Tag Archives: upasana konidela

Ramcharan: మా పాప పై మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి… మొదటిసారి మీడియాతో మాట్లాడిన చరణ్!

Ramcharan: రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఈనెల 20 వ తేదీ ఆడబిడ్డ జన్మించిన సంగతి మనకు తెలిసింది. అపోలో హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చిన ఉపాసన నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిసి వైద్యులు డిశ్చార్జ్ చేసారు. అయితే ఉపాసన డిస్చార్జ్ అవుతున్న తరాణంలో రామ్ చరణ్ మొదటి సారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాంచరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.జూన్ 20వ తేదీ ఉపాసన బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఇక తన బేబీ కోసం ఎంతో కేర్ తీసుకున్నటువంటి అపోలో హాస్పిటల్ వైద్యులకు ఈయన ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఎన్నో సంవత్సరాలుగా తాము ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామని అయితే దేవుడు బ్లెస్సింగ్స్ వల్ల తమకు పాప పుట్టిందని తెలిపారు. పాప కోసం ప్రార్థించిన ప్రతి ఒక్క అభిమానులకు ధన్యవాదాలు అని తెలియజేశారు. నా కూతురిపై మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని, ఈ సంతోషకరమైన సమయంలో తాను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని రామ్ చరణ్ తెలిపారు. ఇక రామ్ చరణ్ ను మీడియా ప్రశ్నిస్తూ పలు ప్రశ్నలు వేశారు.

Ramcharan: పాప నా పోలికలతోనే ఉంది.


పాపకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారని చెప్పడంతో తాను ఉపాసన ఇద్దరు కూడా పేరు ఫిక్స్ అయ్యామని 21వ రోజు ఆ పేరును రివిల్ చేస్తామని తెలిపారు.ఇక పాపను ఎత్తుకోగానే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందని అడగగా అందరి నాన్నలకు కలిగిన ఫీలింగ్ తనకు కలిగిందని తెలిపారు. పాప ఎవరి పోలికలతో ఉంది అంటూ ప్రశ్నించడంతో పాప నా పోలికలతోనే ఉన్నారు అంటూ చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Niharika: చరణ్ అన్నను బాపూజీ అని పిలుస్తాం… నిహారిక కామెంట్స్ వైరల్!

Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె తిరిగి సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయారు ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి నిహారిక తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రామ్ చరణ్ గురించి అలాగే తన భార్య ఉపాసన గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ రామ్ చరణ్ అన్నయ్య తండ్రి కాబోతున్నారన్న విషయం గత ఏడాది తెలిసినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషం వ్యక్తం చేశామని తెలిపారు. ఇక పాప రాకతో వారి ఫ్యామిలీ పరిపూర్ణమైందని నిహారిక వెల్లడించారు. ఇక చరణ్ అన్నయ్య మా మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరి పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు.

ఇలా అందరి పట్ల ప్రేమగా ఎంతో బాధ్యతగా ఉండడంతో మేమందరం చరణ్ అన్నయ్యను బాపూజీ అని పిలుస్తామని నిహారిక ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఉపాసన వదిన గురించి చెప్పాల్సిన పనిలేదు ఆమె ఒక శక్తివంతమైన మహిళ. వీరిద్దరి సంరక్షణలో పాప పెరుగుతుంది అంటే తను కూడా ఓ గొప్ప స్థాయికి వెళ్తుందని నిహారిక వెల్లడించారు.

Niharika: గొప్ప స్థాయికి వెళ్తుంది…


ఈ సందర్భంగా నిహారిక తన అన్నయ్య రామ్ చరణ్ వదిన ఉపాసన గురించి పలు విషయాలను తెలియచేయడమే కాకుండా తనకు పుట్టిన కూతురు కూడా ఓ గొప్ప స్థాయికి వెళ్తుంది అంటూ ఈ సందర్భంగా తను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నిహారిక వ్యక్తిగత జీవితంలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చిందని అందుకే తన భర్తకు విడాకులు ఇచ్చారంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Upasana -Ramcharan: వామ్మో ఉపాసన రాంచరణ్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా… భారీగానే సంపాదించారుగా?

Upasana -Ramcharan:టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రిగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈయన గత 11సంవత్సరాల క్రితం ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఉపాసన కూడా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.ఇక ఉపాసన అపోలో హాస్పిటల్ ఫౌండర్ సి ప్రతాపరెడ్డి మనవరాలు అనే విషయం మనకు తెలిసిందే. ఈయన ఇండియాలో ఉన్నటువంటి టాప్ బిలినియర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇలా ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటి కోడలుగా ఉపాసన అడుగుపెట్టారు.

ఈ విధంగా ఉపాసన మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పటికీ ఈమె అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ గాబాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఇలా బిజినెస్ ఉమెన్ గా ఉపాసన కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా వృత్తిపరమైన జీవితాలలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి వీరిద్దరూ ప్రస్తుతం తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఉపాసన రాంచరణ్ ఆస్తి గురించి ప్రస్తుతం ఓ వార్త సంచలనంగా మారింది.

Upasana -Ramcharan: భారీగా ఆస్తులు పోగుచేసిన మెగా పవర్ స్టార్..


ఉపాసన రాంచరణ్ ఆస్తులు కలిపి 2500కోట్ల రూపాయల వరకు ఉంటాయని సమాచారం ఇందులో ఉపాసన ఆస్తి విలువ మాత్రమే 1130 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.ఇలా వీరిద్దరూ వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ సాధించడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

Upasana: వామ్మో ఉపాసన ఆస్తులు విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా… తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం?

Upasana: మెగా కోడలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఉపాసన ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా ఉపాసన రాంచరణ్ లకు కూతురు జన్మించడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సంతోషకరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఉపాసన కూతురికి జన్మనివ్వడంతో ఉపాసన గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన ఏం చదివింది తన ఆస్తులు విలువ ఎంత అనే విషయాల గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఉపాసన ఇండియాలోనే టాప్ 100 బిలీనియర్స్ అయినటువంటి వారిలో ప్రతాపరెడ్డి మనవరాలుగా గుర్తింపు పొందారు. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఉన్నటువంటి ప్రతాపరెడ్డి నికర ఆస్తులు విలువ 21 వేల కోట్ల రూపాయలను తెలుస్తుంది.

ఇక ఉపాసన ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లోగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటున్నారు. అలాగే బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాలలో కూడా ఉపాసన చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

up

Upasana: వేల కోట్లు సంపాదించిన ఉపాసన రాంచరణ్..


ఇక తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి మాత్రమే కాకుండా కేవలం ఉపాసన సంపాదించిన ఆస్తి విలువ సుమారు 1,130 వేలకోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన రామ్ చరణ్ ఇద్దరి ఆస్తి కలిపి సుమారు 2500 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ఇలా వీరి ఆస్తిపరంగా చూసుకుంటే రామ్ చరణ్ కంటే ఉపాసననే ఆస్తిపరురాలని తెలుస్తోంది.

Surekha: ఉపాసన డెలివరీ జరుగుతుండగా సురేఖ అలాంటి పని చేశారా… అసలేం చేశారంటే?

Surekha:ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈమె సోమవారం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ అయ్యారు. అయితే ఆ సమయంలో ఉపాసన వెంట తన భర్త రామ్ చరణ్ తో పాటు ఉపాసన తల్లి అలాగే తన అత్తయ్య సురేఖ కూడా ఉన్నారు. ఇలా ఈమె డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ కి వెళ్లినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఉపాసనకు డెలివరీ అవుతున్న సమయంలో తన కోడలు అలాగే తనకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండడం కోసం సురేఖ ఆసుపత్రిలో చేసినటువంటి పని ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈమె ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక గదిలో తన కోడలు తనకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలని దేవుడికి నమస్కరించి హనుమాన్ చాలీసా చదివారట.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు ఆంజనేయస్వామిని ఎంతో భక్తితో పూజిస్తారు.ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాన్నీ కూడా చిరంజీవి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు అలాగే తమకు మనవరాలు కూడా మంగళవారమే జన్మించడంతో మాకెంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజున తమకు మనవరాలు పుట్టడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు.

Surekha: హనుమాన్ చాలీసా చదివిన సురేఖ…


ఈ విధంగా ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి ఉన్నటువంటి సురేఖ తన కోడలు డెలివరీ అవుతున్న సమయంలో తన క్షేమంగా ఉండాలంటూ హనుమాన్ చాలీసా చదవడంతోనే వీరిద్దరూ చరణ్ పిల్లల కోసం ఎంత ఆత్రుతగా ఎదురు చూశారో అర్థమవుతుంది.ఇక పాప పుట్టింది అనే విషయం తెలియగానే రామ్ చరణ్ ముందుగా తన కుమార్తెను తన చేతులలోకి తీసుకోకుండా తన తండ్రి చేతులలోకి పెట్టి తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూశారట.

Upasana: ఉపాసన బిడ్డ కోసం కానుకగా పంపిన ఊయల ధర ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Upasana: రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె ప్రెగ్నెన్సీ ని ప్రకటించినప్పటి నుంచి తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గత రెండు రోజుల క్రితం ప్రజ్వల ఫౌండేషన్ నుంచి ఉపాసన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఒక హ్యాండ్ మేడ్ ఊయలను పంపిన విషయం మనకు తెలిసిందే.

ఈ ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నటువంటి మహిళలకు ఉపాధిని కల్పిస్తూ ఇలా హ్యాండ్ మేడ్ వస్తువులను తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉపాసన ఈ ఫౌండేషన్ కి ఎన్నో విరాళాలు అందజేస్తూ చాలా సహాయం చేశారు ఈ క్రమంలోనే ఈ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మహిళలు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం హ్యాండ్ మేడ్ ఊయల తయారుచేసి కానుకగా పంపించారు.

ఈ ప్రజ్వల ఫౌండేషన్ లో ఎక్కువగా మహిళలు సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకుపోయిన వారే ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇక్కడ మహిళలు ఎంతో ధైర్యంగా తమ ఆత్మ గౌరవంతో బ్రతుకుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ మహిళలు ఉపాసన కోసం ఊయల పంపించడంతో ఉపాసన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ ఊయల ధర గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Upasana: లక్షల విలువ చేస్తున్న ఊయల..


సాధారణంగా ఇలా వుడ్ హ్యాండ్ మేడ్ వస్తువులకు విదేశాలలో చాలా మంచి డిమాండ్ ఉంది ఇలా హ్యాండ్ మేడ్ వస్తువులను విదేశాలలో కొనుగోలు చేయాలి అంటే దాదాపు లక్ష డాలర్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లక్ష డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 80 లక్షల వరకు విలువ చేస్తుందని చెప్పాలి.ఇలా ఉపాసన కోసం సదరు ఫౌండేషన్ కానుకగా పంపిన ఊయల ధర ఈ స్థాయిలో ఉంటుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Upasana: ఆ ఒక్క కారణంతోనే తిరిగి మామయ్య ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం : ఉపాసన

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సంగతి మనకు తెలిసిందే మరొక నెల రోజులలో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన గురించి తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తన గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన గత కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్న సంగతి మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఆ ఇంటిని కాళీ చేయబోతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ త్వరలోనే తాను చరణ్ ఇద్దరం కూడా తిరిగి అత్తయ్య మామయ్య ఇంటికి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటూ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అసలు వీరిద్దరూ తిరిగి చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారో కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

Upasana: నా పిల్లలకు ఆ ప్రేమ దక్కాలి…


నేను చరణ్ నేడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అందుకు గల కారణం మా గ్రాండ్ పేరెంట్స్ మాకు వారు పంచిన ప్రేమ వల్లేనని ఈమె తెలియజేశారు. అయితే ఆ ప్రేమ నా పిల్లలకు కూడా దక్కాలి అందుకే తిరిగి తాము తన అత్తయ్య మామయ్య ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేయడంతో వీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Upasana: ప్రెగ్నెన్సీ గురించి చెప్పగానే రామ్ చరణ్ అలా రియాక్ట్ అయ్యారు… ఉపాసన కామెంట్స్ వైరల్!

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. మరికొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి సుమారు పది సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక మరికొద్ది రోజులలో మెగా కాంపౌండ్ లోకి బుల్లి వారసుడు లేదా వారసురాలు అడుగు పెట్టబోతున్నారు.

ఇలా ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈమె గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఉపాసన కూడా ఎప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కలిగే అనుభూతులను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అదేవిధంగా తన బేబీ బంప్ ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకున్నటువంటి ఈమె సహజంగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మొదటిసారి తన భర్త రామ్ చరణ్ కు చెప్పినప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాల గురించి కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనిపిస్తోంది అంటూ రామ్ చరణ్ కు చెప్పినప్పుడు తను మాత్రం చాలా కూల్ గా నువ్వు ఈ విషయం గురించి ఎగ్జైట్ అవ్వద్దు అని చెప్పారు.

Upasana:అందుకే చరణ్ అంటే ఇష్టం…


చాలా ప్రశాంతంగా ఉండు మనం పరీక్షలు చేయించుకున్న తర్వాతే నిర్ధారించుకుందాం అని చాలా కూల్ గా సమాధానం చెప్పారు.నేను ఏ విషయం అయినా చాలా తొందరపడి చెప్పేస్తాను కానీ రామ్ చరణ్ అలా కాదు చాలా కూల్ గా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడుతారు అందుకే తనంటే నాకు చాలా ఇష్టం నేను ఇప్పుడు ఇలా సంతోషంగా ఉన్నాను అంటే అందుకు కారణం చరణ్ అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ramcharan: పుట్టబోయే నా బిడ్డకు జపాన్ కు సంబంధం ఉంది… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన మరో రెండు నెలలలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. పెళ్లయిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఈ సంగతి మెగా కుటుంబంలోనూ అలాగే అభిమానులలోను ఎంతో సంతోషాన్ని కలిగించింది.ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త తెలియగానే బుల్లి వారసుడి కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి.

ఇక ఉపాసన సైతం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అలాగే తన బేబీ షవర్ వేడుకలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాలను తెలియచేస్తూ అభిమానులలో సంతోషాన్ని నింపుతున్నారు. ఇకపోతే తాజాగా రాంచరణ్ సైతం తనకు పుట్టబోయే బిడ్డ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ కాశ్మీర్ లో జరుగుతున్న జి 20 సదస్సులో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పలు ఇంటర్వ్యూలలో కూడా ఈయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ తనకు పుట్టబోయే బిడ్డ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తనకు జపాన్ అంటే ఎంతో ఇష్టమని తెలియజేశారు.

Ramcharan: మ్యాజిక్ మొత్తం జపాన్ లో జరిగింది…


తనకు పుట్టబోయే బిడ్డకు జపాన్ కు మంచి అనుబంధం ఉందని అందుకే తనకు జపాన్ అంటే చాలా ఇష్టం అని జపాన్ అంటే తన మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని చరణ్ తెలియజేశారు.ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ అయితే ఈ మ్యాజిక్ అంతా జపాన్లోనే జరిగింది అంటూ ఈయన సరదాగా నవ్వుతూ తన పుట్టబోయే బిడ్డ గురించి తెలియజేశారు. అయితే RRR ప్రమోషన్లలో భాగంగా జపాన్ వెళ్లి వచ్చిన తర్వాత వీరిద్దరు తమ ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

Upasana: అఖిల్ పనికి తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాసన… అందుకే ఆ ఫ్యామిలీని దూరం పెట్టారా?

Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో భార్యగా, మెగా కోడలుగా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఉపాసన ఏ విషయం గురించి మాట్లాడినా ఆచితూచి అడుగులు వేస్తూ మాట్లాడుతుంటారు. ఇలా ఎంతో బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించే ఉపవాసన అక్కినేని అఖిల్ విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది.

అసలు అఖిల్ పై ఉపాసనకు కోపం ఏంటి ఎందుకు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే విషయానికి వస్తే… అఖిల్ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. ఇక వీరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది.అయితే కొన్ని కారణాలవల్ల వీరి నిశ్చితార్థం ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా శ్రియ భూపాల్ తో అఖిల్ నిశ్చితార్థం బ్రేకప్ కావడానికి గల కారణం అఖిల్ అని తెలుస్తుంది. ఆయనకున్న హెడ్ వెయిట్ కారణంగా శ్రియ భూపాల్ తో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారని అందుకే ఈ నిశ్చితార్థం ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థం ఆగిపోవడంతో కుటుంబ పరువు మొత్తం పోయిందని ఉపాసన పెద్ద ఎత్తున అఖిల్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

Upasana: ఉపాసన కజిన్ సిస్టర్…

వీరినిచ్చితార్థం ఆగిపోతే ఉపాసన కుటుంబ పరువు పోతుందని ఎందుకు బాధపడాలి అనే విషయానికి వస్తే అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నటువంటి శ్రియ భూపాల్ మరెవరో కాదు స్వయంగా ఉపాసన కజిన్ సిస్టర్. ఇలా ఉపాసన కజిన్ సిస్టర్ పట్ల అఖిల్ వ్యవహరించిన తీరు వల్ల ఆమె విసుగు చెందారని అందుకే అఖిల్ అంటే ఉపాసనకు ఏ మాత్రం పడదని తెలుస్తుంది. కేవలం అఖిల్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా ఉపాసన దూరం పెట్టారని తెలుస్తోంది.ఇక శ్రీయ భూపాల్, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఉపాసన సీమంతపు వేడుకలలో కూడా శ్రీయ భూపాల్ పెద్ద ఎత్తున హంగామా చేశారు.