పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కు కూడా కారకం అవుతుందని మనం వింటూ ఉంటాం. అయితే సిగరేట్ కాల్చడం కంటే మరో కొన్ని అలవాట్లు ఇంకా డేంజర్ గా ఉంటాయి. అయితే ప్రస్తుత జీవనంలో కొన్ని అలవాట్లు, పద్దతులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వాటిని చాలామంది పట్టించుకోరు. సిగరెట్ కాల్చడం కంటే మరీ డేంజర్ గా కొన్ని ఆహార నియమాలు ఉంటాయి. అవేంటంటే..
తగినంత నిద్రలేనప్పుడు మరుసటి రోజు అనారోగ్యంగా ఉంటారు. నిద్రను నిర్లక్ష్యం చేయడం కూడా దుష్ప్రభావాలలో ఒకటి. జంతు ప్రోటీన్ వంటివి అధికంగా తీసుకుంటే.. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ధూమపానంతో సమానం. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం కూడా ధూమపానం కంటే ఎక్కువ డేంజర్. దీనికి పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలం డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదమే.
ఏకాంతంగా ఉండటం కూడా జబ్బున పడే అవకాశం ఉంటుంది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా చాలా మంది భౌతిక దూరం పాటిస్తున్నారు. దీంతో కొంతమంది ఒంటరిగా ఉండాల్సివచ్చింది. ఇలా ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే.
షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మంచి వాతావరణంలో ఉండాలి.. మీ మాట వినే కొంతమంది స్నేహితులను సంపాదించుకోవాలి. లేదంటే మరికొన్ని కొత్త రోగాలబారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్ని కొన్నిఅధ్యయనాల ప్రకారం మాత్రమే.. అందిస్తున్నాం. తదుపరి ఏమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవడం ఎంతో ఉత్తమం.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…