ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపురానే వచ్చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్షణ, కస్తూరిభాగాంధీ విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రాతి పదికన పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సంస్థల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతాలు పెంచుతన్నట్లు పేర్కొన్నారు. ఆ ఉద్యోగులకు జీతాలు మొదట 20 శాతం వేతనాలు పెంచాలనే ఆలోచన ఉండగా.. మరికొన్ని ఎలిమెంట్స్ ను దృష్టిలో ఉంచుకొని..30 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. అంతే కాకుండా మరో బొనాంజాను ప్రకటించారు.
ఈ పెంచిన జీతాలను ఈ నెల నుంచి కాకుడా 2021 జూన్ మాసం నుంచి అమలు చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. అంటే ఆరు నెలల జీతం అదనంగా రానుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. సమర్థవంతంగా పని చేస్తున్నారాని కితాబిచ్చారు. ఇక ముందు కూడా ఇలాంటి పనితనమే చూపించాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక వర్క్ విషయంలో గానీ.. పని చేసే ప్రదేశంలోగానీ ఎమైనా సమస్యలు ఉంటే.. వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ.. కృతజ్ఞతలు తెలియజేశారు. మరి కొంతమంది అయితే స్వీట్స్ పంచి పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…