Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ప్రస్తుతం 6 నెలల గర్భంతో ఉందని మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ శుభవార్త కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుంది ఇలా పదేళ్లుగా వీరిద్దరూ పిల్లలను ప్లాన్ చేయకపోవడంతో తరచూ ఉపాసనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురవుతూ వచ్చాయి. అయితే ఆమె సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతా అంటూ ఈ ప్రశ్నను దాట వేసేవారు.అయితే గత ఏడాది చివరిలో మెగాస్టార్ చిరంజీవి ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇలా రాంచరణ్ ఉపాసన పేరెంట్స్ కాబోతున్నారు అంటూ చిరంజీవి తెలియచేయడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన ఇన్ని రోజుల పాటు పిల్లల గురించి ప్లాన్ చేయకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. త్వరలోనే అమ్మను కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉపాసన తెలిపారు.ఈ సమాజం కోరుకున్నట్లు కాకుండా తమకు వచ్చినప్పుడు పిల్లలను ప్లాన్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Upasana: పూర్తి ఆర్థిక భద్రత ఉంది…
10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపించింది. పిల్లలను ప్లాన్ చేయడానికి ఇదే బెస్ట్ టైం… ఎందుకంటే ఇప్పుడు మాకు పూర్తి ఆర్థిక భద్రత ఉందని తెలిపారు.ఇప్పుడు మా పిల్లలను మేము ఎంతో అద్భుతంగా చూసుకోవచ్చు. మా ఇద్దరి మధ్య జరిగిన పరస్పర అంగీకారం ఇక పిల్లలు కావాలి అంటూ మాపై కుటుంబ సభ్యులు ఒత్తిడి కూడా ఏమాత్రం తీసుకు రాలేదని ఈ సందర్భంగా ఉపాసన ఆర్థిక భద్రత వచ్చిన తర్వాతే పిల్లలను ప్లాన్ చేయాలని భావించినట్లు ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























