Tag Archives: tollywood hero

Rajamouli -Prashanth Neel: ఈ టాలీవుడ్ హీరో అంటే ఆ ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకు అంత ఇష్టమా?

Rajamouli -Prashanth Neel: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ రాజమౌళి ఒకరు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా గుర్తింపు పొందినటువంటి ఈయన బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందారు.

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఈ ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఓకే తెలుగు హీరో అంటే ఇష్టం అని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లను మెప్పించిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే…

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాజమౌళినీ మెప్పించిన ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈ ఇద్దరు హీరోలకు ఎంతో ఇష్టమని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో రాజమౌళికి ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పాల్సిన పని లేదు. కాంబినేషన్లో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఐదు సెన్సేషనల్ హిట్ అందుకున్నాయి.

Rajamouli -Prashanth Neel: పాన్ ఇండియా డైరెక్టర్లను మెప్పించిన తారక్…

ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయకపోయినా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అనే విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sreeleela: స్టార్ హీరోయిన్ శ్రీలీలనే రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో… ఎందుకు రిజెక్ట్ చేసారో తెలుసా?

Sreeleela: శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె నటించిన రెండు సినిమాలలో ఆయనప్పటికీ ఏకంగా డజన సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇండస్ట్రీలో శ్రీలీలకుఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు అయితే డేట్స్ కుదరని కారణంగా శ్రీ లీల కొన్ని సినిమా అవకాశాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విధంగా ఈమె ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయారు. అదేవిధంగా ఎంతోమంది హీరోలతో సినిమాలను రిజెక్ట్ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీ లీలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీ లీల ఇప్పటివరకు పలువురు హీరోలను సినిమాలను రిజెక్ట్ చేయగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో ఈమెను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. మరి ఈమెను రిజెక్ట్ చేసినటువంటి ఆ స్టార్ హీరో ఎవరు… తనని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

Sreeleela: పొట్టిగా ఉండటమే కారణమా…

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా శ్రీలీల అయితే బాగుంటుందని అనుకున్నారట కానీ ప్రభాస్ హైట్ ముందు శ్రీలీల పొట్టిగా కనిపిస్తుందన్న కారణంతోనే ప్రభాస్ ఈమెను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.

Dhoni Wife: ఆ టాలీవుడ్ హీరో అంటే ధోని భార్యకు అంత ఇష్టమా… ఆ హీరో ఎవరో తెలుసా?

Dhoni Wife: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగ రాసినటువంటి ఈయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ధోని  ఎంటర్ టైన్ మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ధోని తన బ్యానర్లో LGMఅనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ధోని బ్యానర్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఎంతోమంది ఎన్నో అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ధోని భార్య సాక్షి సింగ్ కూడా రంగంలోకి దిగారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే హైదరాబాదులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాక్షి సింగ్ టాలీవుడ్ హీరోల గురించి పలు విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా తన టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయాన్ని ఈమె తెలిపారు.

Dhoni Wife: అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే చూస్తాను..


ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈమెను ప్రశ్నిస్తూ మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకుసాక్షి సింగ్ సమాధానం చెబుతూ తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే చూస్తాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం తన సినిమాలు అసలు మిస్ అవ్వను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Salaar: సలార్ పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో ఆ టాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకున్నారా… ఏమైందంటే?

Salaar: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం సలార్. ఈ సినిమా ఎన్నో అంచనాలను ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే ఈ సినిమాలో జగపతిబాబు ఆయన కొడుకు మెయిన్ విలన్లుగా కనిపించబోతున్నారు ఇక జగపతిబాబు కొడుకు పాత్రలో మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పృధ్విరాజ్ పాత్రలో టాలీవుడ్ హీరో అయితే బాగుంటుందని ప్రభాస్ డైరెక్టర్ కి సలహా ఇచ్చారట అయితే డైరెక్టర్ మాత్రం చాలా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

ప్రభాస్ తన ఆప్తమిత్రుడు అయినటువంటి హీరో గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో తీసుకోవాలని సూచించారట ఇదివరకు వీరిద్దరూ వర్షం సినిమాలో హీరో విలన్లుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ప్రశాంత్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇద్దరూ కూడా తెలుగువారే అయితే మార్కెట్ పరంగా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాదని చెప్పడంతో ప్రభాస్ ఈ విషయంలో సైలెంట్ అయ్యారట.

Salaar: రెండు భాగాలుగా సలార్…


ఈ విధంగా ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ఆయన మాత్రం మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ మొదటి సారి హీరోయిన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rakulpreeth Singh: ఆ హీరో వల్లే నా కెరియర్ నాశనమైంది… ఆ సీనియర్ హీరో పై రకుల్ కామెంట్స్!

Rakulpreeth Singh: కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతిసింగ్ ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో ఆగ్ర హీరోలందరి సరసన నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రకుల్ ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

సౌత్ ఇండస్ట్రీలో చివరిగా ఈమె నటించిన మన్మధుడు 2, చెక్,కొండ పొలం సినిమాలు వరుసగా ఫ్లాప్ గా నిలవడంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి. దీంతో బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడే పరిమితమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

నాకు హీరోయిన్ గా గుర్తింపు ఇచ్చినదే సౌత్ ఇండస్ట్రీ అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా పోయాయని తెలిపారు.ఇలా తనకు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సీనియర్ హీరోతో తాను ముద్దు సన్నివేశాలలో నటించడమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా నేను ఆ సీనియర్ హీరోతో అలాంటి సన్నివేశాలలో నటించడాన్ని ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు అందుకే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని ఈమె కామెంట్ చేశారు.

Rakulpreeth Singh:నాగార్జున కారణమా…


ఇక ఆ హీరో పేరు రకుల్ చెప్పకపోయినా ఈమె నాగార్జున ఉద్దేశించే చెప్పారని అర్థమవుతుంది. నాగార్జునతో కలిసి నటించిన మన్మధుడు2సినిమాలో ఈమె ముద్దు సన్నివేశాలలో నటించారు. అయితే నాగార్జునతో ఇలా నటించడానికి ప్రేక్షకులు ఏమాత్రం స్వీకరించలేక ఈ సినిమా సమయంలో తీవ్రమైన ట్రోల్స్ కూడా చేశారు. దీంతో నాగార్జున కారణంగానే తన కెరీర్ నాశనమైందని పరోక్షంగా రకుల్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Nagachaitanya: షూటింగ్ లోకేషన్ కి వెళ్తే మొబైల్ ఫోన్ ఉపయోగించని టాలివుడ్ హీరో.. ఎవరంటే..?

Nagachaitanya: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సామాన్య ప్రజలు సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే ఇక సెలబ్రిటీలు గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా లోనే ఉంటూ వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇలా సెలబ్రిటీలందరూ షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుంటుంటే ఒక టాలీవుడ్ హీరో మాత్రం షూటింగ్ లోకేషన్ కి వెళ్ళగానే మొబైల్ ఫోన్ పక్కన పెట్టేస్తాడు. ఆ హీరో మరెవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుని తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఇప్పటివరకు నాగచైతన్య నటించిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం నాగచైతన్య కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచాయి.
ఇదిలా ఉండగా అక్కినేని వంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుండి వచ్చిన నాగచైతన్య అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు. అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా తన పని తాను చేసుకు పోతూ ఉంటాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గురించి ఎన్ని విమర్శలు వినిపించినా కూడా నాగచైతన్య మాత్రం వాటి గురించి స్పందించకుండా సైలెంట్ గా ఉంటాడు.

Nagachaitanya: సెట్ లో ఉంటే ఫోన్ పక్కన పడేస్తారు…


ఇలా ఇంత కామ్ గా ఉండే నాగచైతన్య వృత్తి విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టగానే ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం ఆ రోజు షూటింగ్ మీద మాత్రమే దృష్టి పెడతాడు. ఈ క్రమంలో షూటింగ్ లొకేషన్ ఉంటే నాగచైతన్య కనీసం తన ఫోన్ ఉపయోగించడు. కనీసం షాట్ బ్రేక్ లో కూడా సరే ఫోన్ వాడడట. ఈ విషయంలో నాగచైత నేను చూసి తోటి నటీనటులు ఆశ్చర్యపోతున్నారు.

Nithya Menon: పొట్టి దాన అంటూ అందరి ముందు నిత్యమీనన్ పరువు తీసిన టాలీవుడ్ హీరో… ఎవరంటే?

Nithya Menon: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు నటి నిత్యమీనన్.నాచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా ద్వారా నిత్యమీనన్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ మలయాళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పలు వెబ్ సిరీస్ లలో కూడా సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈమె చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇండస్ట్రీలో ఈమెకు నానితో ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.నాని మాత్రమే కాకుండా తన భార్య అంజన కూడా నిత్యమీనన్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ సాన్నిహిత్యం కారణంగానే నిత్యమీనన్ ను నాని ఎప్పుడు పొట్టి దాన అంటూ ఆట పట్టిస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇలా తనని సరదాగా పొట్టి పొట్టి అంటూ ఆట పట్టించడమే కాకుండా ఒకసారి అలవాటులో పొరపాటుగా షూటింగ్ లొకేషన్లో కూడా తనని అలాగే పిలిచారట.

Nithya Menon: ఆగ్రహం వ్యక్తం చేసిన నిత్యామీనన్…


ఇలా షూటింగ్ లొకేషన్లో నిత్యమీనన్ ను పట్టుకొని పొట్టి దాన అని పిలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారని తెలుస్తుంది. ఈ విధంగా అందరి ముందు తనని అలా పిలవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిత్యామీనన్ ఒక్కసారిగా ఒక బకెట్ నీళ్ళు తెచ్చి నాని మీద పోసారని దీంతో కొంతసేపు షూటింగ్ లొకేషన్లో సందడి వాతావరణం నెలకొందనీ తెలుస్తుంది.

Tollywood Hero: ఆ టాలీవుడ్ హీరో పతనానికి అమ్మాయిలే కారణమా.. అర్ధాంతరంగా ముగిసిన హీరో కెరియర్?

Tollywood Hero:సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు హీరో హీరోయిన్లుగా కొనసాగాలంటే కేవలం టాలెంట్ మాత్రమే ముఖ్యం కాదు టాలెంట్ తో పాటు అందం కూడా ముఖ్యం. ఈ రంగుల ప్రపంచంలో కొంతకాలం పాటు ప్రేక్షకులను సందడి చేయాలంటే అందం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇలా తమ అందంతో అవకాశాలను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి కానీ తన అందాన్ని వీక్నెస్ గా మలుచుకొని కెరియర్ పతనం చేసుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు.

ఇలా తన అందాన్ని వీక్నెస్ గా మార్చుకొని ఉన్నత స్థాయిలో ఉండాల్సిన ఒక టాలీవుడ్ హీరో పాతాళానికి పడిపోయారు.. తూర్పుగోదావరి జిల్లా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన హరినాథ్ రాజు అనేవ్యక్తి ఆరడుగుల పొడవు ఎంతో అందంగా ఉండేవారు. ఈయనకు కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఎంతోమంది అమ్మాయిలు అభిమానులుగా ఉండేవారు. ఇలా ఎంతో అందంగా ఉన్నటువంటి హరినాథ్ నాటకాలు వేస్తూ అప్పట్లోనే ఎంతో మంచి ఆదరణ పొందారు.

ఈ విధంగా నాటకాలు వేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనపై దర్శక నిర్మాతల కన్ను పడటంతో ఏకంగా ఇతనికి సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఇలా సినిమా అవకాశాలు రావడంతో మద్రాస్ వెళ్లినటువంటి హరినాథ్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోలతో సమానంగా అవకాశాలను అందుకొని నటించేవారు. అయితే ఈయనకు ఎంత తొందరగా స్టార్డం వచ్చిందో అంతే తొందరగా పాతాళానికి పడిపోయారు.
అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలతో పార్టీలు…

ఈయన అందానికి ఎంతోమంది అమ్మాయిలు ముద్దులయ్యారు. ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్లోకి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి తనని చుట్టుముట్టి తనతో సరదాగా గడిపేవారు.ఇక అప్పట్లో మార్వాడిస్ అయ్యంగార్ అమ్మాయిలు ఏకంగా తన ఇంటికి వెళ్లి రాత్రంతా మందు తాగుతూ పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున రచ్చ చేసేవారు. ఇలా తన అందానికి ఎంతోమంది అమ్మాయిలు పడిపోవడంతో అమ్మాయిల కారణంగానే ఈయన షూటింగ్లకు సరిగా వెళ్లకుండా ఉండటం వల్ల తనకు సినిమా అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోయి చివరికి ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Hero Venkat: నా జీవితంలో నేను చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమయ్యాను.. : నటుడు వెంకట్!

Hero Venkat: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటిస్తూ,హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన శివరామరాజు చిత్రంలో ఆయన తమ్ముడుగా కూడా నటించారు.

ఈ విధంగా పలు విజయవంతమైన చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వెంకట్ ఉన్నపళంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

నేను చేసిన ఆ తప్పు వల్ల ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమయ్యాను.. నటుడు వెంకట్!

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గి పోలేదని ఏదో ఒక పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇండస్ట్రీకి ఇన్ని రోజులు దూరం అవడానికి గల కారణాలను కూడా తెలిపారు. ఆ నలుగురు సినిమా నిర్మించిన నిర్మాత తర్వాత ఆ అయిదుగురు చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను.

పైనుంచి కిందకు పడిపోయాను:

ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరగడం వల్ల పైనుంచి కిందికి పడిపోయాను. ఈ క్రమంలోనే వెన్నెముక గాయం కావడం వల్ల పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని అందుకే ఇండస్ట్రీలో ఈ గ్యాప్ ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ బిజినెస్ చేస్తూ ఉండేవాడిని అయితే ఇప్పుడిప్పుడే తనకు మంచి అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చినట్టు నటుడు వెంకట్ తెలిపారు.

డ్రామా క్వీన్ అంటూ ..మోనాల్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటో లీక్ చేసిన అఖిల్!

బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షోలలో ఒకటైన “బిగ్ బాస్ ” పలు సీజన్లతో దూసుకుపోతూ ఎంతటి ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే.అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతూ పాపులర్ అయ్యారు. గత ఏడాది గ్రాండ్ సక్సెస్ అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ మోనాల్ గజ్జర్ మరియు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ తమ ప్రేమ వ్యవహారంతో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్‌లో హల్‌చల్ చేసిన ప్రేమ జంట మోనాల్ గజ్జర్,అఖిల్ సార్థక్ తమ ప్రేమ వ్యవహార శైలితో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ మరింత పాపులర్ అయ్యారు. ఈ షో తర్వాత వీరిద్దరూ వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారు.ఈ మధ్యనే
మోనాల్ గజ్జర్ అఖిల్ సార్థక్‌తో కలిసి నటిస్తున్న “తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి”అనే వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ సార్థక్‌ తాజాగా మోనాల్‌పై సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అఖిల్, మోనాల్ తాజాగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ
హాహా క్యూటీ ..ఏమైంది నీకు.. డ్రామా క్వీన్ అని స్క్రీన్ షాట్ పై రాసుకొచ్చాడు.దీనికితోడు ఈ పిక్‌లో మోనాల్ ఎంతో కోపంగా కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం పై అనేక సందేహాలు కలిగిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈ పిక్ పై వినూత్నంగా స్పందిస్తున్నారు.