కీర్తి సురేష్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘ప్రేమమ్’ సినిమాతో సిని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది ఆ తరువాత అ..ఆ తో తెలుగు సినిమాలలోకి తెరంగ్రేటం చేసింది. తన మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను అందుకుంది. ఇక మహానటి సినిమాతో ఒక్క తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా తమిళం, హిందీలో బాషలలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ, నేను లోకల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది కీర్తి సురేష్.
అలనాటి నటి సావిత్రి బయోపిక్గా తెరకెక్కిన ‘మహానటి’తో జాతీయ స్థాయి ఉత్తమ నటి పురస్కారం అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ పారితోషికం వచ్చింది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ తో కలిసి నటించిన దసరా సినిమాకి కీర్తి సురేష్ మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల దసరా సినిమా మోషన్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో నాని కఠినమైన లుక్ లో కనిపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాన్ని చేసుకుంటుండగా సత్యన్ సూర్యన్ isc సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…