Tag Archives: wife

Aravind Swamy: ఆ స్టార్ హీరో అరవింద స్వామి భార్య సంపాదన చూస్తే..! షాక్ అవ్వాల్సిందే…!

Aravind Swamy: అరవింద్ స్వామి.. పేరును ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. రోజా, బొంబాయి వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాలు తెలుగులో విడుదలై.. చాలా పెద్ద హిట్ సాధించాయి. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలు క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. రజినీకాంత్ దళపతి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అరవింద స్వామి.. ఆ సమయంలో అమ్మాయిల కలకల రాకుమారుడిగా నిలిచారు. 

Aravind Swamy: ఆ స్టార్ హీరో అరవింద స్వామి భార్య సంపాదన చూస్తే..! షాక్ అవ్వాల్సిందే…!

అయితే ఆ తరువాత సినిమాలు పెద్దగా సక్సెస్ రాకపోవడంతో వెండితెరకు దూరమై.. బిజినెస్ చూసుకుంటున్నాడు. అయితే తమిళ సినిమా ‘తనిఒరువన్’ సినిమాతో స్టైలిష్ విలన్ గా మళ్లీ సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో రామ్ చరన్ తేజ హీరోగా ‘ధృవ’గా వచ్చింది. ఇందులో కూడా విలన్ రోల్ ని అరవింద స్వామి పోషించాడు. ఇటీవల తలైవి మూవీలో ఎంజీఆర్ రోల్ లో అరవింద స్వామి నటించాడు. 

Aravind Swamy: ఆ స్టార్ హీరో అరవింద స్వామి భార్య సంపాదన చూస్తే..! షాక్ అవ్వాల్సిందే…!

ఇదిలా ఉంటే ప్రస్తుతం అరవిందస్వామి భార్య అపర్ణ ముఖర్జీ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆమె నెల సంపాద‌న, ఆమె వృత్తి, ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలను గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో ఉన్న ప్రముఖ న్యాయవాదుల్లో అపర్ణా ముఖర్జీ ఒకరు. ఆమెకు విదేశాల్లో కూడా న్యాయవాదిగా వాదించే లైసెన్స్ ఉంది. దేశంలో పలు కార్పోరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామిక వ్యక్తులకు సేవలు అందిస్తుంటారు. 

ఈ సంపాదన చూసి ప్రస్తుతం ప్రజలు షాక్ ..

ఇంతే కాకుండా.. అర‌వింద్ స్వామికి చెందిన ప‌లు కంపెనీల బోర్డుల్లో డైరెక్ట‌ర్‌గాను, బ‌య‌ట కంపెనీల‌కు లీగ‌ల్ స‌ల‌హ‌దారుగా ఉంటూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇవి కాక ఆమె సొంత కంపెనీల నుంచి కొంత ఆదాయం ఆమె వాటాగా వ‌స్తుంది. దీంతో నెలకు సుమారుగా రూ. 30-40 కోట్లను ఆర్జిస్తోంది. ఈ సంపాదన చూసి ప్రస్తుతం ప్రజలు షాక్ అవుతున్నారు. ఓ స్టార్ కు భార్యగా ఉండీ.. ఈ రేంజ్ లో సంపాదిస్తుండటం చూసి నోరెళ్లబెడుతున్నారు.

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

Crime News: అక్రమ సంబంధాలు, వ్యసనాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కొంత మంది భార్యలు భర్తలను, పిల్లల్ని హత్య చేస్తుంటే…మరికొంతమంది భర్తలు భార్యల్ని కడతేరుస్తున్నారు. తాజాగా భార్యను చంపి నాటకం ఆడిన ఓ భర్త బండారం బట్టబయలైంది. సొంత మేనకోడలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ… భార్య అడ్డంగా ఉందని దారుణంగా హత్య చేశారు ఓ దుర్మార్గుడు. 

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొర పాలెం పంచాయతీలో జోడిమెరక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు(33).. భార్య లక్ష్మీని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మీతో నాగరాజుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఏడు ఏళ్ల బాబు యశ్వంత్ ఉన్నాడు. అయితే వరసకు మేనకోడులు అయ్యే మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు నాగరాజు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దల పంచాయతీ నిర్వహించి నాగరాజును మందలించారు.

దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లి..

ఎలాగైనా భార్య లక్ష్మీని అడ్డు తొలగించుకోవాలనుకున్న నాగరాజు పథకం ప్రకారం జనవరి 28న రాత్రి 7.30 గంటలకు స్వీట్ షాప్ లో పని ముగించుకుని వస్తున్న నాగలక్ష్మీని తీర్థం పోదామని స్కూటీ ఎక్కించుకున్నాడు. అది నమ్మిన భార్య భర్త మాటలు విని బైక్ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్ స్కూల్ వైపు వెళ్లడంతో అనుమానం వచ్చిన లక్ష్మీ స్కూటీపై నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. తిరిగి ఆమెను స్కూటీ ఎక్కించుకుని బలిఘట్టం రెవెన్యూ పరిధిలోని అర్థాన్న పాలెం దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే తనకు విడాకులు ఇవ్వాలని లక్ష్మీని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బలంగా రాళ్లపైకి తోశాడు. దీంతో రాళ్లకుప్పపై పడి లక్ష్మీ స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా పెద్ద బండరాయితో మోదీ లక్ష్మీని హత్య చేశాడు నాగరాజు. అక్కడే ఉన్న ఎండుపుల్లలు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు నాగరాజు. భార్యను హత్య చేసిన నాగరాజును ఉరితీయాలంటూ.. గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీస్ స్టేషన్ కు ర్యాలీ తీశారు.

Rajashekar wife: జీవితంలో అసలు రోమాన్స్ ఏ లేదు.. రాజశేఖర్ భార్య ఎమోషనల్ !

Rajashekar wife: బుల్లితెరపై ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర రియల్ జోడీలు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఆయన సతీమణి కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

Rajashekar wife: ఎంతో ఎదురుచూసేదాన్ని..అయన నుంచి ఎప్పుడు లేదంటూ.. రాజశేఖర్ భార్య ఎమోషనల్!

త్వరలోనే వాలెంటెన్స్ డే రావడంతో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం వాలెంటైన్స్ డే స్పెషల్‌ ఎపిసోడ్ షూట్ చేశారు. ఇందులో భాగంగానే భర్తలు వారి భార్యలను చూస్తూ ప్రేమ లేఖ రాయాలని ఓంకార్ చెప్పడంతో ప్రతి ఒక్కరూ వారి భార్యల పై ఉన్న ప్రేమను విభిన్న శైలిలో తెలియజేశారు.

Rajashekar wife: ఎంతో ఎదురుచూసేదాన్ని..అయన నుంచి ఎప్పుడు లేదంటూ.. రాజశేఖర్ భార్య ఎమోషనల్!

ఈ క్రమంలోనే అమ్మ రాజశేఖర్ భార్య ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన జీవితం మొత్తం ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడంతోనే గడిచిపోయిందని, తన జీవితంలో ఎప్పుడు లవ్వు గివ్వు అనే పదాలకు తావులేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆమె తెలుపుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.

ఆయన నుంచి ఎప్పుడు అలాంటివి అందుకోలేదు..

అందరిలాగే ప్రతి వాలెంటైన్స్ డే రోజు నేను కూడా ఎంతో ఎదురు చూసేదాన్ని ఆయన ఏదో ఒకటి ఇస్తారు.. చేస్తారు అని చూసేదాన్ని కానీ ఎప్పుడు లవ్ లెటర్స్, బెలూన్స్, గిఫ్ట్స్ అలాంటివేమీ తనకు ఆయన నుంచి ఎప్పుడూ రాలేదని ఈమె బోరున ఏడవడంతో అక్కడున్న అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Director Tharun Bhaskar: భార్యతో విడిగా ఉంటున్న పెళ్లి చూపులు డైరెక్టర్.. త్వరలోనే విడాకులు ప్రకటించనున్నారా?

Director Tharun Bhaskar: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య చిన్న విషయాలకు తీవ్రస్థాయిలో గొడవలు పడుతూ విడిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు విడాకులను తీసుకొని విడిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Director Tharun Bhaskar: భార్యతో విడిగా ఉంటున్న పెళ్లి చూపులు డైరెక్టర్.. త్వరలోనే విడాకులు ప్రకటించనున్నారా?

ఇప్పటికే టాలీవుడ్ జంటలు విడిపోగా తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ ఐశ్వర్య ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరొక డైరెక్టర్ కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

Director Tharun Bhaskar: భార్యతో విడిగా ఉంటున్న పెళ్లి చూపులు డైరెక్టర్.. త్వరలోనే విడాకులు ప్రకటించనున్నారా?

పెళ్లి చూపులు సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన భార్య లత గత కొద్దిరోజుల నుంచి విడివిడిగా ఉంటున్నట్లు టాలీవుడ్ సమాచారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భాస్కర్ కొన్ని మనస్పర్థల కారణంగా తన భార్యతో విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు పొందిన లత..

తరుణ్ భాస్కర్ డైరెక్టర్ కాకముందే లతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లతా ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈమెను తరుణ్ భాస్కర్ ఎన్నో ఇంటర్వ్యూలలో తన గురించి ప్రస్తావించారు.ఇలా ఎన్నో కార్యక్రమాలలో తన గురించి గొప్పగా చెబుతున్న తరుణ్ భాస్కర్ ఆమెతో కొన్ని మనస్పర్థల కారణంగా విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ డైరెక్టర్ దంపతులు విడాకుల గురించి తెలియచేయబోతున్నారని తెలుస్తోంది.

Balakrishna: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బాలయ్య దంపతులు..! వీడియో వైరల్..!

Balakrishna: ‘అఖండ’ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో బాల‌కృష్ణ జోరు మీద ఉన్నాడు. దీంతో పాటు ఆహా ఓటీటీలో సూపర్ సక్సెస్ అయింది. దీంతో బాలయ్యలో ఎనర్జీ మరింతగా పెరిగింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు బాలయ్య.

Balakrishna: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బాలయ్య దంపతులు..! వీడియో వైరల్..!

ఇదిలా ఉంటే ఇటీవల సంక్రాంతి సంబరాల్లో చాలా ఉత్సాహం కనిపించాడు బాలయ్య. ప్రతీ సంక్రాంతికి నారా వారి పల్లిలో ఘనంగా జరుపుకునే వారు బాల‌కృష్ణ. నారా- నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతిని జరుపుకునేవి. అయితే ఈసారి మాత్రం ప్లేస్ మార్చాడు.

Balakrishna: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బాలయ్య దంపతులు..! వీడియో వైరల్..!

తన సోదరి పురుంధేశ్వరి ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో జరుపుకున్నాడు. తన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞలతో సంక్రాంతి సంబంరాల్లో పాల్గొన్నాడు. నాచ్ ఘోడ గుర్రంపై ఎక్కి స్వారీ చేశాడు. తన కుమారుడు మోక్షజ్ఞ గుర్రంపై ఎక్కిన సందర్భంలో బాలయ్య కళ్లెం పట్టుకుని అదుపుచేశాడు. 

చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం..

ఇదిలా ఉంటే సముద్ర తీరంలో భార్య వసుంధరతో కలిసి జిప్సీ జీపులో సదరాగా గడిపారు బాల‌కృష్ణ. త‌న భార్య థంబ్ సింబ‌ల్ చూపించ‌కుండా చేతిని ఊపుతున్నందుకు ఆమెని థంబ్ సింబ‌ల్ చూపించ‌మ‌ని బాల‌కృష్ణ అంటాడు. వీరిద్ద‌రు క‌లిసి బీచ్ ఒడ్డున స‌రదాగా చ‌క్క‌ర్లు కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా బాలయ్య తన ఫ్యామిలీలో ఎంజాయ్ చేయడం.. చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం బాలయ్య అభిమానులకు అసలైన పండగను తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత బాల‌కృష్ణ వారసుడు మోక్షజ్ఞ కనిపించడంతో నందమూరి అభిమానులకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

Online Game: తాజాగా చెన్నైలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నెలకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు సంపాదించే ఒక బ్యాంకు ఉద్యోగి భార్య పిల్లలను చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మణికందన్ అనే వ్యక్తి పారూర్ లోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలో ఉండటంతో మణికందన్ కూడా మంచి జీతమే వస్తూ ఉండేది.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

అతను సంవత్సరానికి దాదాపు 28 లక్షల జీతం తీసుకునే వాడు. ఇక సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ లోని సెవెంత్ ఫ్లోర్ లో తన భార్య తారా, కొడుకు తరుణ్, మరొక కొడుకు దహన్ తో కలిసి నివసిస్తూ ఉండేవాడు.
ఈ మధ్యకాలంలో మణికందన్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ లో రమ్మీ ఆటకి బానిసగా మారాడు. ఈ క్రమంలోనే లక్షల జీవితం వస్తున్నా కూడా, ఆ ఆట కోసం లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్న డబ్బులు అంతా పోగొట్టుకున్నాడు. చివరికి అప్పుల పాలయ్యాడు.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

ఈ క్రమంలోనే ఒక రెండు నెలల క్రితం ఉద్యోగం కూడా కోల్పోయాడు. దీంతో ఇంట్లోనే ఉంటున్న మణికందన్ కు, అతని భార్య తారా కి మధ్య కి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు భార్యతో గొడవలు, మరొకవైపు అప్పులు తీసుకున్న వాళ్లు నుంచి వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మణికందన్, క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

అప్పుల బాధలు తట్టుకోలేక..

ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 31న ఎప్పటిలాగే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మణికందన్ కు అప్పు ఇచ్చిన అతని స్నేహితురాలు తరచూ ఫోన్ చేస్తుండటంతో.. ఏదో ఒక కారణం చెప్పాలి అని మణికందన్ తన భార్యతో ఫోన్ మాట్లాడించేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా మణికందన్ మొదట తన భార్యా పిల్లలను చంపి అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక జనవరి 1న వీరు ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా నట్టింట్లో తారా, ఆమె పిల్లలు విగతజీవులుగా కనిపించారు. మణికందన్ కిచెన్ లో ఉరి వేసుకొని కనిపించాడు. మణికందన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేశాడు అని పోలీసుల విచారణలో తేలింది. మొదట భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపి, తన పిల్లలను గొంతునులిమి హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Thaman: నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..! భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్..!

Thaman: థమన్ తెలుగు సంగీత ప్రపంచంలో పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తెలుగులో పాటు తమిళం, కన్నడలో కూడా తన మ్యాజిక్ చూపిస్తున్నారు థమన్. తాజాగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ’అఖండ‘ మూవీ మ్యూజిక్ పరంగా కూడా హిట్ అయింది.

Thaman: నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..! భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్..!

చిన్న తనం నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో.. తన ప్రతిభతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.
తాత ఘంటసాల బలరామయ్య గురించి కూడా చెప్పుకొచ్చారు. తాత బలరామయ్య ఏఎన్నార్ తో కలిసి చాలా సినిమాలు చేశారని థమన్ చెప్పుకొచ్చారు.

Thaman: నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..! భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్..!

నాన్నకు సంగీతంపై ఆసక్తి ఉండేదని దాదాపు 1,000 సినిమాలకు డ్రమ్స్ వాయించారని థమన్ అన్నారు. సంగీత కుటుంబంలో పుట్టడం వల్ల సహజంగానే థమన్ కు సంగీతంపై మక్కువ ఏర్పడింది. తన నాన్న చనిపోయి దాదాపుగా 27 ఏళ్లు అయిందని.. చెల్లి ఐటీ జాబ్ చేస్తుందని.. తాను కూడా సంగీతంపై మక్కువతో సింగర్ గా మారిందన్నారు. 

తను నాకోసం చాలా త్యాగం చేసిందంటున్న థమన్..

తాజాగా తన భార్య శ్రీవర్థిని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు థమన్. తను నాకోసం చాలా త్యాగం చేసిందని.. పనిలో పడి తనతో ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతున్నా అన్నాడు థమన్. తన భార్య కూడా సింగర్ అని.. నా డైరెక్షన్ లో 5 సాంగ్స్ పాడిందని థమన్ వెల్లడించారు. నా కొడుకు కూడా సింగర్ అని.. అయితే తనముందు పాడాలంటే సిగ్గని అన్నారు. సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటున్న థమన్.. వచ్చే ఏడాది భారీ చిత్రాలకు మ్యూజిక్ ను అందిస్తున్నారు.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

Tabita-Sukumar: తెరపై ఎమోషన్లు పలికిండమే తప్పితే నిజజీవితంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పెద్దగా ఎమోషల్ అయిన దాఖలాలు లేవు. తాజాగా పుష్ప సక్సెస్ మీట్ లో మాత్రం ఎమోషనలో అయ్యాడు సుకుమార్. ఐకాన్ స్టార్ బన్నీ.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా పుష్ప విజయవంతంగా దూసుకుపోతోంది.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

ఇప్పటికే రికార్డ్ స్ఠాయి కలెక్షన్లను రాబడుతోంది. ముక్యంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కూడా సినిమా సక్సెస్ అయింది. సినిమా విడుదలకు ముందే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ లో క్రేజీ బజ్ పెంచాయి.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

తాజాగా.. పుష్ప సక్సెస్ మీట్ లతో చిత్ర యూనిట్ పాల్గొంటుంది. ఇలా ఓ కార్యక్రమంలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. సుకుమార్ లేకపోతే.. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవ్వేవి లేవంటూ.. బన్నీ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. 


నీలాంటి భర్త దొరకడం నా భాగ్యం..

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సుకుమార్ తన భార్యకు థాంక్స్ చెబుతూ.. మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. నన్ను భరిస్తున్నందవుకు తబితకు థాంక్స్. ఈ విజయంలో నాభార్య భాగస్వామ్యం కూడా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. తన భార్యపై ఉన్న ప్రేమను ఇలా తెలియజేశారు. దీనికి ప్రతీకగా.. భర్త సుకుమార్ పై ఎమోషన్ పోస్ట్ పెట్టింది తబిత. నా పేరుతోనే థాంక్యూని స్టార్ట్ చేసిన నా భర్త, నా సామీ సుకుమార్‌‌కి ఒక మాటతో మొదలు పెడతా.. నా ప్రాణం నువ్వు, నా సర్వం నువ్వు.. నా జీవం నువ్వు.. నీలాంటి బంగారం లాంటి మనిషికి భార్యని అయ్యే భాగ్యం దొరికినందుకు ఆ దేవుడికి మొదట థ్యాంక్స్ చెప్పాలి. ప్రతీ భార్య చాలా కలలు కంటుంది..  నిజానికి నా కలలు కొన్ని కలలుగానే మిగిలిపోయినా.. నీ కలనే నా కలగా మార్చేసుకున్నా ఈ జీవితానికి అంటూ పోస్ట్ పెట్టింది.

బలవంతపు శృంగారం చేస్తున్న భర్త.. మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఎక్కడంటే..?

భార్యభర్తల మధ్య మనస్పర్థలు అనేవి సర్వసాధారణం. అయితే వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకొని.. సంసార జీవితాన్ని నడపాలి.. కానీ.. పది మందిలోకి ఈ వ్యవహారం వెళ్ల కూడదు. ఒక వేళ వెళ్లినా మరోసారి ఈ వ్యవహరం రిపీట్ కాకుండా ఉంటే కుటుంబంలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోవు.

కొందరు క్షణికావేశంలో ప్రాణాలు తీయడమో.. ప్రాణాలు తీసుకోవడమో జరుగుతోంది. ఇలాంటి ఘటనల వల్ల వాళ్లపై ఆధారపడిన కటుంబసభ్యులు అనాథలుగా మారుతున్నారు. ఇక్కడ చెప్పే దంపతుల విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్ లోని టికంగఢ్ జిల్లాకు చెందిన వీళ్లు.. రామ్ నగర్ లో నివాసం ఉంటుంన్నారు.

వారిద్దరికి వివాహం అయిన చాలా సంవత్సరాలు అయింది. మొదట్లో వీరిద్దరు బాగానే ఉన్నా.. రాను రాను మనస్పర్థలు ఎక్కువ అయ్యాయి. దీంతో వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి గొడవ పెద్ద పనుషుల దాకా వెళ్లింది. ఇద్దరు కలిసి ఉండాలని.. బలవంతపు కాపురం చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో భార్యతో అతడు బలవంతంగా కాపురం చేస్తున్న క్రమంలో భార్య కత్తి తీసుకొని అతడి మర్మాంగాన్ని కోసేసింది. అక్కడిక్కడే అతడు గిల గిల కొట్టుకుంటూ కిందపడిపోయాడు. ఆ ఘటనా స్థలం వద్ద తీవ్ర రక్తస్రావం అయింది. ఇరుగుపొరుగు వాళ్లు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

కవలపిల్లలకు జన్మనిచ్చిన లోబో భార్య.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..!

లోబోగా ప్రసిద్ధి చెందిన మహమ్మద్ ఖయ్యూమ్.. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న యాంకర్ గా.. నటుడిగా అందరికీ తెలిసిందే. లోబో తన అసాధారణ డ్రెస్సింగ్ , మేకప్‌కు ప్రసిద్ధి చెందాడు. అంతే కాకుండా అనేక టీవీ షోలలో కనిపించాడు. నాగార్జున హోస్ట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 5 తెలుగు 19 మంది కంటెస్టెంట్‌లలో అతను కూడా ఒకడు .

అతను ప్రేక్షకులను డీసెంట్‌గా అలరించాడు.. హౌజ్ లో ఉన్నన్నీ రోజుల ప్రేక్షకులనూ బాగానే నవ్వించినా.. రియాలిటీ షో నుండి ముందుగానే బయటకు వచ్చాడు. అతడు కొన్ని సందర్భాల్లో తన భార్యను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన భార్య గర్భవతి అని.. ఈ సమయంలో తాను ఆమె పక్కన ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక బయటకు వచ్చిన తర్వాత అతడు ఎక్కువగా బాధ పడలేదు. కానీ.. తన భార్య వద్దకు వెళ్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. లోబో భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.
లోబోకు మగబిడ్డ, ఆడపిల్ల జన్మించినట్లు.. అతడే ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను పంచుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. లోబో కొన్ని సినిమాల్లో నటించాడు. అతను నాని నటించిన పైసాలో కనిపించాడు.. ఈ సినిమాలో హీరో స్నేహితుల్లో ఒకరి పాత్రను పోషించాడు. లోబో హైదరాబాద్‌లో టాటూ పార్లర్‌ని నడిపిస్తున్నాడు. అంతే కాకుండా అతడు జీవనాధారంగా ఓ షాప్ ను కూడా నడిపిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లోబోకు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళా శంకర్ లో నటిస్తున్నాడు.