Vande Bharath Express : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో గిఫ్ట్ ఇచ్చింది. దేశంలో ఫాస్ట్ ట్రైన్ అయిన వందే భారత్ ను ప్రారంభించింది. సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు వెళ్లే ఈ ట్రైన్ ను ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సంవత్సరం జనవరి 16 న ప్రారంభించారు. ఇక ఇపుడు మరో ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. అదే సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ విశేషాలు, టికెట్ ధరల గురించి తెలుసుకుందాం.

తగ్గిన ప్రయాణం సమయం… సామాన్యులకు ఊరట…
ప్రధాని మోడీ ఏప్రిల్ 8వ తేదీన వందే భారత్ ట్రైన్ ను సికింద్రాబాద్ లో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లాలంటే కేవలం 8 ఎనిమిదిన్నర గంటల సమయంలోనే చేరుకోవచ్చు. ఇది ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చే విషయం. మొదట్లో ఆరున్నర గంటలలో చేరుకుంటుందని ప్రచారం జరిగినా అది నిజం కాదు గంటకు 77.73 కిలోమీటర్ల సగటు వేగంతో ఈ సికింద్రాబాద్ టూ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించనుంది. ఏప్రిల్ 8న మాత్రం సికింద్రాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు రైలు ప్రారంభమవుతుంది.

తొలి రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లో ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు నల్గొండకి ఉదయం 07:20, గుంటూరుకి 09.50, ఒంగోలుకి 11.10, నెల్లూరుకి 12.30కి చేరుకుంటుంది. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు, నెల్లూరుకి సాయంత్రం 05:20కి, ఒంగోలుకి 06:30కి, గుంటూరుకి రాత్రి 07:45, నల్గొండకి రాత్రి 10:10కి చేరుకుంటుంది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్లో మొత్తం 8 కోచ్లు ఉంటాయి. ఇందులో నాలుగు చైర్ కార్, మరో నాలుగు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు.































