అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒంటరిగా జీవిస్తున్న తనకు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో తన కూతురికి సీటు కావాలంటూ అడిగినప్పుడు, టీడీపీ నేత వన్నూరప్ప లైంగికంగా వేధించాడని బాధితురాలు మండిపడింది.
వీడియో ప్రకారం బాధితురాలు చేసిన ఆరోపణల ప్రకారం సీటు ఇప్పించాలంటే ముందుగా రూ.10 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన వన్నూరప్ప, డబ్బు లేకపోతే తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. అంతేకాకుండా, ఆమెను మళ్లీ స్కూల్లో ఉద్యోగం ఇస్తానని నెలకు రూ.6 వేలు జీతం ఉంటుందని చెప్పిన వన్నూరప్ప, తన ఇంటి బాధ్యత మొత్తం తానే తీసుకుంటానంటూ ఆకర్షించే మాటలతో ప్రభావితం చేయాలని ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.
తన స్వభిమానం దెబ్బతినడంతో బాధితురాలు గట్టిగా స్పందించింది. “సీటు ఇప్పిస్తే సరే… డబ్బులు కూడా ఇస్తా, కానీ నీలా గలీజుగా ప్రవర్తిస్తే చెప్పుతో కొడతా” అంటూ స్పష్టం చేసింది. మరోసారి ఫోన్ చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చర్యల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని నెటిజన్లు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…