అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒంటరిగా జీవిస్తున్న తనకు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో తన కూతురికి సీటు కావాలంటూ అడిగినప్పుడు, టీడీపీ నేత వన్నూరప్ప లైంగికంగా వేధించాడని బాధితురాలు మండిపడింది.
వీడియో ప్రకారం బాధితురాలు చేసిన ఆరోపణల ప్రకారం సీటు ఇప్పించాలంటే ముందుగా రూ.10 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన వన్నూరప్ప, డబ్బు లేకపోతే తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. అంతేకాకుండా, ఆమెను మళ్లీ స్కూల్లో ఉద్యోగం ఇస్తానని నెలకు రూ.6 వేలు జీతం ఉంటుందని చెప్పిన వన్నూరప్ప, తన ఇంటి బాధ్యత మొత్తం తానే తీసుకుంటానంటూ ఆకర్షించే మాటలతో ప్రభావితం చేయాలని ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.
తన స్వభిమానం దెబ్బతినడంతో బాధితురాలు గట్టిగా స్పందించింది. “సీటు ఇప్పిస్తే సరే… డబ్బులు కూడా ఇస్తా, కానీ నీలా గలీజుగా ప్రవర్తిస్తే చెప్పుతో కొడతా” అంటూ స్పష్టం చేసింది. మరోసారి ఫోన్ చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చర్యల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని నెటిజన్లు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…