Thammareddy Bhardwaja : అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. బాలయ్య లో కొత్తకోణాన్ని ఆవిష్కరించిన ఈషో బాలయ్య ఎనర్జీ తో వేరే లెవెల్ కి వెళ్లి పోయింది. ఇక ఈ షో సీజన్ 2 మీద ఎన్నో అంచనాలతో ఇటీవలే మొదలయింది. మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వారి అబ్బాయి నారా లోకేష్ ఇద్దరూ వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు బాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ నుండి సీఎం పదవిని తీసుకోవడం, అప్పుడు జరిగిన పరిణామాలను గురించి మాట్లాడారు. దీంతో ఇప్పుడు మళ్ళీ వాటి గురించి చర్చ మొదలయింది. ఇక ఈ విషయాల మీద సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడారు.

ఎవరి కోణంలో వాళ్ళు అప్పటి సంఘటన చెబుతున్నారు… ఎన్టీఆర్ చనిపోయిన రోజు జరిగింది అదే…
తమ్మరెడ్డి గారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి ఇప్పుడు ప్రస్తావన అవసరంలేదు. కాకపోతే ఇక్కడ లక్ష్మి పార్వతి వెన్నోపోటు అంటూ ఆమె కోణాన్ని చెబుతుంది. ఇటు చంద్రబాబు పార్టీ ని కాపాడుకోవడం అంటూ ఆయన కోణాన్ని ఆయన చెబుతున్నారు. వాస్తవం ఏమిటనేది ప్రజలకు అర్థమైన విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు ని తెలుగు దేశం అధినేతగా ఒప్పుకున్నారు, ఎన్నికల్లో గెలిపించారు. కానీ ఆయన పై వీళ్ళు వేసిన మచ్చ అలాగే ఉంది. ఎన్టీఆర్ గారు మరణించక ముందు ఇచ్చిన ధర్మపీఠం అనే ఇంటర్వ్యూలో చంద్రబాబు పార్టీని లాక్కున్నాడు అన్నట్లు గా మాట్లాడారు.

ఇక ఆయన మానసికంగా క్రుంగి పోయి మరణించారు అది వాస్తవం. ఇక ఆయన మరణించిన రోజు నేను వెళ్ళే సరికి కుటుంబం అంతా అక్కడ ఉంది. లక్ష్మి పార్వతి స్వామీ అంటూ ఏడుస్తోంది. నేను వెళ్ళాక అర్థగంట కు చంద్రబాబు అక్కడికి వచ్చారు. లక్ష్మి పార్వతి ఏం మాట్లాడలేదు కానీ ఒక వ్యక్తి మాత్రం చంద్రబాబు ను ఎన్టీఆర్ శవం వద్దకు రానివ్వలేదు. నువ్వే ఆయన చావుకు కారణం, ఆయనను మానసిక క్షోభకు గురి చేసావ్ అంటూ మాటాడాడు. అయితే ఆదే వ్యక్తి మళ్ళీ రెడో సారి చంద్రబాబు సీఎం అయినపుడు నామినేట్ పదవిలో ఉన్నాడు అంటూ తమ్మారెడ్డి అప్పటి విషయాలను చెప్పారు.


































