Vande Bharath Express : ప్రధాని మోడీ ఏప్రిల్ 8వ తేదీన వందే భారత్ ట్రైన్ ను సికింద్రాబాద్ లో ప్రారంభించారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లాలంటే కేవలం ఎనిమిదిన్నర గంటల సమయంలోనే చేరుకోవచ్చు. ఇది ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చే విషయం. మొదట్లో ఆరున్నర గంటలలో చేరుకుంటుందని ప్రచారం జరిగినా అది నిజం కాదు గంటకు 77.73 కిలోమీటర్ల సగటు వేగంతో ఈ సికింద్రాబాద్ టూ తిరుపతి వందే భారత్ ఎకస్ప్రెస్స్ ప్రయాణిస్తుంది. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలని భావించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ రైలు టికెట్ ధరలు మాత్రం మధ్య తరగతి కుటుంబాలకు దడ పుట్టిస్తున్నాయి.
టికెట్ ధర తగ్గించుకునే మార్గం…
వందే భారత్ లో ప్రయాణం బాగుంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే త్వరగా గమ్యస్థానం చేరుకుంటాము అందులోనూ సందేహం లేదు. కానీ టికెట్ ధర మాత్రం బాగా ఎక్కువ. ఒక్కొక్కరికి సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లాలంటే టికెట్ ధర 1680 రూపాయలు అదే మామూలు రైలులో అదే ప్రయాణానికి 450 దాకా టికెట్ ధర ఉంటుంది. అంటే దాదాపు నాలుగు రెట్లు వందే భారత్ టికెట్ ధర ఉంటోంది. దీంతో నలుగురు కుటుంబం సభ్యులు ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే సుమారుగా పదిహేను వేలు టికెట్స్ కే అయిపోతాయి.
మరి టికెట్ ధర తగ్గించుకోవడం ఎలా అంటే నో ఫుడ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే టికెట్ ధరలో 25% తగ్గుతుంది. అంటే టికెట్ ధర 1680 కాకుండా ఒక 380 రూపాయలు నో ఫుడ్ ఆప్షన్స్ పెడితే తగ్గించుకోవచ్చు. అప్పుడు సికింద్రాబాద్ నుండి తిరుపతికి 1340 రూపాయల టికెట్ ధరతో చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి నల్గొండకు నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకుంటే టికెట్ ధర 455 అవుతుంది అలాగే గుంటూరు నుండి నల్గొండకు నో ఫుడ్ ఆప్షన్స్ ఇచ్చి వెళితే 490 పడుతుంది. ఇలా కొంత టికెట్ ఛార్జి తగ్గించుకుని త్వరగా గమ్యస్థానం అదికూడా ఫ్లైట్ లో సీటింగ్ వసతులతో వెళ్లాలంటే మాత్రం వందే భారత్ మంచి ఆప్షన్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…