Vijaya Saireddy : ఆర్ఆర్ఆర్, ఆస్కార్ ఈ రెండు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాను ఊపేస్తున్న పదాలు. దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ కు ఇంటర్నేషనల్ లెవల్ లో ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో నిలవబోతోంది అంటూ వస్తున్న ఊహగాణాల నడుమ అందరూ ఈ విషయం గురించి చర్చ మొదలు పెట్టారు. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు లేదా డైరెక్టర్ కు సాంగ్ కో లేకపోతే ఉత్తమ చిత్రంగానో సినిమాకు అవార్డు రావచ్చు అంటూ లెక్కలేస్తున్నారు. ఇక ఈ ఆస్కార్ గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించాడు.

గిరిపుత్రుల బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి అవార్డు మనకు గర్వకారణం…
నిజానికి త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఏడు నెలలు దాటినా ఇంకా సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. మొన్నామధ్య ఎన్టీఆర్ ఆసియా నుండి ఆస్కార్ బరిలో ఉండే అవకాశం ఉంది అంటూ హాలీవుడ్ మ్యాగ్ జైన్ వెరైటీ ప్రకటించడం, ఇక ఇప్పుడు అందులోకి రామ్ చరణ్ పేరు కూడా రావడం తో ఎవరు ఆస్కార్ బరిలో ఉండబోతున్నారు అన్నది ఆసక్తిని పెంచుతోంది. ఎవరు ఆస్కార్ లో నిలిచినా మన తెలుగు సినిమా గౌరవం రెట్టింపు అయినట్లే అని అందరూ భావిస్తున్న తరుణంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సినిమా గురించి మాట్లాడారు.

RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంది. ఆస్కార్ బరిలో Jr.NTR, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా. pic.twitter.com/K4DFonbQQS
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 18, 2022
ఎంపీ విజయసాయి ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో ఉండబోతోంది అనే వార్తలపై స్పందిస్తూ దేశభక్తి కి సంబంధించి ఇద్దరు గిరిపుత్రులు బ్రిటిష్ వారితో చేసిన పోరాటాన్ని చూపించిన సినిమాకు అవార్డు వస్తే అది మనకు గర్వకారణం అంటూ చెప్పారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆస్కార్ నామినేషన్స్ లో ఉండొచ్చు అంటూ హాలీవుడ్ మ్యాగజైన్ వైరైటీ ప్రకటించడంతో ఈ వాఖ్యలు చేశారు. హాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది సినిమా టెక్నీషియన్స్, డైరెక్టర్లు సినిమాను ప్రశంసించడం మన తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ చెప్పారు.



























