Vijaya Shanti : జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కథానాయిక వేషాలే వరించాయామెని.
ఈ మధ్య కాలంలో(1979-83) ఆమె తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సుమన్ రాజశేఖర్ లాంటి హీరోలు అందరితో విజయశాంతి కలిసి నటించారు. అందులో అనేక చిత్రాలు మంచి విజయాన్ని సాధించి విజయశాంతికి ఎంతో పేరు తీసుకొచ్చాయి.
విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీ లో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి లో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతి ని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీ లో చేరింది…
తాను రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు చేస్తున్నప్పుడు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంది. మీరు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. దానికి తెలంగాణ ప్రజలు కారణం కాదా?.. మీ స్పందన తెలియజేయండి, మీ అభిప్రాయం చెప్పండి అంటే ఒక్క హీరో కూడా సమాధానం చెప్పలేదు. మీ బ్యాచ్ హీరోలు భయపడ్డారా అని యాంకర్ అడగగా.. కాదు మా బ్యాచ్ హీరోలంతా ముసుగు దొంగలు.. వారు తీసుకుంటున్న పారితోషికములో 50% పక్కన పెట్టండి కనీసం 20% కూడా ప్రజల కొరకు ఖర్చు చేయడం లేదని.. వాళ్లు కేవలం సినిమాలోనే హీరోలు బయట కాదా.? కనీసం దండేసి అభినందిద్దాం అనే హీరో ఒక్కరైనా ఉన్నారా?… ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రం మంచి విజయం సాధించిన తర్వాత కూడా సినిమాలను పక్కకు పెట్టి ప్రజల కొరకు రాజకీయాల్లోకి వచ్చానని తాను అనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యేదాన్నని ఆ ఇంటర్వ్యూలో విజయశాంతి తెలుగు హీరోలపై కాస్త ఘాటుగానే స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…