తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఓ బాలుడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట పట్టణంలోని స్థానిక సంగీతరావు పేటలో నివాసముంటున్న బాలుడుని ఈసు వరప్రసాద్ (12) తల్లిదండ్రులు మందలించారు. దీనితో కోపంతో ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.

విషయం తెలుసుకున్న తల్లిందండ్రులు శనివారం రాత్రి (22-05-21) రాత్రి సామర్లకోట పోలీస్టేషన్లో పిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్ఐ VLVK సుమంత్ తెలిపారు. ఈ బాలుడి ఆచూకి తెలిసిన వారు క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు.
సామర్లకోట పోలీస్టేషన్ – 9440796568, 0884 2327333































