Tag Archives: tweet viral

Karan Johar: సౌత్ స్టార్ తో సినిమా చేయబోతున్న కరణ్ జోహార్.. నెట్టింట ట్వీట్ వైరల్?

Karan Johar: బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో పలు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాగే అడియన్స్ కు కావాల్సిన సినిమాలను అందించడంలో ముందుంటారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ లాంటి షోల ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలకు ఎక్కువగా వల్గర్ బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

ఎక్కువ శాతం ఈయన బోల్డ్ విషయాలలోనే సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. కాగా ఇక గత ఏడాది రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాతో మరో హిట్ అందుకున్నారు కరణ్ జోహార్. రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ ప్రేథ కథ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు కొత్త ఏడాది మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు కరణ్. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని కూడా రాసుకొచ్చారు. ఆ పోస్టులో తాను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టు గురించి తెలిపారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే.. ఇది సినిమా ప్రకటన కాదు. కానీ ఇది సహకారంతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ సినిమా కోసం గత సంవత్సరం నుండి పని చేస్తున్నాము. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి వివరాలను చివరి వరకు రహస్యంగానే ఉన్నాయి.

ఆ విషయం చిత్ర బృందంకి తెలియదు..

ఈ సినిమాతో తెరంగేట్రం చేయనున్న దర్శకుడి ఉద్దేశం కూడా అదే కావడంతో చిత్రబృందానికి కూడా ఈ విషయం తెలియలేదు అని రాసుకొచ్చారు. అలాగే మరో మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో నటీనటులను అంచనా వేయాలని అభిమానులను కోరాడు. వారిలో ఒకరు సౌత్ సూపర్ స్టార్. ఇటీవల పవర్ ఫుల్ పాన్ ఇండియా సినిమాలో నటించారు. తన టాలెంట్, మోషనల్ ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకుంటున్న అభిమాన హీరోయిన్. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అరంగేట్రం చేస్తున్న నటుడు అతని ప్రతిభ అసాధారణమైనది. తన వృత్తి కోసం చాలా కష్టపడుతున్నాడు. అంటూ రాసుకొచ్చాడు కరణ్. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆ పోస్టుని చూసిన నెటిజన్స్ సౌత్ సూపర్ హీరో ఎవరు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/C2oxEbjI42d/?utm_source=ig_embed&ig_rid=4f12c8c6-3075-4876-84b1-443e061044b2

Chiranjeevi: డియరెస్ట్ మామయ్య అంటూ చిరంజీవికి అభినందనలు తెలిపిన ఉపాసన.. ట్వీట్ వైరల్?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్‌డౌన్‌లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు, అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ రావడం గర్వ కారణం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేస్తూ తనను ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్ లు కూడా చేశారు. అందులో భాగంగానే మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది.

మామయ్యకు అభినందనలు తెలిపిన ఉపాసన..

మామయ్య చిరంజీవికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ డియరెస్ట్ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌కు అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్‌కు అభినందనలు చెబుతున్నారు. ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయిత్వ ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Danush: మాజీ మామ రజనీకాంత్ జైలర్ సినిమాపై స్పందించిన ధనుష్… ఎంత ప్రేమనో?

Danush: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు ధనుష్ ఒకరు. హీరోగా ఎన్నో విభిన్న కథ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ధనుష్ 2004వ సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకొని రజనీకాంత్ కు అల్లుడు అయ్యారు. ఇలా రజినీకాంత్ కి ధనుష్ అల్లుడు మాత్రమే కాకుండా పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఇక ధనుష్ ఐశ్వర్య వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా కొనసాగుతున్న సమయంలోనే వీరిద్దరు గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ రజనీకాంత్ గారి పట్ల తనకు ఉన్నటువంటి అభిమానం ఏమాత్రం తగ్గదని పలు సందర్భాలలో ధనుష్ తెలియజేశారు.అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఆయన సినిమాలు అంటే ఈయనకు ఎంత ఇష్టమో తాజాగా మరోసారి రుజువు చేసుకున్నారు.ఇక నేడు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Danush: బంధం వీడిన అభిమానం వీడలేదు…


జైలర్ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇట్స్ జైలర్ వీక్ అంటూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే జైలర్ సినిమా కోసం ధనుష్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. ఈ ట్వీట్ చూసినటువంటి కొందరు అభిమానులు ధనుష్ తన మాజీ మామ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటికీ రజినీకాంత్ పట్ల ఉన్నటువంటి అభిమానం ఎప్పటికీ తగ్గదని మరోసారి ధనుష్ నిరూపించుకున్నారు.

Nagababu: దుర్మార్గపు పాలనకు ఎండ్ కార్డుపడే రోజులు దగ్గరకు వచ్చాయి… నాగబాబు ట్వీట్ వైరల్!

Nagababu: గత రెండు రోజులుగా మెగా వెర్సెస్ వైసీపీ అన్నట్టు సోషల్ మీడియాలోనూ మీడియా వార్తలులోను పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది.చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వైసీపీని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ముందు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రత్యేక హోదా తీసుకురావాలి అంటూ వైసిపి నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ విధంగా చిరంజీవి వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో వైసిపి నేతలు ఒక్కొక్కరు రంగంలోకి దిగుతూ చిరంజీవి పై అలాగే మెగా కుటుంబం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.తరుణంలో మెగా ఫాన్స్ అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందిస్తూ వైసిపి నేతలకు గట్టిగా బుద్ధి చెప్పారు.

ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… శ్రమను పెట్టుబడిగా పెట్టి పన్ను అనా పైసతో సహా చెల్లించి…వినోదాన్ని విజ్ఞానాన్ని జనాలకు పంచిపెట్టే 24 క్రాఫ్ట్ లకు కడుపునిండా భోజనం పెట్టే ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ. ఏ పని పాట లేనోడు పిల్లి తల కొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తుల మీద విషం కక్కుతున్నారు.ప్రస్తుతం ఆయన గురించి విమర్శలు చేస్తున్నటువంటి ఆంధ్ర మంత్రులు ఒకానొక సమయంలో ఆ అన్నయ్యతో ఫోటో దిగడం కోసం పడిగాపులు కాచిన వారేనంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

Nagababu: కాలం గాలం ఏస్తే ప్రకృతి కూడా శత్రువే…

మీ బతుకు శాఖలపై అవగాహన లేదు… అభివృద్ధి అంటే ఏంటో అర్థం తెలియదు కేవలం బటన్ నొక్కి పథకాలు అందిస్తేనే అభివృద్ధి కాదు…మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటేనే అర్థమవుతుంది. మీ దౌర్భాగ్యపు ధర్మాలను పాలనకు ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడుతున్నాయి…కాలం గాలం ఏస్తే ప్రకృతి కూడా శత్రువే అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Rashmi Gautam: వాడు రేపిస్ట్… కాపాడండి అంటూ సంచలన ట్వీట్ చేసిన రష్మీ…. వైరల్ అవుతున్న ట్వీట్!

Rashmi Gautam: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు సినిమాలలో కూడా నటిస్తూ సినిమాల పరంగా కూడా బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

రష్మీ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కొన్నిసార్లు పలు విమర్శలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈమె వాడు రేపిస్ట్ చాలా క్రూరంగా ఉన్నారు కాపాడండి అంటూ ఒక ఆందోళన కరమైన పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలు రష్మీ ఇలాంటి పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అని విషయానికి వస్తే…

రష్మీ పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే. ఎక్కడైనా మూగ జీవాలను హింసిస్తే వెంటనే రష్మీ రెస్పాండ్ అవుతూ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి కుక్కపిల్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియో ఈమె కంటపడింది దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మీ స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Rashmi Gautam: లైంగికంగా వేధించేవాడు…


ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది. అతడు చాలా క్రూయల్ గా ఉన్నాడు. అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదమే. పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు. అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు రష్మికి మద్దతు తెలుపగా.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు.

Chiranjeevi: మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్వాగతం… మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరంజీవి..ట్వీట్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మూడవ తరం వారసులు అడుగుపెట్టారు. మెగా కోడలు ఉపాసన నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అమ్మాయి జన్మించడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ ఇప్పటికే అపోలో హాస్పిటల్ కి చేరుకొని తమ వారసురాలని చూస్తూ సంబరపడిపోతున్నారు. అయితే తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన మనవరాలకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ పేదికగా స్పందిస్తూ.. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం.. నీ రాకతో కోట్లాదిమంది మెగా అభిమానులతో పాటు మాకు సంతోషాన్ని పంచావు. రామ్ చరణ్ ఉపాసనలను తల్లిదండ్రులను చేసావ్ మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ ను చేశావు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కోట్లాదిమంది మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Chiranjeevi జ్ఞాపకంలా మిగిలిపోతుంది…


ఈ విధంగా రాంచరణ్ తన మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేవిధంగా ఇతర సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ ఉపాసన దంపతులను పేరెంట్స్ క్లబ్ లోకి ఆహ్వానించడమే కాకుండా ఈ సమయంలో మీరు గడిపే ప్రతిక్షణం జీవితాంతం గుర్తుండిపోయే ఓ జ్ఞాపకంలో మిగులుతుంది ముగ్గురు చాలా సంతోషంగా ఉండాలి అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.

Sailesh Kolanu: అభిమాని ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేసిన దర్శకుడు.. వైరల్ అవుతున్న ట్వీట్..?

Sailesh Kolanu: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ హిట్ ‘ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శైలేష్ కొలను మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. విదేశాలలో ఉద్యోగం చేసుకుని శైలేష్ సినిమా మీద ఉన్న ఇష్టంతో కథ రాసుకొని దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన శైలేష్ హిట్ పార్ట్ 2 తో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక హిట్ పార్ట్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు శైలేష్ వెల్లడించాడు. ఈ హిట్ పార్ట్ 3 లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా శైలేష్ శేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అభిమాని కోరిక మేరకు ఇంటికి వెళ్లి అతన్ని సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో అభిమానితో దిగిన ఫోటో షేర్ చేస్తూ..” ఇతని పేరు పవన్. నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నాను అనే విషయం తెలిసి తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి ఆహ్వానించాడు. అయితే అభిమాని కోరిక మేరకు తాను కూడా సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళానని, వాళ్లది లవ్లీ ఫ్యామిలీ అని శైలేష్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ అమ్మ పునుగులు తినిపించారని అవి చాలా రుచికరంగా ఉన్నాయని తెలిపాడు.

Sailesh Kolanu: అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్…


ఆమె హీరో వెంకటేష్ అభిమాని అని తెలిసి మరింత ఆనందపడ్డానని తాను తెరకెక్కిస్తున్న సైంధవ్ సినిమాని మొదటి రోజు మొదటి షో చూస్తానని ఆమె చెప్పటంతో తనకు చాలా ఆనందంగా అనిపించిందని శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. శైలేష్ ప్రస్తుతం హీరో వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత హిట్ 3 షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అభిమాని కోరికను నెరవేర్చటానికి వారి ఇంటికి వెళ్లిన శైలేష్ పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Virupaksha Movie: విరూపాక్ష సినిమా సక్సెస్ పై చిరు ట్వీట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సాయి ధరమ్ తేజ్!

Virupaksha Movie: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా తాజాగా విడుదలై మొదటి షో నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మరొకవైపు మరోవైపు సినీ విశ్లేషకులు సైతం ఈ మూవీపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.

ఈ సినిమా సక్సెస్ అవటంతో సెలబ్రిటీలు కూడా సాయిధరమ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా విరూపాక్ష టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో..” విరూపాక్ష సినిమాకు వస్తున్న మంచి రిపోర్ట్స్ వింటున్నాను. నీ పట్ల చాలా సంతోషంగా ఉంది తేజ్.. ఒక బ్యాంగ్ తో నువ్వు మళ్లీ తిరిగి కంబ్యాక్ వచ్చావు. ప్రేక్షకులు నిన్ను అప్రిషియేట్ చేస్తూ వారి బ్లెస్సింగ్ తెలియజేస్తున్నారు. సినిమా సక్సెస్ కి టీం అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ కి సాయి ధరమ్ తేజ్ కూడా రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ‘ థాంక్యూ మామా అత్తా ‘ అంటూ రిప్లై ఇచ్చి ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా మరొకవైపు మెగా అభిమానులు కూడా విరూపాక్ష సినిమా సక్సెస్ అవ్వటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Virupaksha Movie: సాయి ధరమ్ తేజ్ కి ఇది పునర్జన్మ…

ప్రమాదం జరగడం వల్ల రెండేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ అనారోగ్యం నుండి కోలుకొని ఇలా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇది సాయి ధరమ్ తేజ్ కి పునర్జన్మ అని చెప్పవచ్చు. విరూపాక్ష సినిమాతో సాయిధరమ్ తేజ్ తన సినీ కెరీర్ ని మరొకసారి ప్రారంభించాడు. మొదటి ప్రయత్నంలోనే విరూపాక్ష సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు. ఇకపై కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి విజయాలు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Allu Arjun: ఓన్లీ హగ్సేనా…. పార్టీ లేదా పుష్ప.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్!

Allu Arjun: అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పిన ఎంతో విభిన్నంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హ్యాపీ బ‌ర్త్ డే బావా అల్లు అర్జున్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు థాంక్యూ యువ‌ర్ లౌల్లీ విషెష్ బావా… వార్మ్ హ‌గ్స్ అంటూ ప్రేమగా  రిప్లై ఇచ్చాడు .

ఈ విధంగా అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడంతో వెంటనే ఎన్టీఆర్ ఓన్లీ హగ్సేనా… పార్టీ లేదా పుష్ప అంటూ స్మైలీ ఎమోజితో మరొక పోస్ట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ వెంటనే వస్తున్న అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా వీరిద్దరూ వేదికగా చేసుకున్నటువంటి ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Allu Arjun:బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న హీరోలు…

ఈ విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఏ విధమైనటువంటి ద్వేషం ఈర్ష లేకుండా ఎంతో ఆప్యాయంగా బావా బావా అంటూ పిలుచుకోవడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇద్దరు హీరోలు తమ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Samyuktha Menon: విరూపాక్ష నిర్మాతలపై మండిపడిన సంయుక్త… క్షమాపణలు చెప్పిన మేకర్స్!

Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించిన ఈ అమ్మడు ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత బింబిసారా సినిమా ద్వారా మంచి హిట్ అందుకుంది. ఇక ఇటీవల ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమా ద్వారా హీరోయిన్గా మారి టాలీవుడ్లో ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉంది.

ఈ క్రమంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ మీద సంయుక్త నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ మేరకు సంయుక్త ట్వీట్ చేస్తూ..” నా నిరాశను తెలిపే ముందు ఒక విషయం చెప్పాలి. విరూపాక్ష టీమ్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని అద్భుతమైన నటీనటులతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితో కలిసి చేసిన ఈ ప్రయాణం నాకు ఎప్పటికీ మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. కానీ ఎస్వీసీసీ నిర్మాణ సంస్థ వారు .నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఈ ఉగాదికి నా పోస్టర్ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారు. నా పోస్టర్ ఎక్కడ? ఇచ్చిన మాట ఎందుకు తప్పారు అంటూ నిలదీసింది.

Samyuktha Menon: క్షమాపణలు చెప్పిన నిర్మాతలు…

ఇలా సోషల్ మీడియా వేదికగా సదరు నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ తనకు జరిగిన అన్యాయం గురించి నిలదీసింది. దీంతో సంయుక్త చేసిన ట్వీట్ పై సదరు నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మేరకు ఆమెను క్షమాపణలు కోరింది. అంతే కాకుండా వారి తప్పును సరిదిద్దుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని సంయుక్తని కోరింది. దీంతో కొంచం శాంతించిన సంయుక్త సరే ఎదురుచూస్తుంటాను అంటూ సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా సదరు నిర్మాణ సంస్థ మీద సంయుక్త మీనన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.