Tag Archives: tweet

Rahul Ramakrishna: రైలు ఘటనపై కామెడీ చేసిన రాహుల్ రామకృష్ణ… బుద్ధుందా అంటూ మండిపడుతున్న నేటిజన్స్!

Rahul Ramakrishna:ఒడిస్సాలో జరిగిన రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకేసారి మూడు రైలు ఢీకొనడంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు.ఇంత విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలలో మానవత్వం పరిమళించి క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి వేల సంఖ్యలో ప్రజలు రక్తదానం చేస్తున్నారు.

ఇలా ఈ రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో కలిసి వేసింది అయితే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మాత్రం రైలు ప్రమాద ఘటనపై కామెడీ చేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తనపై నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన చేసిన ట్వీట్ వెంటనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చేశారు అనే విషయానికి వస్తే…

రైలు ప్రమాదం జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సమయంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో హాలీవుడ్ నటుడు బస్టర్ కీటన్ సైలెంట్ అనే సినిమాలో రైలు ముందు చేసే విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. దీంతో నేటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే ఆ వీడియో డిలీట్ చేశారు. ఓ పక్క వందల కుటుంబాలలో మరణాలు సంభవించి అందరూ బాధపడుతుంటే మీకు కామెడీగా ఉందా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Rahul Ramakrishna: ఒట్టేసి చెబుతున్నా… క్షమించండి…


దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ అందరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ మరొక ట్వీట్ చేశారు. నిజానికి నాకు ఈ ఈ ఘటన గురించి ఏమాత్రం తెలియదు అర్ధరాత్రి నుంచి నేను స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను అందుకే న్యూస్ అప్డేట్ కాలేదని అందుకే తన వల్ల జరిగిన ఈ తప్పిదానికి తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి మరొక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vijay Devarakonda: తన పక్కన పడుకోవాలి అంటూ రౌడీ హీరోని బలవంత పెట్టిన నిర్మాత.. సంచలనగా మారిన ఉమైర్ సందు ట్వీట్!

Vijay Devarakonda: ఉమైర్ సందు పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఇలా ఈయన చేసే ట్వీట్ల కారణంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇకపోతే ఇదివరకు ఎంతోమంది సెలబ్రెటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా పాను ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన దేశవ్యాప్తంగా ఈయన ఎంతోమంది అభిమానులను మాత్రం సొంతం చేసుకున్నారు..ఈ క్రమంలోనే ఉమైర్ సందు విజయ్ దేవరకొండ గురించి ట్వీట్ చేస్తూ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను కవ్వించేందుకు శాయాసక్తుల ప్రయత్నం చేశారని, ఇక తన పక్కన పడుకోవాలని తనని బలవంతం కూడా చేశారని తెలిపారు.

Vijay Devarakonda: ఫైర్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్…


కరణ్ జోహార్ ఆఫర్ ను విజయ్ దేవరకొండ తిరస్కరించారు అంటూ ఈ సందర్భంగా ఉమైర్ సందు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈయన చేసిన ఈ ట్వీట్ చూసినటువంటి విజయ్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే ఈయన ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఈయన గౌతం తిన్ననూరి సినిమాతో బిజీ కానున్నారు.

Samantha: ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు కదా సామ్… నేటిజన్ ప్రశ్నకు సమంత రియాక్షన్ ఇదే!

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత ప్రస్తుతం తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సమంతకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఒక వీడియోని షేర్ చేస్తూ.. నేను మీకు చెప్పే అంత చనువులేదని నాకు తెలుసు అయినా మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయండి ప్లీజ్ అంటూ ఈమెకు సలహా ఇచ్చారు. అయితే నేటిజన్ చేసిన ట్వీట్ కి సమంత సమాధానం ఇస్తూ మీకన్నా నన్ను ఎవరు ఎక్కువగా ప్రేమించగలరు అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు.

Samantha: మీలో ఎవరు ప్రేమించలేరు…


ఇలా సమంత అభిమానులే తనని ఎక్కువగా ప్రేమించగలరు అంటూ చెప్పినటువంటి ఈ కామెంట్స్ విన్న అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Akkineni Akhil: కార్తికేయను బ్రో అన్న అఖిల్… కార్తికేయ రిప్లై చూసి షాక్ అయినా అక్కినేని ఫ్యాన్స్?

Akkineni Akhil: ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అందరికంటే ముందుగా కార్తికేయ పేరును సంబోధిస్తూ అతిపెద్ద ఘనత సాధించినందుకు మై బ్రదర్ కార్తికేయకు బిగ్ షౌటౌట్ అంటూ తర్వాత మిగతా వారి పేర్లు పెట్టాడు.. ఇలా అఖిల్ చేసిన ట్వీట్ కి కార్తికేయ రిప్లై ఇచ్చారు. అయితే ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు.

అఖిల్ బ్రో అంటూ సంబోధిస్తూ ట్వీట్ చేయగా కార్తికేయ మాత్రం థ్యాంక్యూ రా!.. లవ్ యూ అంటూ హార్ట్ సింబల్స్‌తో రీ ట్వీట్ చేశాడు కార్తికేయ..అయితే అభిమానులు మాత్రం కార్తికేయ చేసిన ట్వీట్ పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ మిమ్మల్ని బ్రో అని పిలిస్తే మీరు మాత్రం రా అని పిలుస్తున్నారు ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం ఇలా పిలవడం ఏంటి సారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Akkineni Akhil: అఖిల్ కార్తికేయ కన్నా చిన్నవాడే…


ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కొంత పాటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అఖిల్ వయసులో కార్తికేయ కన్నా చిన్నవాడు అంతేకాకుండా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది ఆ స్నేహబంధం కారణంగానే తనని రా అని పిలిచి ఉంటాడు.ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏమాత్రం లేదంటూ మరికొందరు కార్తికేయ పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు.

Bandla Ganesh: విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు కలయికపై బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్…. పిచ్చి కూతలు ఆపు అంటూ భారీ ట్రోల్!

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్నారు అయితే ఈయన కొన్నిసార్లు సమయం సందర్భం లేకుండా చేసేటటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు ఈ వ్యాఖ్యలపై ఇతనిని భారీగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్ కి గురయ్యారు బండ్ల గణేష్.

నందమూరి తారక రత్న మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు తరలివచ్చే ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే తారకరత్న మరణ వార్తతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తనకు నివాళులు అర్పించడానికి వచ్చారు.ఇక అలేఖ్య రెడ్డి స్వయానా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడంతో విజయసాయిరెడ్డి కూడా ఇక్కడ ఉండి అన్ని తానే చూసుకున్నారు.

తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించి అనంతరం విజయసాయిరెడ్డితో కలిసి మాట్లాడారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని అసలు మాట్లాడను… అవసరం వస్తే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా అది నా నైజం.

Bandla Ganesh: బతికితే సింహంలా బతకాలి…


అత్యంత బాధాకరమైన విచిత్రం ఇది.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ పై ఎంతోమంది నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బండ్ల గణేష్ నీ పిచ్చి కూతలు ఆపు అంటూ కొందరు కామెంట్లు చేయగా,వారు కలిసిన సమయం సందర్భం ఏది నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? ఆ మాత్రం సంస్కారం లేదా అంటూ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Mohammed Shami: కర్మ అంటే ఇదే.. షోయబ్ అక్తర్ కి కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ స్వీట్ వైరల్?

Mohammed Shami: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పోటీ పడగా పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండోసారి కప్పు గెలవాలని భావించిన పాకిస్తాన్ ఆశలపై ఇంగ్లాండు నీళ్లు చల్లి చివరికి కప్పును సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా పాకిస్తాన్ ఓటమి పాలు కావడంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ అక్తర్ బాధాకరమైన ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే షోయబ్ బ్రోకెన్ హార్ట్ ఎమోజి షేర్ చేస్తూ పాక్ ఓటమి పాలు కావడం ఎంతో బాధాకరంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఈయన ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు.

ఈ సందర్భంగా షోయబ్ చేసిన ట్వీట్ కి ఈయన రిప్లై ఇస్తూ.. దీనినే కర్మ అంటారు బ్రదర్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలు కావడంతో టీమిండియా ఆట తీరును ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హేళన చేస్తూ ట్వీట్లు చేశారు.

Mohammed Shami: పాక్ ఆటగాళ్లకు కౌంటర్ ఇచ్చిన మహమ్మద్ షమీ

ఫైనల్ లో పాకిస్తాన్ భారత్ తో పోటీ పడటం కోసం ఎదురు చూస్తుందని అయితే అది జరగదు అంటూ టీమిండియాని హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫైనల్ లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో మహమ్మద్ షమీ ఈ విధంగా షోయబ్ అక్తర్ ట్వీట్ కి కౌటరిస్తూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: అది కూడా వారి ఆటలో ఒక భాగమే.. పొత్తులపై ఆసక్తికర ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్..ట్వీట్ వైరల్!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైందని చెప్పాలి.ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో పొత్తుల గురించి పెద్ద ఎత్తున పలు పార్టీల మధ్య చర్చలు మొదలవుతున్న వేల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan: అది కూడా వారి ఆటలో ఒక భాగమే.. పొత్తులపై ఆసక్తికర ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్..ట్వీట్ వైరల్!

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి పరోక్షంగా స్పందిస్తూ తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జర భద్రం… అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు ఉన్నఫలంగా మనల్ని పొగుడుతున్నారు. అలా ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, అతను పరివర్తన చెందాడని చప్పట్లు కొడితే మన ప్రత్యర్థి కల నెరవేరినట్లే.

Pawan Kalyan: అది కూడా వారి ఆటలో ఒక భాగమే.. పొత్తులపై ఆసక్తికర ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్..ట్వీట్ వైరల్!

అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు ఒక్కసారిగా మన పై ప్రశంసలు కురిపిస్తూ, మనల్ని పొగుడుతున్నారు కదా అని వారిని ఆకాశానికి ఎత్తకండి ఇలా వాళ్లు పొగడడం కూడా వారి మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా తన పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు పొత్తుల గురించి పరోక్షంగా ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఎంతో ఆసక్తికరంగా మారింది.

మొదలైన ఎన్నికల హడావిడి…

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతి ఒక్క పార్టీ నేతలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

Actress Kasturi : కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి.. ట్వీట్ వైరల్!

Actress Kasturi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తులసి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నారు.

Actress Kasturi: కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి..ట్వీట్ వైరల్!

ఇలా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూనే మరోవైపు సామాజిక అంశాలపై స్పందిస్తే తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ తన అభిప్రాయాలను తెలియ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్ అండర్ వేర్ ప్రకటనపై ఈమె స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.సాధారణంగా బాగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లు ఇలాంటి ఆడ్ చేయడానికి ఇష్టపడరు. కానీ రాహుల్ మాత్రం ఈ యాడ్ లో నటించారు.

Actress Kasturi: కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి..ట్వీట్ వైరల్!

ఈ సందర్భంగా కె.ఎల్.రాహుల్ అండర్ వేర్ యాడ్ ఫై కస్తూరి స్పందిస్తూ.. తాను ఇప్పటివరకు క్రికెటర్లు మాములుగా కోలాలు, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, ఇతర ప్రముఖ బ్రాండ్లకు ఎండార్స్ చేయడమే చూశాను.. కానీ ఇలా లోదుస్తుల గురించి ప్రచారం చేయడం ఎప్పుడూ చూడలేదు. కానీ రాహుల్ మాత్రం ఏ విధమైనటువంటి బెరుకు లేకుండా ఇలాంటి యాడ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. రాహుల్ ఇలా బాక్సర్ లా చూడటం బాగుంది అంటూ ఈమె ద్వారా కె.ఎల్.రాహుల్ అండర్ వేర్ యాడ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

వెల్లువెత్తిన విమర్శలు…

ఈ క్రమంలోనే ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె ఈ యాడ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ ట్వీట్ పై పలువురు స్పందిస్తూ కస్తూరిని విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా, ఇలా సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Singer KK: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. సంతాపం తెలిపిన మోడీ!

Singer KK: పాటే తన ప్రాణంగా భావించిన ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.తీయటి గాత్రంతో పలు భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి విశేష ఆదరణ సంపాదించుకున్న కృష్ణ కుమార్ కున్నాత్ తన చివరి శ్వాస వరకు పాటపాడుతూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృత్యువాతపడ్డారు.

Singer KK: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. సంతాపం తెలిపిన మోడీ!

మంగళవారం రాత్రి కోల్‌కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కళాశాల ఫెస్ట్‌లో పాటల వాడిన అనంతరం కేకే ది గ్రాండ్ హోటల్ కి చేరుకొని ఆ సంగీత వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హోటల్ గదిలో కుప్పకూలిపోయారు.

Singer KK: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. సంతాపం తెలిపిన మోడీ!

ఇతనిని గమనించిన అతని సహాయకులు కార్యక్రమ నిర్వాహకులు ఇతనిని హుటాహుటిన కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృత్యువాతపడ్డారు.
కేకే ఆగస్టు 23, 1968 న ఢిల్లీలో మలయాళీ దంపతులైన సి. ఎస్. నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించిన కేకే సంగీతంపై మక్కువతో గాయకుడిగా పలు భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు.

చివరి శ్వాసవరకు పాట పాడుతూ…

ఇలా పాటే ప్రాణంగా బతికిన కేకే తన తుది శ్వాస వరకు పాటలు పాడుతూ తుది శ్వాస విడవడంతో ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం కేకే మరణ వార్త విని సంతాపం ప్రకటించారు. కేకే తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి విశేష ప్రేక్షకాదరణ పొందారు.

Manchu Vishnu: ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..ట్వీట్ వైరల్!

Manchu Vishnu: మంచు విష్ణు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు పొంది ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మా ఎన్నికలలో నటుడు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి మా బాధ్యతలను విష్ణు తీసుకున్నారు.

Manchu Vishnu: ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..ట్వీట్ వైరల్!

ఈ విధంగా మా ఎన్నికల సమయం నుంచి మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ఈ వ్యాఖ్యలు చేసిన తీవ్రస్థాయిలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం గురించి మరోసారి మాట్లాడారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్ద గురించి ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Manchu Vishnu: ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..ట్వీట్ వైరల్!

దర్శకరత్న దాసరి నారాయణరావు గారు జయంతి వేడుక సందర్భంగా ఇండస్ట్రీ మొత్తం దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దర్శకుల దినోత్సవం సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ దాసరి గారు మరణించిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేదు. అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద దాసరి గారే అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాంటి బాధ్యతలు నాకొద్దు…

ఈ క్రమంలోనే మంచు విష్ణు ట్విట్ పై మెగా అభిమానులు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి అంటూ కామెంట్లు చేయడమే కాకుండా ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు కనక ఆయనే ఇండస్ట్రీ పెద్ద అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే చిరంజీవి అలాంటి బాధ్యత తీసుకోవడానికి తాను సిద్ధంగాలేనని, కాకపోతే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయం చేస్తానని మెగాస్టార్ వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.