Featured

Vijaya Shanti : నా బ్యాచ్ హీరోలందరూ ముసుగు దొంగలే..వీరంతా సినిమాల్లోనే హీరోలా.? బయట కాదా.?! : విజయశాంతి

Vijaya Shanti : జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కథానాయిక వేషాలే వరించాయామెని.

ఈ మధ్య కాలంలో(1979-83) ఆమె తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సుమన్ రాజశేఖర్ లాంటి హీరోలు అందరితో విజయశాంతి కలిసి నటించారు. అందులో అనేక చిత్రాలు మంచి విజయాన్ని సాధించి విజయశాంతికి ఎంతో పేరు తీసుకొచ్చాయి.

విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీ లో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి లో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతి ని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీ లో చేరింది…

తాను రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు చేస్తున్నప్పుడు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంది. మీరు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. దానికి తెలంగాణ ప్రజలు కారణం కాదా?.. మీ స్పందన తెలియజేయండి, మీ అభిప్రాయం చెప్పండి అంటే ఒక్క హీరో కూడా సమాధానం చెప్పలేదు. మీ బ్యాచ్ హీరోలు భయపడ్డారా అని యాంకర్ అడగగా.. కాదు మా బ్యాచ్ హీరోలంతా ముసుగు దొంగలు.. వారు తీసుకుంటున్న పారితోషికములో 50% పక్కన పెట్టండి కనీసం 20% కూడా ప్రజల కొరకు ఖర్చు చేయడం లేదని.. వాళ్లు కేవలం సినిమాలోనే హీరోలు బయట కాదా.? కనీసం దండేసి అభినందిద్దాం అనే హీరో ఒక్కరైనా ఉన్నారా?… ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రం మంచి విజయం సాధించిన తర్వాత కూడా సినిమాలను పక్కకు పెట్టి ప్రజల కొరకు రాజకీయాల్లోకి వచ్చానని తాను అనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యేదాన్నని ఆ ఇంటర్వ్యూలో విజయశాంతి తెలుగు హీరోలపై కాస్త ఘాటుగానే స్పందించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘సరస్వతి’ రివ్యూ: ఆసక్తికర ఆరంభం… రొటీన్ ముగింపు

ఓటీటీ వేదికపై కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న సరస్వతి సినిమా, కథా నేపథ్యం వల్ల ప్రారంభంలోనే ఆసక్తిని కలిగించినా, ఆ ఆసక్తిని…

27 minutes ago

ప్రియుడితో వెళ్లిందన్న అనుమానం… భార్యపై కత్తితో దాడి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం చివరకు హత్యకు దారితీసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం…

35 minutes ago

‘రాకాస’ రచ్చ… రెండు రోజుల్లోనే రూ.10 కోట్ల మార్క్ క్రాస్

యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాస సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. విడుదలైన…

44 minutes ago

చెన్నైలో విషాదం… టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య

తమిళ బుల్లితెర రంగంలో గుర్తింపు పొందిన నటి సుభాషిణి మృతి వార్త సినీ, టీవీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.…

59 minutes ago

“హీరోగా తీస్తా” అన్న దిల్ రాజు… ఆసక్తికరంగా స్పందించిన అనిల్

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడికు నిర్మాత దిల్ రాజు నుంచి ఆసక్తికర ఆఫర్ రావడం ఇండస్ట్రీలో…

1 hour ago

“15 ఏళ్లకే ఆ నరకం చూశాను”… జాన్వీ కపూర్ షాకింగ్ రివీలేషన్

టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటి జాన్వీ కపూర్ తన టీనేజ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా…

1 hour ago