Tag Archives: trivikram

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

Trivikram -Pawan Kalyan:తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా, కెరియర్ పరంగా ఉన్న స్నేహితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మొట్టమొదటిసారిగా వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో వీరీ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి. ఈ సినిమా నుంచి ఇండస్ట్రీలో వీరీ అనుబంధం అలాగే కొనసాగుతూ వస్తోంది.

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

మాటల మాంత్రికుడుగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగానే తన మాటలతో పవన్ కళ్యాణ్ ను తన మాయలో వేసుకున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా అంటే తప్పనిసరిగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ఉండాల్సిందే. ఇలా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస రీమేక్ చిత్రాలను చేస్తున్నారు.

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

ఈ రీమేక్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది.అయితే ఈ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు.

బంగారు గనిలా పవన్ కళ్యాణ్…

ఇక ఈ సినిమా కోసం పని చేసినందుకుగాను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 20 కోట్ల రూపాయలను సంపాదించారు. సాధారణంగా ఒక డైరెక్టర్ సినిమా చేస్తే తీసుకునే పారితోషికాన్ని ఈయన స్క్రీన్ ప్లేకి మాత్రమే తీసుకున్నారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ మాయలోపడి రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు అభిమానులు రీమేక్ చిత్రాలు వద్దు అంటూ అభిమానులు మొత్తుకుంటున్నా ఈయన మాత్రం పూర్తి తెలుగు చిత్రాలను పక్కనపెట్టి వరుస రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.ఇక పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రానికి కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ 20 కోట్ల వరకు డిమాండ్ చేశారని సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. ఏదిఏమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ బంగారు గనిగా మారిపోయాడు.

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..సినిమా స్టార్ట్ కాకుండానే విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్!

SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 2020 అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి దర్శక పర్యవేక్షకుడిగా పని చేస్తున్నారు.

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..సినిమా స్టార్ట్ కాకుండానే విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్!

ఇక మహేష్ బాబుతో ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారు.మహేష్ బాబు 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరగా తన 28వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలెక్కుతుంది.

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..సినిమా స్టార్ట్ కాకుండానే విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్!

సర్కారీ వారి పాట చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా మహేష్ బాబు కాలికి సర్జరీ కావడంతో ఆలస్యమవుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు సర్కారీ వారి పాట పూర్తయిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలు కానుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే మహేష్ అభిమానులకు డైరెక్టర్ శుభవార్త తెలిపారు.

ఇది సాధ్యమయ్యే పనేనా..

ఏప్రిల్ నెలలో ఈ సినిమాని స్టార్ట్ చేసి మే 31వ తేదీ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్ విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆరేడు నెలలో పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని డైరెక్టర్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుంది కనుక ఈలోగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి త్రివిక్రమ్ అనుకున్న ప్లాన్ అమలవుతుందా.. ఇది సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన టార్గెట్ రీచ్ అవుతారో లేదో.

Trivikram-Mahesh Babu: మహేష్ బాబుకు తన అన్నకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ గురించి చెప్పిన త్రివిక్రమ్..!

Trivikram-Mahesh Babu: టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్లలో వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా… ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల జాబితాలో తప్పకుండా ఉంటాయి. ఇదిలా ఉంటే.. త్వరలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది.

Trivikram-Mahesh Babu: మహేష్ బాబుకు తన అన్నకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ గురించి చెప్పిన త్రివిక్రమ్..!

దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 
ఇదిలా ఉంటే మహేష్ బాబుకి తన అన్నయ్య రమేష్ బాబు అంటే ఎంత ఇష్టమో తెలిపే ఓ సంఘటన గురించి తెలిపాడు త్రివిక్రమ్.

Trivikram-Mahesh Babu: మహేష్ బాబుకు తన అన్నకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ గురించి చెప్పిన త్రివిక్రమ్..!

ఖలేజా షూటింగ్ సమయంలో మహేష్ బాబుకు ఓ ఫోన్ వచ్చిందని.. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత కాస్త మూడీగా కనిపించడంతో ఏం జరిగిందని అడిగానని త్రివిక్రమ్ చెప్పారు. అయితే తన అన్నయ్య రమేష్ బాబుకు ఆరోగ్యం బాగా లేదని..జ్వరంతో బాధపడుతున్నారని అని చెప్పారు.


సోషల్ మీడియా వేదికగా తన అన్నపై ..

అయితే త్రివిక్రమ్ షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా..అని అడిగితే వద్దులేంది భారీ బడ్జెట్ సినిమా కదా అని మహేష్ బాబు అన్నారని త్రివిక్రమ్ వెల్లడించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత మహేష్ బాబు సెట్ నుంచి హస్పిటల్ వెళ్లిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా చిన్న అనారోగ్యం వస్తేనే మహేష్ బాబు తట్టుకోలేరని.. అలాంటి ఆయన ఎంతగానో ప్రేమించే తన అన్నయ్య రమేష్ బాబు చనిపోవడం మహేష్ బాబుకు తీరని లోటని త్రివిక్రమ్ అన్నారు. అయితే కరోనాతో బాధపడుతున్న మహేష్ బాబు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో అన్న అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. సోషల్ మీడియా వేదికగా తన అన్నపై అభిమానాన్ని చాటుకున్నారు.  ‘‘నువ్వే నాకు సర్వస్వం అన్నయ్య.. నువ్వు లేని నేను సగం మాత్రమే.. ఎన్ని జన్మ లైనా నువ్వే నాకు అన్నయ్యగా కావాలి’’ అంటూ సోషల్ మీడియాలో మహేశ్ బాబు పోస్ట్ చేసిన లెటర్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. మహేశ్ హీరోగా నటించిన అర్జున్, అతిథి సినిమాలకు రమేశ్ బాబు నిర్మాతగా. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.

మహేష్ సినిమాలో సందడి చేయనున్న..తరుణ్ ఏ సినిమా అంటే?

బాలనటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తరుణ్ ఆ తరువాత హీరోగా అద్భుతమైన సినిమాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇలా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత తను నటించిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే ఆహాలో స్ట్రీమ్ అయిన మలయాళ అనువాద చిత్రం అనుకోని అతిథి సినిమా కోసం నటుడు ఫహద్ ఫాజిల్ కి డబ్బింగ్ చెప్పడంతో మరోసారి ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోసారి తరుణ్ మేకప్ వేసుకుని వెండితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో కథ మొత్తాన్ని కీలక మలుపు తిరిగే పాత్ర ఉందని, అందులో నటించడానికి హీరో తరుణ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ కథను విన్న తరుణ్ ఈ పాత్రలో చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ‘ట్యాక్సీ’ టైటిల్ లోగో విడుదల

హరీష్ సజ్జా దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ట్యాక్సీ. ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు సినిమాలకు దర్శకత్వం శాఖలో పని చేసిన హరీష్ సజ్జా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్నారు.బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతాన్ని అందిస్తుండగా, ఉరుకుండా రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఆనంద్ పల్లకీ విఎఫ్ఎక్స్ అందిస్తుండగా, తీసి ప్రసన్న ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఒక వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు అలాగే త్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ లోగో పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఇందులో ఒక గన్ పై కారు ఉంది, అలాగే బ్యాక్ గ్రౌండ్ వైజాగ్ మ్యాప్ కూడా కనిపిస్తోంది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. లవ్ స్టోరీ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసిన బిజే శ్రీధర్ ఈ సినిమాకు ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం స్త్రీల సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే అంశాలతో రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

మహేష్ బాబుతో జోడి కట్టనున్న రవితేజ హీరోయిన్..?

టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే ఇందులో సుబ్బరాజు,వెన్నెల కిషోర్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమా గా రాబోతున్న ఈ సర్కారు వారి పాట సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్14 రీల్స్ ప్లస్ జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా అనంతరం మూవీ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలు కానున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేయగా సెకండ్ హీరోయిన్ కోసం సంబంధించి ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపికయింది అని సినీవర్గాల్లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈమె రవితేజతో కలిసి కిలాడి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీనాక్షి చౌదరికి కొత్త కొత్త ఆఫర్లు వస్తున్నాయి. మీనాక్షి చౌదరి మహేష్ బాబు నటించిన సినిమాలు నటిస్తుందా లేదా అన్న విషయం ఇంక అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం మీనాక్షి చౌదరి ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి.

మీనాక్షి చౌదరి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే ఆమె జాతకమే మారిపోయే చాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహేష్ బాబు, ప్రభాస్ నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలో నటించడం వల్ల మీనాక్షి చౌదరికి ఇతర భాషలలో కూడా సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక త్వరలో త్రివిక్రమ్ మహేష్ కాంబోలో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

మహేశ్ ఇంటి నిర్మాణానికి రూ.5 కోట్లు ఖర్చుపెట్టారట..!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేశ్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబుగా పేరొందిన ఇతడు విభిన్నమైన క్యారెక్టర్లతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. పోకిరీ సినిమాతో అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టి తనకుంటూ మంచి ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు మహేశ్. అయితే మహేశ్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.

ఇదిలా ఉండగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రిన్స్ మహేశ్ బాబు ఆయా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేశ్ ఎంతో గ్లామర్ గా కనపడుతుంటాడని టాక్.

యాక్షన్ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.

దీనిలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. కాగా ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ ఇంటి కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టారట ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు ఈ సెట్ లోనే జరుగనున్నాయట. ఈ సినిమాకే ఈ సెట్ హైలైట్ అని సమాచారం.

మహేష్ తో తలపడనున్న మున్నాభాయ్.. త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటివరకు చాలా మంది టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నప్పటికీ మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించలేదు. సర్కారీ వారి పాట చిత్రం తర్వాత మహేష్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం గురించి చిత్రబృందం ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ కాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపిక చూస్తే మాత్రం అదే అనిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్‌ 2’తో సౌత్‌ ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవుతున్న సంజయ్‌ దత్‌ను ssmb28తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ విషయం గురించి చిత్ర బృందం సంజయ్ దత్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే సంజయ్‌ దత్‌ మహేష్ తో తలపడటానికి సిద్ధమవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే మహేష్ సర్కార్ వారి పాట తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమాకి పార్ధు అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

అంత ఆస్తి ఉన్నా 20 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి అద్దె చెల్లిస్తున్న త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా దశ దర్శకుడి, సినీ రచయితగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనకు తెలిసిందే. అతను ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే మనకు తెలుసు.కానీ ఇండస్ట్రీలోకి రావడానికి అతను ఎన్ని కష్టాలు పడ్డారనే విషయం చాలా మందికి తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ అవకాశాల కోసం పడిన కష్టాలు కమెడియన్ సునీల్ దర్శకుడు దశరథ్ మాత్రమే తెలుసు.

వీరందరూ పంజాగుట్టలోని ఓ రూమ్ లో అద్దెకు ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా సినిమా ప్రయత్నాలు చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే రూమ్ లో ఉండి కథలను మాటలను రాసేవారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.ప్రస్తుతం కొన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికీ పంజాగుట్టలో ఉన్న ఆ ఇంటికి ప్రతి నెల అద్దె చెల్లిస్తూనే ఉన్నారు.

అసలు ఈ ఇంటి అద్దె చెల్లించడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే చాలా మంది డైరెక్టర్లు కొన్ని సెంటిమెంట్ నన్ను బాగా నమ్ముతారు.అయితే ఇలాంటి సెంటిమెంట్ల పై నమ్మకం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో కొంత సెంటిమెంట్ గా భావించినప్పటికీ ఆ గదిలో సినిమా కథలను ఉంటారని అతని శిష్యులు చెబుతుంటారు.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లి కథలను వ్రాయడం చేస్తుంటారని, త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసమే ఆ ఇంటిని చాలా మంది ఎక్కువగా దొరకు అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా అతని కోసమే ఆ ఇంటిని ఖాళీగా ఉంచినట్లు ఆ ఇంటి ఓనర్ తెలిపారు. అందుకోసమే గత 20 సంవత్సరాల నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇంటికి అద్దె చెల్లిస్తున్నారని. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే.

ఇండస్ట్రీకి విలన్ అవుదామని వచ్చా.. మోహన్ బాబు అంటే చాలా ఇష్టం : సునీల్

సునీల్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా తెరంగేట్రం చేసి మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు చేసి మళ్లీ కమెడియన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు సునీల్. అయితే.. చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు. కానీ.. సునీల్ కు మాత్రం చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగారు. స్కూల్, కాలేజీ ఎగ్గొట్టి భీమవరంలో రోజూ సినిమాలు చూడటమే సునీల్ పని. మెగాస్టార్ చిరంజీవిలా డ్యాన్స్ వేయాలనుకోవడం, ఆయనలా ఉండాలనుకోవడం, ఆయనలా డ్రెస్సులు వేసుకోవాలనుకోవడం.. ఇలా సునీల్ కు చిన్నతనంలోనే సినిమా అంటే ఒకరకమైన అభిమానం ఏర్పడింది.

అయితే.. సునీల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నది నిజమే కానీ.. కమెడియన్ అవుదామని మాత్రం రాలేదట. తన ఫేస్ విలన్ కి అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి.. విలన్ అవుదామని హైదరాబాద్ కు వచ్చారట. కానీ.. ఆయనకు ఎక్కువగా కమెడియన్ పాత్రలు రావడంతో కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సునీల్. మెగాస్టార్ చిరంజీవి తర్వాత.. మోహన్ బాబు పండించే విలనిజం అంటే సునీల్ కు చాలా ఇష్టమట. మోహన్ బాబు విలన్ గా నటించిన సినిమాలు చూసే.. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు సునీల్.

త్రివిక్రమ్, నేను ఒకే రూమ్ లో ఉండేవాళ్లం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందు నుంచే సునీల్ కు త్రివిక్రమ్ తెలుసు. త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు లెక్చరర్ గా పనిచేసేవారట. లెక్చరర్ గా పనిచేస్తూనే సినిమాల్లో ట్రై చేసేవారట. హైదరాబాద్ కు వచ్చాక.. ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండి.. సినిమాల్లో ట్రై చేశారట. త్రివిక్రమ్ కూడా తన సినిమాల్లో సునీల్ కు ఎక్కువగా కమెడియన్ రోల్స్ ఇవ్వడంతో.. మిగితా సినిమాల్లో కూడా సునీల్ కు కమెడియన్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. అలా.. విలన్ అవుదామనుకున్న సునీల్ కాస్త.. కమెడియన్ అయ్యాడు.

చిన్నప్పుడు మా అమ్మ పర్సులో డబ్బులు ఎక్కువగా కొట్టేసేవాడిని

సునీల్ తండ్రి తన చిన్నప్పుడే చనిపోయారు. దీంతో.. సునీల్ ను పెంచే బాధ్యత మొత్తం సునీల్ తల్లి మీద పడింది. తను చాలా కష్టపడి మరీ.. సునీల్ ను పెంచింది. చిన్నప్పుడు సినిమాలు చూడటం కోసం.. తన పర్సులో డబ్బులు కొట్టేసి మరీ సినిమాలు చూసేవారట. అలా చిన్నప్పటి నుంచి సినిమాల మీద సునీల్ కు క్రేజ్ ఏర్పడింది.

రామ్ గోపాల్ వర్మ తో సినిమా చేయాలన్నా డ్రీమ్ తోనే అప్పల్రాజు సినిమా చేశా

సునీల్ కు.. రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టమట. అందుకే.. ఆయనతో తన జీవితంలో ఒక్కసినిమా చేయాలన్న కోరిక ఉండేదట సునీల్ కు. అందుకే.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో నటించారట సునీల్. రామ్ గోపాల్ వర్మ అంటే ఇప్పటికీ సునీల్ కు చాలా ఇష్టమట.

సునీల్ గురించి మనకు తెలియని ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే.. సునీల్ కు చాలా సిగ్గు ఎక్కువట. అందుకే అమ్మాయిలతో ఎక్కువగ మాట్లాడడట. ఎవ్వరితోనూ ఎక్కువగా విభేదాలు పెట్టుకోరు. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండే వ్యక్తి సునీల్.