Tag Archives: tollwood

Pavala Symala: సహాయం కోసం రాలేదు..చివరి చూపు కోసం వచ్చాను..పావలా శ్యామల ఎమోషనల్!

Pavala Symala: పావలా శ్యామల పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం వయసు మీద పడటంతో సినిమాలలో చేసే శక్తి లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి పావలా శ్యామల తాను సంపాదించిన ఆస్తులు అన్నింటిని తన కుమార్తె ఆరోగ్యం కోసం ఖర్చు చేసి చేతిలో చిల్లగవ్వ లేకుండా దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందులను చూసి ఎంతో మంది సెలబ్రిటీలు ఆమెకు ఆర్థిక సహాయం చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా తనకు ఆర్థిక సహాయం చేయడంతో వారందరికీ ఈమె పలు సందర్భాలలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పావలా శ్యామల ఇటీవల బుల్లితెరపై ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేశాను కాని చివరికి నా బ్రతుకు ఇలా అవుతుందని ఊహించలేదు.

అవార్డులు అమ్ముకున్నాను…
నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి ఎన్నో సత్కారాలు చేశారు కానీ నా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ అవార్డులను కూడా అమ్ముకొని బ్రతికానని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా నా కష్టాలన్నింటిని మీతో చెప్పుకోవడానికి కాదు మీ అందరిని చివరి చూపు చూద్దామని వచ్చానని నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ అక్కడ ఉన్నటువంటి వారందరిని కంటతడి పెట్టించాయి.

Chiranjeevi: హాలీవుడ్ చిత్రం హెవెన్ కెన్ వెయిట్.. చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిరంజీవి యముడికి మొగుడు!

Chiranjeevi: రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రాధ, విజయశాంతి జంటగా నటించిన చిత్రం యముడికి మొగుడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటుడు జి వి నారాయణ రావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Chiranjeevi: హాలీవుడ్ చిత్రం హెవెన్ కెన్ వెయిట్.. చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిరంజీవి యముడికి మొగుడు!

ఈ సందర్భంగా జి.వి నారాయణ మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ రచనలో భాగంగా తనకు భాగం ఉందని తెలియజేశారు. నిజానికి ఈ సినిమాని హాలీవుడ్ చిత్రం
 ‘హెవెన్ కెన్ వెయిట్’ఆధారంగా తెరకెక్కించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కథను సత్యానంద తాను కలిసి స్క్రిప్ట్ పనులు పూర్తిచేశామని ఆయన తెలియజేశారు.

Chiranjeevi: హాలీవుడ్ చిత్రం హెవెన్ కెన్ వెయిట్.. చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిరంజీవి యముడికి మొగుడు!

నిజానికి ఈ హాలీవుడ్ చిత్రాన్ని సజెస్ట్ చేసింది నాగబాబు అని ఈ కథ నచ్చడంతో ఇలాంటి కథలను వ్రాయడంలో డి.వి.నరసరాజు బాగా అనుభవం ఉండటంతో ఆయన వద్దకు వెళ్ళాము. అయితే ఆయన ఇప్పటికే ఇలాంటివి ఆరు సినిమా కథలను రాసినట్లు తెలిపారు. అయితే ఈ చిత్రంలో వాటికి భిన్నంగా ఒక మనిషిలోకి మరొకరు రావడం అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కించామని తెలిపారు.

ఆర్థికంగా నిలదొక్కుకున్న నిర్మాతలు…

ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడు మంది ఉంటారని అలా ఒకే పోలికలతో ఉన్న ఇద్దరిలో ఒకరు మరొకరి శరీరంలోకి ప్రవేశించే పాయింట్ ను తానే చెప్పినట్లు జీవి నారాయణ తెలియజేశారు.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువచ్చిందని జీవి నారాయణ తెలియజేశారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

Mahesh Babu-Radha: సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి సినిమా విడుదలై దాదాపు చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. దీనికి సంబంధించి ఇటీవల మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుకు సర్జరీ అవ్వడం.. కరోనా పాజిటివ్ రావడం లాంటివి జరగడంతో సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ పనులు మొదలు పెట్టేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‏గా నటిస్తుండగా.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

త్రివిక్రమ్ కు ఇలా చేయడం అలవాటే..

ఈ సినిమాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రాధ కీలక పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మహేష్ బాబుకు తల్లి క్యారెక్టర్ లో ఆమె పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. ఇక 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రాధా వివాహం తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యారు. ఈ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఆమె అభిమానులు మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నారు. తమ అభిమాను హీరోయిన్ ను మళ్లీ సినిమాల్లో ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లను తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం త్రివిక్రమ్ కు మొదటి నుంచి కూడా అలవాటే. అత్తారింటికి దారేదిలో నదియాకు,
అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబులకు అవకాశం ఇచ్చారు.

Jayasuda: చిరంజీవి ఆ సలహా వల్లే తీవ్రంగా నష్ట పోయాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!

Jayasuda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి గా,సహజనటిగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు.

Jayasuda: చిరంజీవి ఆ సలహా వల్లే తీవ్రంగా నష్ట పోయాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!

నిర్మాతగా మారిన జయసుధ ఆశించినంత ఫలితాలను అందుకోలేదని చెప్పాలి. అయితే ఆమె నిర్మాతగా ఎందుకు విజయం సాధించలేకపోయిందనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన హ్యాండ్సప్ సినిమా గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

Jayasuda: చిరంజీవి ఆ సలహా వల్లే తీవ్రంగా నష్ట పోయాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!

జయసుధ నిర్మాతగా మారిన తర్వాత ఆత్మబంధువులు, ‘కాంచన సీత’ సినిమాలు సక్సెస్ కావడంతో ఆమెకి మంచి లాభాలు వచ్చాయి ఈ సినిమా తరువాత ఏకంగా బాలీవుడ్ చిత్రం ‘మేరా పతి సిర్ఫ్ మేరా హై’  చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కొంత మేర నష్టాలను తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే జయసుధ హ్యాండ్సప్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసిందని జయసుధ తెలిపారు.

విడుదలయ్యే వరకు చిరంజీవి ఉన్నారనే విషయం తెలియదు.

ఈ సినిమా గురించి జయసుధ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల అయి ఫస్ట్ షో చూసే వరకు ఎవరికీ కూడా ఈ సినిమాలో చిరంజీవి ఉన్నారనే విషయం తెలియదు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పోస్టర్లలో చిరంజీవి పేరు వేసినా మంచి ఓపెనింగ్స్ వచ్చేవని, పోస్టర్ వేద్దామంటే చిరంజీవి గారు వద్దన్నారని..అలా ఆయన సలహా వల్లే ఈ సినిమా నష్టాలలోకి వెళ్లిపోయిందని జయసుధ తెలిపారు. చిరంజీవి అలా చెప్పడానికి గల కారణం అప్పటి వరకు ఒక స్టార్ హీరో ఇలాంటి చిన్న పాత్రలో నటించలేదు. అలా పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేసి తీరా థియేటర్లకు వెళ్లిన తర్వాత మా హీరోకి ఇంత చిన్న పాత్ర ఇవ్వడం ఏంటి అని ఫీల్ అవుతారని అందుకే చిరంజీవి వద్దన్నారని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

Kriti Sanon: నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు.. బాడీ షేమింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్!

Kriti Sanon:మహేష్ బాబు హీరోగా 1నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత దోచేయ్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురవడంతో బాలీవుడ్ బాట పట్టింది.

Kriti Sanon: నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు.. బాడీ షేమింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్!

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కృతిసనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న కృతిసనన్ కెరియర్ మొదట్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొనడం ముఖ్యంగా తన బాడీ షేమింగ్ గురించి ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా బయటపెట్టారు.

Kriti Sanon: నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు.. బాడీ షేమింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్!

ఈ సందర్భంగా కృతిసనన్ మాట్లాడుతూ.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఈ హీరోయిన్ నవ్వు ఏ మాత్రం బాగుండదని చాలామంది కామెంట్లు చేశారని తెలిపారు.ఈ క్రమంలోనే చాలా మంది పెదాలకు సర్జరీ చేయించుకోవచ్చు కదా అంటూ సలహాలు కూడా ఇచ్చారని తెలిపారు.

నాకు నాలా ఉండటం ఇష్టం..

ఈ విధంగా నా నవ్వు గురించి నా పెదాల గురించి కామెంట్లు చేయడమే కాకుండా నా ముక్కు బాగాలేదని, నవ్వితే నాసికా రంధ్రాలు ఎర్రబడతాయి అని చాలా మంది అవహేళన చేస్తూ తనకు సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారని తెలిపారు. అయితే నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా అనుకొని వారందరి మాటలు పట్టించుకోలేదని అయినా నాకు నాలా ఉండటమే ఇష్టం అని ఈ ముద్దుగుమ్మ తెలిపారు.ఎవరో వచ్చి ఏదో చెబితే వారికి నచ్చిన విధంగా మనం ఉండాల్సిన అవసరం లేదని ఇదే విషయాన్ని అతను అందరికీ తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

Shyam Singha Roy: కొత్తగా వస్తున్న యువదర్శకుల నుంచి సీనియర్ దర్శకుల దాకా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. పవన్ తో హిట్ కొడితే తమ రేంజ్.. మార్కెట్ కూడా పెరుగుతుందని భావిస్తుంటారు. అలాంటి డైరెక్టర్ల జాబితాలో ప్రస్తుతం శ్యాంసింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా చేరారు. 

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను కూడా అందుకుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

మళయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషీయుమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. దీని తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’లో పవన్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఇలా చూస్తే దాదాపు 2023 వరకు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా ఒప్పుకున్నా.. ఆ తరువాతే ఉండనుంది.

మనసులో మాట బయటపెట్టిన యంగ్ డైరెక్టర్:

టాక్సీవాలా, శ్యాంసింగరాయ్ తో వరస హిట్లు అందుకున్న డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. శ్యాంసింగరాయ్ ఇచ్చిన హిట్ కిక్ లో రాహుల్ సాంకృత్యాన్ ఉన్నారు. అయితే తాను శ్యాంసింగరాయ్ సీక్వెల్ మూవీని పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. సాధారణంగా ఓ హీరో నటించిన సినిమా సీక్వెల్ కు మరో హీరో నటించడానికి ఇష్టపడరు. అయితే రాహుల్ సాంకృత్యాన్ మాత్రం తన శ్యాంసింగరాయ్ సీక్వెల్ సినిమాను పవన్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. శ్యాంసింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన కోరికను బయటపెట్టాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ కోరికపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

మెగస్టార్ చిరంజీవి డ్యాన్స్ పై బన్నీ ఆసక్తికర కామెంట్స్.. నేను అలా కాదంటూ ఓపెన్..!

మోస్ట్ అవెయిడ్ మూవీ పుష్ఫ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అందరిలోను అంచనాలు పెరిగిపోయాయి. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగుతో పాటు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో అనువాదవైంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సూపర్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్ మొత్తాన్ని స్వయంగా బన్నీనే మోశాడు. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తమిళనాడు, కర్ణాటకల్లో భారీ ఎత్తున ప్రమోషన్ చేశాడు. బన్నీతో పాటు రష్మికా కూడా ప్రమోషన్లలో భాగమైంది.

తాజాగా గురువారం కూడా ముంబైలో ప్రమోషన్ కోసం చిత్రయూనిట్ వెళ్లింది. తొలిసారిగా అల్లు అర్జున్ హిందీలో పుష్పగా వస్తుండటంతో నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇది తన జీవితంలో ముఖ్యమైన రోజని.. ఇకపై నాసినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో ఉండేలా చూసుకుంటానని.. స్వదేశంతో పాటు విదేశీ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సినిమాలు చేస్తానని అన్నారు. అయతే హిందీ మీడియా మీ యాక్టింగ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ మేనరిజం కనిపిస్తుందని అడగ్గా బన్నీ నేను చెన్నైలో పుట్టిపెరిగానని.. సహజంగానే దక్షిణాది స్టార్ల నుంచి ప్రేరణ పొందానని చెప్పుకొచ్చాడు.

తనకు అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన అభిమానం అని అన్నాడు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చాడు. తన మావయ్య చిరంజీవి మంచి డ్యాన్సర్ అని… ఇది అందరికి తెలిసిన విషయమే అని అన్నారు. నేను వారిని ఇమిటేట్ చేయలేదని.. సందర్భానుసారంగా అలావస్తాయని అన్నారు అల్లు అర్జున్.

యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్.. అతడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..

క‌రోనా మ‌హ‌మ్మారి తగ్గినట్లే చాపకింద నీరులా మరోసారి విస్తరిస్తోంది. రెండు వేవ్ లల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజానికం.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. ఎస్పీ బాలులాంటి లెజెండ్స్ ను మనకు కాకుండా కూడా చేసింది ఈ మాయదారి వైరస్.

కొన్ని రోజుల క్రితం డ్యాన్స్ మాస్టార్ శివశంకర్ కు కరోనా సోకి.. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ ఎక్కువ కావడంతో చనిపోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ కరోనా బారిన ప‌డి కోలుకున్నారు. తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ కి కరోనా సోకింది. ప్ర‌స్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. ఇలా వరుసగా సెలబ్రిటీలను కరోనా వదిలిపెట్టడం లేదు.

ఈ క్రమంలో తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డారు. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గత కొద్దిరోజుల ముందు నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టెస్ట్ చేయింకోవాలని కోరుతున్నా.. నేను బాగానే ఉన్నా అందరు జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై’’ అంటూ రాసుకొచ్చారు అర్జున్.

తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానని అతడు వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని.. దయచేసి ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

స్టేజ్ మీద బూతులతో రెచ్చిపోయిన నటి హేమ.. ముక్కున వేలేసుకున్న నెటిజన్లు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ముగ్గురు అమ్మాయిల జీవిత కథ ఆధారంగా మ్యాగీ దర్శకత్వంలో మారుతి పర్యవేక్షణలో తెరకెక్కిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో పాయల్‌ రాజ్‌పుత్‌, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే విశేషమైన ఆదరణ దక్కించుకుంది.

ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి నటి హేమ కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో హేమ మాట్లాడుతూ దర్శకుడిని ఉద్దేశించి బాబు చిట్టి అంటూ బోల్డ్ గా మాట్లాడటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ క్రమంలోనే నటి హేమ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏంటి హేమ ఇలా మాట్లాడింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హేమ ఇటీవల మా ఎలక్షన్లలో కూడా నానా హంగామా చేస్తూ వార్తల్లో నిలిచారు.

బుల్లెట్టు బండెక్కిన దివ్వవాణి.. డ్యాన్స్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..!

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఇటీవల మంచిర్యాలకు చెందిన ఓ పెళ్లి కూతురు తన పెళ్లి బరాత్‏లో ఈపాటకు డ్యాన్స్ చేయడంతో ఈ పాటకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆమె స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

అప్పటి నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బుల్లెట్ పాట మోత మోగిస్తోంది. అంతేకాదు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్ ఇంకా ఇతర షార్ట్ వీడియో అప్లికేషన్స్‌లోనూ దుమ్ము రేపుతోంది. తెలంగాణలో మొదలైన ఈ క్రేజ్ ఏపీలో కూడా కొనసాగుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

య్యూట్యూబ్ లో ఈ పాటకు కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ పాటకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా స్టెప్పులేయడం మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా సీనియర్ హీరోయిన్, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సైతం ఈ పాటకు స్టెప్పులేసింది. అది కూడా నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే డ్యాన్స్ వేసి అలరించింది. ప్రస్తుతం దివ్య వాణి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈమె ‘పెళ్లిపుస్తకం’ సినిమాతో ఎంతో ఫేమ్ అయ్యారు. ఆమె పలు సీరియళ్లలో కూడా నటించారు. ప్రస్తుతం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. ఏదో కార్యక్రమానికి హాజరైన అనంతరం దివ్య వాణి సన్నిహితుల నడుమ, రోడ్డుపైనే ఈ పాటకు స్టెప్పులేశారు. దీంతో అక్కడున్న కొందరు ఆమె డ్యాన్స్‌ను వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ గా మారింది.