ఎన్నో మాయమాటలు చెప్పి ఎంతోమంది బడా వ్యాపార వేత్తలను,ప్రముఖ సినీ హీరోలను, హీరోల భార్యలను మాయలో పడేసి వారి నుంచి కోట్లకు డబ్బులు తీసుకొని మోసం చేసిన శిల్పా చౌదరి బాధితులు ఎంతో మంది ఉన్నారు. రోజురోజుకు ఈమె బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.
గత రెండు రోజుల క్రితం మహేష్ బాబు సోదరి సుధీర్ బాబు భార్య ఈమె మాయలో పడి డబ్బు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరో యంగ్ హీరో శిల్పా చౌదరి మాయలోపడి ఏకంగా మూడు కోట్ల రూపాయల పోగొట్టుకున్నట్లు బయటపడింది.
సెహరి సినిమాలో హీరోగా నటించిన హర్ష్ కనుమల్లి కూడా శిల్పా చౌదరి మాయలోపడి ఏకంగా మూడు కోట్ల పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. ఇలా ఎంతో మంది బడా వ్యాపారవేత్తలను సినీ హీరోలను మాయమాటలతో మోసం చేస్తూ కోట్లలో డబ్బు తీసుకుని వారిని మోసం చేసిన శిల్పా చౌదరిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈమెను, తన భర్తను నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఇలా వీరు అరెస్టు కావడంతో వెంటనే ఆమె భర్తకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా శిల్ప చౌదరి మాత్రం రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలోనే ఉంచాలని కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే శుక్ర, శని వారాలలో పోలీసులు ఈ విషయంపై తనను విచారించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా ఏలాంటి విషయాలు బయట పడతాయో తెలియనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…