Taraka Ratna: నందమూరి తారకరత్న నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు 21 సినిమాలలో నటించారు. అయితే ఈయన నటించిన ఈ సినిమాలలో రెండు మూడు యావరేజ్ హిట్ లు మాత్రమే అందుకున్నాయి. మిగిలిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈయనకు సినిమాలు పెద్దగా కలిసి రాలేదని అందరూ భావించారు.పెద్దపెద్ద బ్యానర్లలో టాప్ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించినప్పటికీ ఈయన సినిమాలో సక్సెస్ కాకపోవడంతో క్రమక్రమంగా తారకరత్న ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈ నందమూరి హీరో రాజకీయాలలో రావడానికి ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి తారకరత్న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలుపుతూ ఉన్నఫలంగా గుండెపోటుకు గురయ్యారు.
ఇలా గుండెపోటుకు గురైన ఈయనని తొలుత కుప్పంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈయన హాస్పిటల్లో చేరి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈయనకు మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్ లో విదేశాలకు తరలిస్తున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి.
ఇలా మెరుగైన వైద్యం కోసం ప్రముఖ హాస్పిటల్ కు తారకరత్నను తీసుకెళ్లడంతో ఈయన వైద్యం ఖర్చులకు కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈయనకు వైద్య చికిత్సల కోసం రోజుకు లక్షల్లో ఖర్చవుతుందట. ఇప్పటికే సుమారు 80 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. అయితే ఈ ఖర్చును మొత్తం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భరిస్తున్నట్లు తెలుస్తోంది.నందమూరి కుటుంబంలో కాస్త వెనుకబడ్డ వారిలో తారకరత్న ఉన్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈయన వైద్య ఖర్చులను వారే భరించడమే కాకుండా తన భార్య పిల్లలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…