి వెళ్లి అమ్మ వస్తువులను దొంగతనం చేసేదాన్ని ముఖ్యంగా లిప్ స్టిక్స్ తన పాకెట్ లో పెట్టుకొని బయటకు వస్తూ ఉండేదాన్ని అమ్మ చూసి నీ పాకెట్స్ చూపించు అంటే నోమమ్మా అంటూ నేను చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ నన్ను నా కొడకా అంటూ తిట్టేదని జాన్వీ కపూర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎమోషనల్ అయినా జాన్వీ..

ఇలా చిన్నప్పుడు ఈమె చేసినటువంటి చిలిపి పనులు దొంగతనాలు గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి మరణించిన తర్వాత జాన్వీ కపూర్ చాలా బాగా తన తల్లిని మిస్ అవుతుందని తెలుస్తుంది. ఈమె ప్రతిసారి తన తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు కూడా చేస్తూ ఉంటారు.

Kavya Kalyan Ram: తెలుగమ్మాయి కావడమే నాకు ప్లస్ అయింది.. కావ్య కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

Kavya Kalyan Ram: హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. ఈ సినిమాలో శ్రీ సింహ కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఉస్తాద్ సినిమాకథపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈమె ఆశాభావం వ్యక్తం చేశారు .ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు కాలేజీలకు వెళ్ళగా అక్కడ మాకు భారీ స్థాయిలో స్పందన లభించిందని తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలుగు హీరోయిన్స్ గురించి కావ్య మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తెలుగు వారికి హీరోయిన్గా అవకాశాలు రాలేదన్న వార్త ఇండస్ట్రీలో తరచూ వినపడుతూనే ఉంటుంది.

ఇలా తెలుగు వారికి సినిమా అవకాశాలు ఉండవు అనే విషయం గురించి తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…ఇలా తెలుగువారికి హీరోయిన్గా అవకాశాలు రావడంలేదని ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాలేదని తెలిపారు.ఎందుకంటే సావిత్రి శ్రీదేవి వంటి ఎంతో గొప్ప నటీమణులు కూడా తెలుగు వారే ఇండియాలో ఇప్పటికీ వీరికన్నా అద్భుతంగా నటించిన, వీరికన్నా అద్భుతమైన సక్సెస్ చూసినటువంటి నటీమణులు లేరు.

Kavya Kalyan Ram: ఓకే భాషకే పరిమితం కాకూడదు…


ఇక నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయి కావడం నా అదృష్టం. నేను చేసిన మూడు సినిమాలలోని దర్శకులు కూడా తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని ఆ సినిమాలకు నన్ను ఎంపిక చేశారు. భాష వస్తే చాలు అవకాశం వస్తుందనుకోవడం పొరపాటు.నటీనటులు ఎప్పుడూ కూడా ఒకే భాషకు పరిమితం కాకూడదు అంటూ ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kiara Advani: శ్రీదేవి తర్వాత అంత ప్రతిభావంతురాలైన నటి ఆమె… కియార పై ప్రశంసలు కురిపించిన ఎస్ జె సూర్య?

Kiara Advani: ఎస్ జె సూర్య ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించినటువంటి ఈయన ప్రస్తుతం డైరెక్షన్ కి గుడ్ బై చెబుతూ నటుడిగా స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ విలన్ పాత్రలలో అందరిని మెప్పిస్తున్నారు.

తాజాగా ఈయన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కియారా ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం గేమ్ చెంజర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే నటి కియారా పుట్టినరోజు కావడంతో ఈయన తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా కియారకు ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ బర్త్ డే ప్రీటి ప్రిన్సెస్..శ్రీదేవి తర్వాత అంతటి ప్రతిభావంతురాలైన నటి మీరే అంటూ ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా కియారాను ఏకంగా శ్రీదేవి గారితో పోల్చడం కొందరు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

Kiara Advani: జాన్వీ ఎవరు…


ఈమె కన్నా ఇండస్ట్రీలో ఎంత ప్రతిభవంతులైనటువంటి నటీమణులు ఉన్నారు కానీ ఈమెను శ్రీదేవి గారితో పోల్చడం ఏంటి అంటూ ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు. మరి కియారా శ్రీదేవి అయితే జాన్వీ కపూర్ ఏంటి అంటూ శ్రీదేవి అభిమానులు పెద్ద ఎత్తున ఈ పోస్టుపై విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ జె సూర్య చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Sreeleela: నటి శ్రీ లీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రహ్మాజీ…. ఆమె కూడా అదే స్థాయికి వెళ్తుంది అంటూ కామెంట్స్!

Sreeleela: శ్రీ లీల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలీల గురించి నటుడు బ్రహ్మాజీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బ్రహ్మాజీ ప్రస్తుతం తన కుమారుడు సంజయ్ రావు నటిస్తున్నటువంటి స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కాబోతుంది ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఒక ఇంటర్వ్యూలో హాజరైనటువంటి ఈయనకు యాంకర్ ప్రశ్నిస్తూ ఇప్పుడు కనుక మీకు హీరోగా అవకాశం వస్తే ఏ హీరోయిన్ పక్కన నటించాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు బ్రహ్మాజీ సమాధానం చెబుతూ తాను నటి శ్రీ లీల పక్కన నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.ఈమె ఎంతో టాలెంట్ కలిగినటువంటి హీరోయిన్ డాన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. అయితే నాకు డాన్స్ రాదు అనుకుంటే పొరపాటు నేను కూడా డాన్స్ చాలా బాగా చేస్తానని బ్రహ్మాజీ తెలిపారు.

Sreeleela: స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళుతుంది…


ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు ఈమెకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అలాగే తన టాలెంట్ కనుక చూస్తే ఈమె కూడా స్టార్ హీరోయిన్స్ అయినటువంటి శ్రీదేవి జయసుధ జయప్రద వంటి వారి స్థాయికి చేరుకుంటుందని ఇండస్ట్రీలో అంతే స్థాయిలో ఆదరణ సంపాదించుకుంటుందని శ్రీ లీల గురించి బ్రహ్మాజీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor: తల్లి శ్రీదేవి మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్!

Janhvi Kapoor: జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ సాధించడం కోసం కష్టపడుతున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయం కాబోతున్నారు.

ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన బవాల్ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇకనటిగా ఇండస్ట్రీలో శ్రీదేవి సినీ ప్రస్థానం ఏంటో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి 2018లో దుబాయ్ లో మరణించారు. ఇలా ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో
భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Janhvi Kapoor: కాలంతో యుద్ధం చేశాను…


అమ్మ తన సినీ కెరియర్ ను చూడలేకపోయిందని ఈమె తెలిపారు .అమ్మ చనిపోయిన సమయంలో తాను దడక్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.అమ్మ మరణం తర్వాత నాకు పరిస్థితులన్నీ చాలా కష్టంగా మారిపోయాయి. అమ్మ లేని లోటును ఎవరు తీర్చలేకపోయారు. ఆ కొద్ది రోజులు కాలంతో తాను పెద్ద యుద్ధం చేస్తూ ఆ బాధ నుంచి బయటపడ్డానని ఈ సందర్భంగా తల్లి మరణం గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor: అమ్మ నన్ను పట్టుకుని కూర్చుంది… శ్రీదేవితో ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినా జాన్వీ!

Janhvi Kapoor: అందాల తార దివంగత నటి శ్రీదేవి మరణ వార్త ఇప్పటికి ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సినిమాలలో అన్ని భాషలలో నటిస్తూ ఎంతోమంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె దుబాయ్ లో టబ్ బాత్ లో మరణించి విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.

ఇలా శ్రీదేవి మరణించిన తర్వాత తన కుమార్తె వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీదేవి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ ధడక్ సినిమా అవకాశాన్ని అందుకొని ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తన తల్లి తనతో గడిపిన ఆఖరి క్షణాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను అప్పటికే దడక్ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో అమ్మతో గడపడానికి సమయం లేకుండా పోయింది.

అమ్మ ఉదయమే దుబాయ్ వెళ్లాలి నైట్ తన గదిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. నేను షూటింగ్ నుంచి వచ్చి అమ్మ గదికి వెళ్ళగా తన బిజీగా ఉన్నారు. దాంతో నేను నా గదికి వెళ్లి పడుకున్నాను.అమ్మ పనులన్నీ ముగించుకొని నా గదికి వచ్చిందని అయితే అప్పటికే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నాను. నేను అలా చెప్పినప్పటికీ అమ్మ అక్కడే ఉందన్న విషయం నాకు తెలుసు.

Janhvi Kapoor: అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు…


నేను నిద్రపోతూ ఉండగా అమ్మ నా దగ్గరకు వచ్చి నా తలపై చేయి వేసుకొని అలాగే కూర్చున్నారు. ఇదే నేను అమ్మతో గడిపిన ఆఖరి క్షణాలు అంటూ ఈ సందర్భంగా జాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మ మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటే అయ్యాము. కానీ అమ్మలేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి ఇలాంటి పాడు అలవాట్లు ఉన్నాయా…. తల్లి పేరు చెడగొడుతుందిగా?

Janhvi Kapoor: ప్రముఖ దివంగత నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్ని భాషలలో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎందరికో ఆరాధ్య దేవతగా నిలిచినటువంటి శ్రీదేవి ఆకాలమరణం ఇప్పటికే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వారసురాలిగా ఇండస్ట్రీకి జాన్వీ కపూర్ వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన జాన్వి ఐదు సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతున్న ఇప్పటివరకు తనకంటూ ఒక సరైన హిట్ సినిమాని అందుకోలేదు. ఇక ఈమె త్వరలోనే ఎన్టీఆర్ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకున్నారు.

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కోసం జాన్వీ కపూర్ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేస్తున్నారు అంతేకాకుండా తాజాగా ఈమెకు సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంతో పద్ధతిగా ఉండే ఈమె శని ఆదివారాలు మాత్రం హద్దులు మీది ప్రవర్తిస్తూ ఉంటారని తెలుస్తోంది.


Janhvi Kapoor: తల్లి పరువు తీస్తుందిగా…

వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పబ్ లో పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున స్మోక్ చేయడం డ్రింక్ చేయడం చేస్తూ ఉంటారట.తన తల్లి మరణాంతరం వీరినీ కంట్రోల్ చేసేవారు లేకపోవడంతో ఇలాంటి చెడు అలవాట్లకు బానిస అయ్యారని ఈ అలవాట్లకు బానిస అయ్యి తన తల్లి పేరును చెడగొడుతుంది అంటూ నేటిజన్స్ మండిపడుతున్నారు.

Murali Mohan: ఆమె శ్రీదేవిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు… మురళీమోహన్ కామెంట్స్ వైరల్!

Murali Mohan: మురళీమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తే సందడి చేస్తున్నారు. అయితే ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు.కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రలలో నటించారు అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో అనంతరం రాజకీయాలలోకి వచ్చి కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తనకు సినిమాలే కరెక్ట్ అని భావించిన మురళీమోహన్ ఇప్పటికీ సినిమాలలో కొనసాగుతున్నారని ఇకపై తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మురళీమోహన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.ఇండస్ట్రీలో తనను అందరూ శ్రీరామచంద్రుడు అని భావించేవారు. ఇక ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో మీరు మాత్రమే శ్రీరామచంద్రుడు అంటూ తనకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని తెలిపారు.తన గురించి ఇండస్ట్రీలో ఇలాంటి అభిప్రాయం ఉండడంతో శ్రీదేవి తల్లిగారు ఏకంగా తనకు అల్లుడుగా చేసుకోవాలని భావించారని ఈయన తెలిపారు.

Murali Mohan: అమ్మాయి సంతోషంగా ఉంటుందని…


ఆమె తనని చూసి చాలా మంచివాడు గుణవంతుడుగా ఉన్నారని ఇలాంటి అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురు చాలా సంతోషంగా ఉంటుందని భావించి ఏకంగా శ్రీదేవితో నాకు పెళ్లి చేయాలని చూశారు అంటూ ఈ సందర్భంగా మురళీమోహన్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.