కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2020 వచ్చి అందరికీ వనుకుపుట్టేలా చేసింది. ఒక పక్క కరోనా విలయ తాండవం.. మరో పక్క సినీ మరియు క్రీడా దిగ్గజాలు మరణించడం వంటి అనేక బాధాకర విషయాలు 2020లో చూసాం. ఈ నేపధ్యంలో తదుపరి వచ్చే ఏడాదైనా అంతా బాగుండాలని కోరుకుందాం. అయితే కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రధాననగరాలన్నీ న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతాయి. హోటల్స్, రెస్టారెంట్స్ , పబ్బులు ఇలా అన్ని సిద్దమవుతాయి. ప్రజలు ఆనందంలో మునిగి తేలుతూ కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
అయితే ఈసారి నూతన సంవత్సరం వేడుకల పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పబ్బులు, కబ్బులు, డ్యాన్స్ బార్లు కు ఎటువంటి పర్మిషన్ లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేసారు. అయితే స్టార్ హోటళ్లకు రోజువారీ కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఈ నేపధ్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు సీపీ సజ్జనార్. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…