మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈయన రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. ఎంతోమందికి అండగా నిలిచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా అలాంటి విపత్కర సమయాల్లో ఎంతోమందిని ఆదుకొని వారికి ఆక్సిజన్ సిలిండర్ లను సప్లై చేసిన గొప్ప వ్యక్తి చిరంజీవి. చిరు కేవలం ఒక నటుడిగానే కాకుండా మానవత వాదిగా గొప్ప పేరును కూడా సంపాదించుకున్నారు.
ఇప్పటికే ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎంతో మందికి సేవలను అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసున్న చాటుకున్న చిరంజీవి మరొకసారి ఒక వ్యక్తికి సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమానికి అండగా నిలిచారు. ఆ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తి వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
విశాఖ జిల్లాకు చెందిన వెంకట్ అనే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి మెగాస్టార్ కు వీరాభిమాని. చిరంజీవి పేరున పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా అభిమానులు చాటుకుంటూ ఉంటారు. అయితే అతను గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మెగాస్టార్ వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకురావాలని తెలిపారు.
అంతేకాకుండా అతడి వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులు అన్నీ కూడా తానే భరిస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చాడు. దీనితో వెంకట్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చిరంజీవి తన అభిమానులు కష్టాల్లో ఉన్న సందర్భాల్లో ఆదుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…