కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2020 వచ్చి అందరికీ వనుకుపుట్టేలా చేసింది. ఒక పక్క కరోనా విలయ తాండవం.. మరో పక్క సినీ మరియు క్రీడా దిగ్గజాలు మరణించడం వంటి అనేక బాధాకర విషయాలు 2020లో చూసాం. ఈ నేపధ్యంలో తదుపరి వచ్చే ఏడాదైనా అంతా బాగుండాలని కోరుకుందాం. అయితే కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రధాననగరాలన్నీ న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతాయి. హోటల్స్, రెస్టారెంట్స్ , పబ్బులు ఇలా అన్ని సిద్దమవుతాయి. ప్రజలు ఆనందంలో మునిగి తేలుతూ కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతారు.

అయితే ఈసారి నూతన సంవత్సరం వేడుకల పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పబ్బులు, కబ్బులు, డ్యాన్స్ బార్లు కు ఎటువంటి పర్మిషన్ లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేసారు. అయితే స్టార్ హోటళ్లకు రోజువారీ కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఈ నేపధ్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు సీపీ సజ్జనార్. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.































