Featured

Vande Bharath Express : మధ్యతరగతి వాడికి దూరంగా వందే భారత్ రైలు టికెట్ ధర… సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే రైలు ధర ఎంతో తెలుసా… తగ్గించుకునే మార్గం ఉందా…!

Vande Bharath Express : ప్రధాని మోడీ ఏప్రిల్ 8వ తేదీన వందే భారత్ ట్రైన్ ను సికింద్రాబాద్ లో ప్రారంభించారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లాలంటే కేవలం ఎనిమిదిన్నర గంటల సమయంలోనే చేరుకోవచ్చు. ఇది ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చే విషయం. మొదట్లో ఆరున్నర గంటలలో చేరుకుంటుందని ప్రచారం జరిగినా అది నిజం కాదు గంటకు 77.73 కిలోమీటర్ల సగటు వేగంతో ఈ సికింద్రాబాద్ టూ తిరుపతి వందే భారత్ ఎకస్ప్రెస్స్ ప్రయాణిస్తుంది. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలని భావించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ రైలు టికెట్ ధరలు మాత్రం మధ్య తరగతి కుటుంబాలకు దడ పుట్టిస్తున్నాయి.

టికెట్ ధర తగ్గించుకునే మార్గం…

వందే భారత్ లో ప్రయాణం బాగుంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే త్వరగా గమ్యస్థానం చేరుకుంటాము అందులోనూ సందేహం లేదు. కానీ టికెట్ ధర మాత్రం బాగా ఎక్కువ. ఒక్కొక్కరికి సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లాలంటే టికెట్ ధర 1680 రూపాయలు అదే మామూలు రైలులో అదే ప్రయాణానికి 450 దాకా టికెట్ ధర ఉంటుంది. అంటే దాదాపు నాలుగు రెట్లు వందే భారత్ టికెట్ ధర ఉంటోంది. దీంతో నలుగురు కుటుంబం సభ్యులు ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే సుమారుగా పదిహేను వేలు టికెట్స్ కే అయిపోతాయి.

మరి టికెట్ ధర తగ్గించుకోవడం ఎలా అంటే నో ఫుడ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే టికెట్ ధరలో 25% తగ్గుతుంది. అంటే టికెట్ ధర 1680 కాకుండా ఒక 380 రూపాయలు నో ఫుడ్ ఆప్షన్స్ పెడితే తగ్గించుకోవచ్చు. అప్పుడు సికింద్రాబాద్ నుండి తిరుపతికి 1340 రూపాయల టికెట్ ధరతో చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి నల్గొండకు నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకుంటే టికెట్ ధర 455 అవుతుంది అలాగే గుంటూరు నుండి నల్గొండకు నో ఫుడ్ ఆప్షన్స్ ఇచ్చి వెళితే 490 పడుతుంది. ఇలా కొంత టికెట్ ఛార్జి తగ్గించుకుని త్వరగా గమ్యస్థానం అదికూడా ఫ్లైట్ లో సీటింగ్ వసతులతో వెళ్లాలంటే మాత్రం వందే భారత్ మంచి ఆప్షన్.

Bhargavi

Recent Posts

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

34 seconds ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

18 minutes ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

48 minutes ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

1 hour ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

1 hour ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

2 hours ago