Tag Archives: ss rajamouli

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో రాజమౌళి అలాంటి సమస్యతో బాధపడ్డారా… బయటపెట్టిన శ్రియ!

SS Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకదీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు.ఒక సన్నివేశాన్ని ఈయన ఒక శిల్పంలా చెక్కుతారు కనుక రాజమౌళిని జక్కన్న అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఇలా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన జక్కన్నకే చెల్లుతుంది.

ఇలా ఈయన సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం క్లుప్తంగా రావడం కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఖండాలను దాటి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టం ఏంటో తెరపై మనకు కనపడుతుంది.ఇలా అద్భుతమైన సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన రాజమౌళి గురించి తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తాజాగా నటి శ్రియ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ…ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎక్కువగా దుమ్ము ఉన్న ప్రదేశంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజమౌళి గారు ఒక్కసారిగా ఆస్తమాకు గురయ్యారని ఈమె తెలియజేశారు.

SS Rajamouli: తీవ్ర ఆస్తమా సమస్యతో బాధపడ్డారు…

దుమ్ము కారణంగా ఆయన తీవ్రమైన ఆస్తమా సమస్యతో బాధపడినప్పటికీ ఏమాత్రం షూటింగ్ వాయిదా వేయకుండా షూటింగ్ పనులను ప్రారంభించారంటూ ఈ సందర్భంగా రాజమౌళి ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి ఈమె చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది తెలిసిన పలువురు ఇదే కదా రాజమౌళికి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ అంటూ రాజమౌళి పై ప్రశంసల కురిపిస్తున్నారు.

Tollywood Stars: కోట్లు విలువ చేసే ఇంద్రభవనాలను వదిలి.. అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ వీళ్లే?

Tollywood Stars: రోజు కూలి నుంచి రోజుకు వేళల్లో సంపాదించే వాళ్లు కూడా వారికంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఇక సినీ సెలబ్రిటీలు వారి ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సెలబ్రిటీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మించుకుంటారు. అయితే ఇలా కోట్ల రూపాయలు విలువ చేసి ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మించుకున్నప్పటికీ ఇలాంటి ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి కొందరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఈయన ఎన్నో ఆస్తిపాస్తులను కూడా పెట్టారు. ఈయనకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో అత్యంత ఖరీదైన కోట్లు విలువ చేసే ఇల్లు ఉన్నప్పటికీ ఈయన మాత్రం నగరంలోని ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ హౌస్ లో ఉంటున్నారు.

కింగ్ నాగార్జున కుమారుడు నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఒక సాధారణ ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇక అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు.ఇక ఈ ఇంటిలో తన తల్లి లక్ష్మి ఇంటీరియర్ డిజైన్ చేయటం వల్ల ఆ సెంటిమెంటుతో చైతు ఇక్కడే ఉంటున్నారు.

Tolly wood Stars: సొంత ఇంటిని వదిలేసిన సెలబ్రిటీస్.

పవన్ కళ్యాణ్ సైతం నగరంలో నందగిరి హిల్స్ లో పెద్ద భవనం ఉన్నప్పటికీ ఈయన తన ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారు.ఇక నటుడు జగపతిబాబుకు సైతం అపోలో ఆసుపత్రి దగ్గరలో ఓ పెద్ద భవనం ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఆ ఇంట్లో నివసించుకోకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సైతం సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈయన ప్రస్తుతం మణికొండలో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ విల్లాలో నివసిస్తున్నారు.

Jr NTR: భార్యతో రొమాంటిక్ ఫోటోని షేర్ చేసిన తారక్.. వైరల్ అవుతున్న ఫోటో?

Jr NTR: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతుంది.

ఇకపోతే ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన ఫ్రీ రిలీజ్ వేడుకకు కూడా ముఖ్యఅతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే. సినిమాల పరంగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే తారక్ తన వ్యక్తిగత విషయాలను మాత్రం అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడరు.

అయితే ఎప్పుడైనా తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తే మాత్రం క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.అయితే తాజాగా తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి దిగినటువంటి ఒక రొమాంటిక్ ఫోటోని తారక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఒక బల్లపై ఎన్టీఆర్ ప్రణతి ఎదురెదురుగా కూర్చుని చేతిలో కాఫీ కప్పుతో సరదాగా మాట్లాడుతూ ఉండగా దిగినటువంటి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

Jr NTR: ఇలాంటి క్షణాలు అంటూ ఫోటో షేర్ చేసిన తారక్…

ఈ ఫోటోని తారక్ షేర్ చేస్తూ ఇలాంటి క్షణాలు అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా ఈ ఫోటో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే కొరటాల శివ సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారు. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని చేయబోతున్నారు.

Actress Jayavani : ఆ దర్శకుడు కథ చెప్పడు.. క్యారక్టర్ చెప్పడు.. ఫోన్ చేసి అక్కడికే డైరెక్ట్ గా రమ్మంటాడు. : నటి జయవాణి.

Actress Jayavani : జయవాణి (ఉమామహేశ్వరి) తెలుగు టివీ, చలనచిత్ర నటీమణి. 2006లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో కూచిపూడి నృత్యం నేర్చుకుంది. జయవాణికి సినిమాల పిప్చి ఎక్కువ కావడంతో 10వ తరగతిలోనే గుమ్మడి చంద్రశేఖర్ రావుతో వివాహం జరిగింది.

పెళ్ళయిన తరువాత బి.ఏ.చదివి, భర్త సహకారంతో నటిగా మారింది. మొదటగా “రండి లక్షాధికారి కండి” అనే టి.వీ. సీరియల్ లో నటించిన జయవాణి, అనేక చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు పోషించింది. విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. దేశం మొత్తం తలతిప్పుకునేలా చేసిన దక్షిణాది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సై, విక్రమార్కుడు, చత్రపతి, యమదొంగ, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లో జయవాణి నటించారు.

అయితే “సై” చిత్రంలో విలన్ ప్రదీప్ రావత్ కి వ్యాంప్ క్యారెక్టర్ లో జయవాణి కనిపించారు. ఈ మద్య ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజమౌళి చిత్రాల్లో “మర్యాదరామన్న” చిత్రం అంటే చాలా ఇష్టమని అందులో మిగతా చిత్రాలలో లాగా వ్యాంప్ క్యారెక్టర్ కాదని కొంచెం పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటుందని ఆ సినిమాలో తన పాత్ర బాగుంటుందని చెప్పారు. తను ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా ఒక ఫోన్ కాల్ వస్తుందని.. కథా, క్యారెక్టర్ గురించి ఏమి చెప్పకుండా అందుబాటులో ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో డైరెక్టుగా లొకేషన్ కు రమ్మని చెప్తారు.

దర్శకుడు రాజమౌళి ముందుగా తాము ఎలా చేయాలో చేసి చూపిస్తారని అలా చేయడం వలన సమయం వృధా కాకుండా తొందరగా షాట్ ఓకే అవుతుందని… ముఖ్యంగా సై సినిమా షూటింగ్ లో తన క్యారెక్టర్ గురించి రమారాజమౌళి మొత్తం వివరించారని. రాజమౌళికి లొకేషన్ చేరుకొని గుడ్ మార్నింగ్ చెప్పడం ఇష్టం ఉండదని అలా చెబితే మీకు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ నేను ఉండాలా అంటారని.. ఆయన సరదాగా మాట్లాడతారని లొకేషన్ లో ఎంతో డెడికేషన్ తో పని చేస్తారని, ఆయనకు సినిమా తప్పా మరోలోకం తెలియదని నిజంగా వారితో పని చేయడం తన సొంత పుట్టింట్లో పని చేసినట్టుగా ఉంటుందని జయవాణి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తారక్, చరణ్ కు 30 ఏళ్లు దాటాయి.. అయినా ఆ పనులు మాత్రం మానలేదు.. జక్కన్న..

తెలుగు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనిలో Jr NTR, రామ్ చరణ్ , అలియా భట్ లు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత చిత్ర బృందం దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది .

ముంబై , చెన్నైలో దీని గురించి మాట్లాడిన తర్వాత.. మళ్లీ ఈ బృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌ని నిర్వహించింది. RRR ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులను ధరించి.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇక్కడ సినిమాలో తెరవెనుక జరిగిన కొన్ని వినోదాత్మక సన్నివేశాల గురించి చెప్పుకుంటూ కాస్త నవ్వులు పూయించారు. నందమూరి తారక్, రామ్ చరణ్ పై మీడియా వేదికగా జక్కన్న ఫిర్యాదు చేశాడు.

షూటింగ్ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. చెబుతుండగా.. ఒక్కసారిగా ఎన్టీఆర్ జక్కన్నను గిల్లగా అక్కడ నుంచి లేచి వెళ్లి.. నిలబడి మరీ చెబుతాడు రాజమౌళి. షూటింగ్ దాదాపు 300 రోజులు అనుకుంటే.. అందులో 25 రోజులు వీళ్లిద్దరి వల్లే వృధా అయ్యాయని చెప్పాడు.

వీరిద్దరికీ 30 ఏళ్ల వయస్సు దాటింది.. పెళ్లియింది.. వెనకాల లక్షల్లో.. కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నా.. సెట్లో మాత్రం వీరిద్దరూ గొడవపడేవారని చెప్పాడు. చరణ్ నన్ను గిల్లాడు అంటూ.. తారక్ అంటే.. అదేంలేదే.. నా స్క్రిప్ట్ నేను చదువుకుంటుంన్నాను అంటూ అమాయకపు ముఖం పెట్టి చరణ్ చెప్పేవాడు అంటూ తెలిపాడు. దీని కారణంగా చాలా వరకు నా షూటింగ్ నిలిచిపోయేది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.