Tejaswini Reddy : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్ లో ఎంఎస్ చేయడానికి రెండేళ్ల క్రితం వెళ్ళింది. అయితే తాజాగా ఆమె చదువు అయిపోయి తిరిగి ఇండియా రావాల్సి ఉండగా ఇంతలోనే ఒక కిరాతకుడు ఆమెను హత్య చేసాడు. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్మెంట్కే చెందిన బ్రెజిల్ కి చెందిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు. లండన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విషయం తెలిసి తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. త్వరలో తేజస్వినికి పెళ్లి చేయాలని అనుకుంటుండగా ఇలా జరిగిందని బాధపడ్డారు.
మరో అమ్మాయి మీద దాడి…
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్న తేజస్విని రెండు నెలల క్రితమే ఇండియా రావాల్సి ఉండగా ఆగష్టులో వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని బ్రాహ్మణపల్లివాసి. తేజస్వని అన్న కూడా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. తండ్రి ఎలక్ట్రీషియన్ కాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చదువుయ్యాక కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు. లండన్ లోని స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీల్డ్ క్రెసెంట్లో జరిగిన ఈ ఘటనలో తేజస్విని కత్తిపోట్లకు గురై అక్కడికిక్కడే మృతి చెందగా 28 సంవత్సరాల అఖిల అనే మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అఖిలకు ప్రాణాపాయం లేదని తెలిసింది. జరిగిన దారుణం గురించి తేజస్విని సమీప బంధువు విజయ కుటుంబ సభ్యులకు తెలియచేశారు. తేజస్విని తన స్నేహితులతో కలిసి ఉండే అపార్ట్మెంట్లోకి బ్రెజిల్కు చెందిన ఆగంతకుడు వారం రోజుల క్రితం కూడా వెళ్లాడని పోలీసులు నిర్థారించారు. హత్య చేసిన వ్యక్తి పేరు కెవెన్ ఆంటోనియో లౌరెన్సోడి మోరియస్ అని పేర్కొంటూ ఫోటో కూడా విడుదల చేశారు. ఇక తేజస్విని మృత దేహం ఇండియా రావడానికి త్వరిత చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…