Temper Movie: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం టెంపర్. ఈ సినిమా కథకు ఎన్టీఆర్ నటన అన్ని ఎంతో అద్భుతంగా ఉండి ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ విధంగా ఎన్టీఆర్ పూరి కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ వక్కంతం వంశీ కథ సిద్ధం చేసిన తర్వాత మొదటిసారి టెంపర్ సినిమా కథను తనకు వినిపించారని ఈ సినిమాకి పవర్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించామని మెహర్ రమేష్ వెల్లడించారు.ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా అయితే అద్భుతంగా ఉంటుందని భావించాము. అయితే సినిమా కథను రవితేజకు వినిపించగా రవితేజకు కథ నచ్చకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నారు.
ఇకపోతే ఈ సినిమా వక్కంతం వంశీ ఎన్టీఆర్ కు వినిపించారు.ఈ స్క్రిప్ట్ విన్న ఎన్టీఆర్ పూరి టేకింగ్ అయితే అద్భుతంగా ఉంటుందన్న ఉద్దేశంతో పూరి జగన్నాథ్ ను దర్శకుడిగా తీసుకున్నారు.ఇక ఈ సినిమాకు టెంపర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని మెహర్ రమేష్ వెల్లడించారు.
ఈ విధంగా రవితేజ నేను ఇద్దరం కలిసి చేయాల్సిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ తీశారని, రవితేజ కనుక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే మా ఇద్దరి కాంబినేషన్లో మంచి హిట్ సినిమా పడేది అంటూ ఈ సందర్భంగా మెహర్ రమేష్ టెంపర్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…