CVL Narasimha Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, అడ్వకేట్ గా పలు సినిమాలలో నటించిన సీవీల్ నరసింహారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటి విజయశాంతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి విజయశాంతికి ఇండస్ట్రీలో మెంబర్షిప్ కార్డు ఇవ్వకుండా తనని దారుణంగా అవమానించారు. అదేవిధంగా అంత పెద్ద నటి అయినప్పటికీ వజ్రోత్సవ కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమానికి తనని ఆహ్వానించకుండా తనను దారుణంగా అవమానించారని ఈ సందర్భంగా నరసింహారావు వెల్లడించారు.
ఇకపోతే నరసింహారావు వృత్తిపరంగా లాయర్ కావడంతో లాయర్లు సాధారణంగా మోసపోరు అంటారు మీరు ఎప్పుడైనా మోసపోయా అని ప్రశ్నించగా ఆయన చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఠాగూర్ సినిమా విడుదలకు ముందు మేము రక్ష అనే ఒక ఆర్గనైజేషన్ ఫౌండేషన్ స్థాపించాము.
ఈ ఫౌండేషన్ ద్వారా యాంటీ కరప్షన్ వింగ్ అని పెట్టాము. దీంతో డీజీపీ అందరూ పాల్గొని కరెక్షన్ ఉండకూడదు అంటూ ఎన్నో నియమాలు పెట్టాము. ఆ సమయంలోనే ఠాగూర్ సినిమా వస్తుందని తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేసాము. ఇక ఠాగూర్ సినిమా తెరకెక్కుతుండగా ప్రొడ్యూసర్ లతో కలిసి ఫర్ యు అనే ఒక వెబ్సైట్ పెట్టి పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేయాలని భావించాము.
అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లు చూసిన తర్వాత మా వెబ్ సైట్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక మనం ఈ వెబ్ సైట్ ద్వారా ప్రమోషన్ చేయాల్సిన పనిలేదు. సినిమా మంచి హిట్ అయింది ఇక వెబ్ సైట్ తో పని లేదని చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత ఇలా కూడా ఉంటారా అని అనుకున్నాను. మరి ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లలేదా అంటే.. అప్పట్లో మనం చిరంజీవి గారిని డైరెక్టుగా కలవలేము కనుక ఈ విషయం అతని వరకు వెళ్లలేదని నరసింహారావు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…