Tag Archives: youtube channel

Shiva Jyothi: అక్క అంటూనే శివ జ్యోతి భర్తను భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్… అసలేం జరిగిందంటే?

Shiva Jyothi: శివ జ్యోతి పరిచయం అవసరం లేని పేరు.న్యూస్ రీడర్ గా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఇలా బిగ్ బాస్ తర్వాత తన కంటూ ఎంతో మంచి గుర్తింపు లభించింది. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేయడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ఏదో ఒక వీడియోని షేర్ చేస్తే సందడి చేస్తుంటారు. అయితే బోనాల పండుగ సందర్భంగా తన భర్త తనకు బంగారం కొనిచ్చాడు అంటూ శివ జ్యోతి ఒక వీడియోని షేర్ చేశారు.అయితే ఈ వీడియో చూసినటువంటి పలువురు శివ జ్యోతి భర్త గంగూలి పై దారుణమైనటువంటి ట్రోల్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ వీడియో పై స్పందించినటువంటి నేటిజన్స్ అక్క బావ ఏం జాబ్ చేస్తారు అంటూ ప్రశ్నించారు.

ఈ కామెంట్ కు మరొక నేటిజన్స్ స్పందిస్తూ ఏం జాబ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు అంటూ తన పట్ల కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు ఇక్కడితో ఆగకుండా మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటూ కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే వీరి పెళ్లి సమయంలో గంగూలీ జాబ్ చేసేవారు.

Shiva Jyothi: పిల్లల గురించి ప్రశ్నించిన నెటిజన్స్…


ప్రస్తుతం శివ జ్యోతి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి భారీగా ఆదాయం పొందుతున్న దీంతో గంగోలి జాబ్ మానేసి ఈ యూట్యూబ్ వీడియోల వ్యవహారం మొత్తం చూసుకుంటూ ఉన్నారనీ తెలుస్తోంది. ఇక వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక శివజ్యోతి ఇలాంటి గుర్తింపు సంపాదించుకుంది అంటే అందుకు కారణం తన భర్తను అంటూ ఈమె పలు సందర్భాలలో తన భర్త గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Vithika Sheru: వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేర్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

Vithika Sheru: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు వరుణ్ తేజ్.ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటిస్తూ హీరోగా ప్రేక్షకులను సందడి చేశారు. అయితే వరుణ్ సందేశ్ ఒకానొక సమయంలో నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈయనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ఇక వితికా షేర్ అనే నటిని వివాహం చేసుకొని వరుణ్ సందేశ్ వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నామని తెలిపారు. ఇక వితికా పలు బుల్లితెర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేశారు.

వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం అనంతరం నటి వితికా షేర్ కు తీవ్రస్థాయిలో నెగెటివిటీ ఏర్పడింది. ఈ కార్యక్రమం తర్వాత తాను చాలా ఇబ్బంది పడ్డారంటూ వరుణ్ సందేష్ ఓ సందర్భంలో తెలియచేశారు.ఈ నెగటివ్ కామెంట్ల వల్ల వితిక చాలా బాధపడిందనీ అయినా ఒక రియాలిటీ షో చూసి ఒక మనిషిని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈయన ప్రశ్నించారు.

Vithika Sheru: లక్షల్లో ఆదాయం…


ఈ విధంగా వరుణ్ సందేశ్ తన భార్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. ఇక ఆమె బిగ్ బాస్ తర్వాత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారని తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తను బాగా సంపాదిస్తున్నారని లక్షల్లో ఆదాయం పొందుతున్నారు అంటూ తన భార్య సంపాదన గురించి వరుణ్ సందేశ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Avinash: గుండెపోటుకి గురైన అవినాష్ తల్లి… తల్లిని చూసి కన్నీరు మున్నీరవుతున్న అవినాష్!

Avinash: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ స్టార్ మాలో పలు కార్యక్రమాల పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా అవినాష్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈయన తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తల్లి మల్లమ్మకు అనారోగ్యం చేసిందని విషయాన్ని వెల్లడించారు.గత కొంతకాలంగా అమ్మ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అయినప్పటికీ తను సరైన ఆహారం తీసుకునేది కాదు కానీ ఉన్నఫలంగా తనకు ఆరోగ్యం బాగాలేక పోవడంతో తనని హైదరాబాద్ తీసుకువచ్చానని తెలిపారు.

ఇలా తనకు పరీక్షలు నిర్వహించగా డాక్టర్లు తనకు గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఉన్నాయని వెంటనే స్టంట్ వేసి సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో అమ్మకు వైద్యులు స్టంట్ వేసి సర్జరీ నిర్వహించారని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తల్లి పరిస్థితిని తెలియజేశారు. ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండే తన తల్లి ఇలా హాస్పిటల్ బెడ్ పై ఉండటం చూసినటువంటి అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నారు..

Avinash: స్టంట్ వేసిన వైద్యులు…

ఇలా అవినాష్ షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు తన తల్లి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అవినాష్ భార్య అనూజ గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అనూష ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 లో సందడి చేయబోతున్న బ్యాంకాక్ పిల్ల… ఇదే ప్రూఫ్?

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది.ఇప్పటివరకు ఆరో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుందంటూ మేకర్స్ లోగో ప్రోమో ద్వారా తెలియచేశారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల పేర్లు వినిపించగా తాజాగా తెరపైకి ప్రముఖ యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బ్యాంకాక్ పిల్ల పేరు కూడా తెరపైకి వచ్చింది. బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు శ్రావణి. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె బ్యాంకాక్ విశేషాలన్నింటిని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రావణి స్వస్థలం విజయవాడ. దీంతో ఈమె కూడా ఈ సీజన్లో పాల్గొనబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.. ఇందుకు అనుకూలంగానే శ్రావణి తన కుటుంబంతో కలిసి బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపారు.

Bigg Boss 7: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బ్యాంకాక్ పిల్ల..


బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే ఈమె ఇండియా వచ్చారని ఇదే ప్రూఫ్ అంటూ మరికొందరు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ఈ విధంగా బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jabardasth Avinash: గుడ్ న్యూస్ చెప్పిన ముక్కు అవినాష్… ముగ్గురు కాబోతున్నామంటూ?

Jabardasth Avinash: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమంలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అవినాష్ అనంతరం స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే గత ఏడాదిన్నర క్రితం అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వైవాహిక జీవితంలో అవినాష్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక అనూజ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేయడమే కాకుండా అవినాష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈమె అల్లరి అనూజ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ శుభవార్తను తెలియజేశారు.

Jabardasth Avinash: తండ్రి కాబోతున్న అవినాష్…


ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాము అంటూ అనూజ తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తన భార్యకు నాలుగవ నెల అని మూడు నెలల వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడమే మంచిదని భావించి చెప్పలేదని ప్రస్తుతం తన భార్యకు నాలుగవ నెల అంటూ అనూజ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలిపారు.అయితే నాలుగో నెలలో నా బిడ్డ గుండె చప్పుడు విన్నప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది అంటూ ఈ సందర్భంగా అవినాష్ తన భార్య ప్రెగ్నెన్సీ గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

https://www.youtube.com/watch?v=lu9y3wdNGk8

Jabardasth Apparao: బ్రతికుండగానే చంపేస్తున్నారు… అలా చేసే హక్కు మీకు లేదు… ఎమోషనల్ అయిన అప్పారావు!

Jabardasth Apparao: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పారావు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ గా తన డైలాగ్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.

ఇక ఈ మధ్యకాలంలో అప్పారావు వరుసగా పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సోషల్ మీడియా గురించి అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఎన్నో యూట్యూబ్ ఛానల్ పుట్టుకురావడమే కాకుండా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వెరైటీ థంబ్నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పారావు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్స్ వారు వారి ఛానల్ వ్యూస్ కోసం బ్రతికి ఉన్నటువంటి సెలబ్రిటీలను కూడా చంపేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు.

12

Jabardasth Apparao: మానసిక క్షోభకు గురి చేస్తున్నారు…


పిచ్చిపిచ్చి థంబ్నెయిల్ పెడుతూ సెలబ్రిటీలు బ్రతికుండగానే వారిని చంపేస్తున్నారని ఇలా ఒక వ్యక్తి బ్రతికుండగానే చనిపోయారు అంటూ చెప్పే హక్కు మీకు లేదని ఈయన తెలిపారు. ఇలాంటి వార్తలు రాయటం వల్ల సెలబ్రిటీలు చాలా మానసికక్షోభకు గురవుతున్నారని, నిజా నిజాలు తెలియకుండా వార్తలు రాయడం సరైన పని కాదంటూ ఈ సందర్భంగా అప్పారావు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rakesh Master : మా నాన్న చావకు వాళ్లే కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ కొడుకు!

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన మరణం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఈయన అనారోగ్య సమస్యల కారణంగానే మరణించారని తెలుస్తుంది.

ఇక రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాన్న మరణం విషయంలో అనుమానాలు ఉన్నాయి అంటూ సందేహాలను వ్యక్తం చేశారు అలాగే రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ కూడా తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ మాట్లాడుతూ మా నాన్న చనిపోవడానికి కారణం సోషల్ మీడియాని సమాధానం చెప్పారు.

ఎన్నో యూట్యూబ్ ఛానల్ తన తండ్రి చేత ఇంటర్వ్యూలు చేసి పెద్ద ఎత్తున లబ్ది పొందాయని తెలిపారు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్స్ వారే మా నాన్న మరణానికి కారణమయ్యారని తెలిపారు. ఇకపై మా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాల గురించి ఎవరు ఇన్వాల్వ్ కావద్దని ఈయన హెచ్చరించారు.

Rakesh Master: మద్యం తాపించి ఇంటర్వ్యూలు చేసేవారు..


రాకేష్ మాస్టర్ సినిమాలు లేని సమయంలో యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు అయితే ఈయన పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీల గురించి పచ్చి బూతులు మాట్లాడటంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్ వెంటపడుతూ రోజుకు దాదాపు పది ఇంటర్వ్యూల వరకు తీసుకునేవారు.అయితే కొందరు యూట్యూబ్ ఛానల్ వారు రాకేష్ మాస్టర్ కు మద్యం తాపించి మరి ఇంటర్వ్యూలు చేశారని ఇలా ఆయన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ మరణం వరకు తీసుకెళ్లారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Anchor Lasya: కట్టెల పొయ్యి పై నాటుకోడి పులుసు వండుతూ నోరూరిస్తున్న లాస్య… వీడియో వైరల్!

Anchor Lasya: యాంకర్ లాస్య పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఏనుగు చీమ కథ చెబుతూ ఎంతో ఫేమస్ అయినటువంటి లాస్య ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ వచ్చారు. ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఈమె మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇలా పెళ్లి తర్వాత లాస్య బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో మాత్రమే లాస్య సందడి చేస్తున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక బిగ్ బాస్ తర్వాత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే తరచూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేసే లాస్య తాజాగా మామిడి తోటలో ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ కోసం మామిడి తోటలో నాటుకోడి పులుసు వండారు.

Anchor Lasya:మామిడి తోటలో నాటుకోడి పులుసు…


కట్టెల పొయ్యపై పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈమె ఎంతో రుచికరమైనటువంటి నాటుకోడి పులుసును వండుతూ అందరికీ నోరూరించేశారు.తన భర్తకు నాటుకోడి పులుసు అంటే ఎంతో ఇష్టమని లాస్య ప్రత్యేకంగా తన భర్త కోసం ఇలా చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rakesh Master: ఆ చెట్టు కిందనే అంత్యక్రియలు …. ముందుగానే చెప్పిన రాకేష్ మాస్టర్!

Rakesh Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మరణ వార్త మర్చిపోకముందే మరొక సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో మరణించారు.

ఈయన వడదెబ్బ కారణంగా తీవ్రమైన విరోచనాలతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరారు. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈయన మరణించారు.ఈ విధంగా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తన శిష్యులు ఇతర కొరియోగ్రాఫర్లు రాకేష్ మాస్టర్ మరణానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

ఇకపోతే రాకేష్ మాస్టర్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలి అనే విషయాలను కూడా తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Rakesh Master: వేప చెట్టు కిందనే సమాధి..


తనకు చెట్లు అంటే చాలా ఇష్టమని రాకేష్ మాస్టర్ ఈ వీడియోలో తెలియచేశారు. అందుకే తాను చనిపోయిన తర్వాత తనని ఒక వేప చెట్టు కింద సమాధి చేయాలి అంటూ తెలిపారు. తన మామయ్య (భార్య తండ్రి)సమాధి పక్కన ఒక వేప చెట్టు నాటాను తనని కూడా ఆ వేప చెట్టు కిందనే సమాధి చేయాలి అంటూ అలాగే తన అంత్యక్రియలు తన స్నేహితులందరూ కూడా పాల్గొనాలని కొందరి పేర్లను ఈయన సూచించారు.తన అంత్యక్రియల గురించి ముందుగానే రాకేష్ మాస్టర్ చెబుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Lahari: పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న బుల్లితెర నటి లహరి.. వైరల్ అవుతున్న సీమంతం ఫోటోలు…?

Lahari: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం సినిమా సెలబ్రెటీలతో సమానంగా బుల్లితెర నటీనటులు కూడా బాగా పాపులర్ అవుతున్నారు. అలా ఎంతో మంది బుల్లితెర నటీనటులు సీరియల్స్ లో నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. అలా గుర్తింపు పొందిన బుల్లితెర నటులలో లహరి కూడా ఒకరు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లహరి చక్రవాకం,ముద్దుబిడ్డ మొగలిరేకులు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. అంతే కాకుండా ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కూడా నటించింది.
ఇలా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండే లహరి బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో కూడా సందడి చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల తాను తల్లి కాబోతున్న సంగతి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఇటీవల తన సీమంతానికి సంబంధించిన షాపింగ్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Lahari: పాల్గొన్న బుల్లితెర నటీమణులు…

ఈ క్రమంలో తాజాగా లహరి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో లహరి సీమంతం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సీమంతం వేడుకకు బుల్లితెర నటీనటులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం లహరి సీమంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు లహరికి పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారు.