Political News

TTD Goshalas: టీటీడీ గోశాలలో 100 ఆవులు మరణం.. అసలేం జరుగుతోంది?

TTD Goshalas: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల వరుసగా అపచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీటీడీ గోశాలలో ఏకంగా వంద గోవులు మరణించాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయాన్ని కొన్ని పార్టీలు అదునుగా చేసుకొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణినే ఇందుకు కారణం అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ విధంగా టీటీడీ గోశాల గురించి వస్తున్నటువంటి వార్తలను కూటమి కొట్టి పారేసినప్పటికీ ఈ విషయంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 100 ఆవులు మరణించాయని వైసిపి నేత, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చనిపోయిన ఆవుల ఫోటోలను చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

గోశాలను అసమర్థుల అధికారుల చేతులలో పెట్టారని, గోవులకు సరైన ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని దీనంతటికీ టీటీడీ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. ఈ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపై టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ భూమన కరుణాకర్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ.. భూమన చేస్తున్నటువంటి వ్యాఖ్యలలో నిజం లేదని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఫోటోలు టీటీడీ గోశాలకు చెందినవి కాదని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు అయితే ఈ ఘటనపై విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతుందని తెలిపారు. భూమన కరుణాకర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కారణం లేకపోలేదని గత కొద్ది రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటలో ఆ అధికారి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కాపాడటం కోసమే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ వైసిపి నేతలపై విమర్శలు కురిపించారు.

ఇలా తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలకు సంబంధించిన ఆవుల గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ కేవలం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసి వదిలేయడంతో ఇది కాస్త రాజకీయ రంగుపులుముకొని పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago