Veerabhadhram Chowdary : ‘అహనా పెళ్లంట’ సినిమాతో డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీరభద్రం చౌదరి ఆ తరువాత తీసిన ‘పూలరంగడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీ లో సెటిల్ అయినట్లే అని అనుకున్న తరుణంలో నాగార్జున సినిమా ‘భాయ్’ తో మళ్ళీ కెరీర్ ప్రశ్నార్తకంగా మారిపోయింది. ఇక ఉదయ్ కిరణ్ సినిమా ఎలా వదులుకోవాల్సి వచ్చిందో తన సినిమా కెరీర్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

భాయ్ సినిమాతో కెరీర్ పోయింది…
రెండు సూపర్ హిట్లు వరుసగా ఇచ్చిన వీరభద్రం గారు ఈవివి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఇక ఆయనతో కొన్ని రోజులు పని చేసాక డైరెక్టర్ తేజ తో వర్క్ చేసారు. ఇక ఆనంది ఆర్ట్స్ బ్యానర్ లో ఉదయ్ కిరణ్ తో సినిమా అవకాశం వచ్చింది. సినిమా రెండు రోజుల్లో మొదలువ్వాల్సింది, సినిమా క్యాన్సిల్ అయింది. మొదటి సినిమా ఇలా అయ్యిందే అనుకుని చాలా బాధపడ్డాను. ఉదయ్ కిరణ్ మరో మంచి ఆఫర్ రావడం వాళ్ళ నా సినిమా వదులుకున్నాడు. ఇక మళ్ళీ అహనా పెళ్ళంట సినిమా తీసి హిట్ కొట్టాను. ఆ సినిమా తరువాత పూలరంగడు సినిమా కూడా మంచి హిట్ అయింది.

ఇక నాగార్జున గారితో భాయ్ సినిమా కథ అనుకుని ఓకే అయ్యాక కథలో చాలా మార్పులు చేసారు. సినిమా ప్లాప్ అయింది. వీరి వల్ల తప్పు జరిగిందని ఎవరినీ నిందించలేను కానీ నా కెరీర్ పోయింది అంటూ వీరాభద్రం చెప్పారు. భాయ్ సినిమాను మొదట హాస్యభరితంగానే తీయాలని అనుకున్నాను అయితే కథలో మార్పులు ఎక్కువ అవడం వల్ల కథ రూపు రేఖలు మారిపోయాయి. సినిమా సీరియస్ అయిపోయింది. కామెడీ ఉంటుందని భావించి వచ్చిన ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చలేదు అంతే అంటూ చెప్పారు. ఇక రాజశేఖర్ గారి ఒక నాలుగు సినిమాలకు పని చేయడం వల్ల ఆయనతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.































