Featured

యజ్ఞం సినిమాకు ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?

పోకూరి బాబూరావు నిర్మాతగా ఈతరం ఫిలింస్ బ్యానర్ పై రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం “యజ్ఞం” ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ మాస్ లుక్ ఇతనికి మంచి పేరు తెచ్చిదని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అంది పుచ్చుకున్నారు హీరో గోపీచంద్.

టి.కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోపీచంద్ మొట్టమొదటిసారిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన “తొలివలపు” చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తరువాత జయం, వర్షం సినిమాలలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పోకూరి బాబురావు నిర్మాణంలో ఏ ఎస్ రవికుమార్ చౌదరి కాంబినేషన్లో యజ్ఞం సినిమా కథ సిద్ధమవుతోంది.

ఈ కథనం మొత్తం రాసిన తర్వాత ముందుగా ఈ సినిమాను హీరో ప్రభాస్ తో తీయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ కథతో నిర్మాత పోకూరి బాబు రావు ప్రభాస్ తండ్రినీ కలిసి ఆయనకు యజ్ఞం సినిమా కథను వినిపించారు. ఈ సినిమా కథ అతనికి నచ్చడంతో వెంటనే ప్రభాస్ హీరోగా ఈ సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దర్శకుడిగా రవికుమార్ చౌదరిని కాకుండా బి.గోపాల్ తో ఈ సినిమా చేద్దామని భావించారు. అలా దర్శకుడిని మార్చాలనడంతో ఈ సినిమా ప్రభాస్ నుంచి గోపీచంద్ కు వెళ్ళింది.

కథపై, దర్శకుడి పై నమ్మకం ఉండటంతో హీరో గోపీచంద్ ని తీసుకొని ఈ సినిమా నిర్మింద్దామని పోకూరి బాబూరావు చెప్పారు. అలా ఈ సినిమా ప్రభాస్ ని కాదని గోపీచంద్ ను వవరించింది. ఈ క్రమంలోనే ఈ తరం ఫిలిం బ్యానర్ పై పోకూరి బాబూరావు నిర్మాతగా రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని గోపీచంద్ కు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

9 minutes ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

39 minutes ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

21 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago