వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం, అలసట, జీర్ణ సమస్యలు వంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. అలాంటి సహజ పదార్థాల్లో గోంద్ కతీరా (బాదం జిగురు) ఒకటి. ఇటీవలి కాలంలో ఇది ఆరోగ్యంపై చూపే ప్రయోజనాల కారణంగా మరింత ప్రాచుర్యం పొందుతోంది.
గోంద్ కతీరా అనేది ఒక సహజ గమ్ పదార్థం. ఇది కొన్ని ప్రత్యేకమైన మొక్కల వేర్ల నుంచి సేకరించబడుతుంది. సాధారణంగా ఇది పొడి రూపంలో కనిపించినా, నీటిలో నానబెట్టిన తర్వాత జెల్లా మారుతుంది. దీనికి ప్రత్యేకమైన రుచి లేదా వాసన ఉండదు. అందుకే ఇది పాలు, మజ్జిగ, లస్సీ లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవడానికి అనువుగా ఉంటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, గోంద్ కతీరాలో ఉండే పాలీశాకరైడ్లు పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరిగి, కడుపు సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో గోంద్ కతీరా కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో సహజంగా ఉన్న శీతలీకరణ గుణాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఎండల్లో బయటకు వెళ్లే వారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో, పురుషుల శక్తిని పెంచడంలో కూడా ఇది సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు.
ఇక కడుపు సమస్యల విషయానికి వస్తే, గోంద్ కతీరా ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారికి ఇది సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో మంట తగ్గించి, జీర్ణాశయాన్ని రక్షించే గుణం కూడా దీనికి ఉంది.
చర్మ ఆరోగ్యానికి కూడా గోంద్ కతీరా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా ఉంచి, ముడతలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో చర్మంపై వచ్చే ఇబ్బందులను తగ్గించి కాంతివంతంగా ఉంచడంలో ఇది ఉపకరిస్తుంది.
ఇదిని ఉపయోగించే విధానం కూడా చాలా సులభం. రాత్రి సమయంలో 1-2 టీస్పూన్ల గోంద్ కతీరాను నీటిలో నానబెట్టాలి. ఉదయానికి అది జెల్లా తయారవుతుంది. ఈ జెల్ను పాలు, మజ్జిగ, లస్సీ లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. అయితే దీనిని తీసుకునేటప్పుడు తగినంత నీరు త్రాగడం తప్పనిసరి. ఎందుకంటే ఇందులోని ఫైబర్ శరీరంలోని నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది.
మొత్తానికి, కృత్రిమ కూల్ డ్రింక్స్ కంటే సహజ పదార్థాలను ఎంపిక చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. గోంద్ కతీరా వంటి పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.
గమనిక: పై వివరాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…