Connect with us

Featured

CVL Narasimha Rao : ఆ విషయంలో విజయశాంతిని చాలా అవమానించారు.. చిరంజీవి గారికి చెబుదామంటే కలవలేక పోయాను : సీవీల్ నరసింహారావు

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, అడ్వకేట్ గా పలు సినిమాలలో నటించిన సీవీల్ నరసింహారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటి

Published

on

CVL Narasimha Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, అడ్వకేట్ గా పలు సినిమాలలో నటించిన సీవీల్ నరసింహారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటి విజయశాంతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి విజయశాంతికి ఇండస్ట్రీలో మెంబర్షిప్ కార్డు ఇవ్వకుండా తనని దారుణంగా అవమానించారు. అదేవిధంగా అంత పెద్ద నటి అయినప్పటికీ వజ్రోత్సవ కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమానికి తనని ఆహ్వానించకుండా తనను దారుణంగా అవమానించారని ఈ సందర్భంగా నరసింహారావు వెల్లడించారు.

Chiranjeevi: ఆ విషయంలో విజయశాంతిని చాలా అవమానించారు.. చిరంజీవి గారికి చెబుదామంటే కలవలేక పోయాను: సీవీల్ నరసింహారావు

ఇకపోతే నరసింహారావు వృత్తిపరంగా లాయర్ కావడంతో లాయర్లు సాధారణంగా మోసపోరు అంటారు మీరు ఎప్పుడైనా మోసపోయా అని ప్రశ్నించగా ఆయన చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఠాగూర్ సినిమా విడుదలకు ముందు మేము రక్ష అనే ఒక ఆర్గనైజేషన్ ఫౌండేషన్ స్థాపించాము.

ఈ ఫౌండేషన్ ద్వారా యాంటీ కరప్షన్ వింగ్ అని పెట్టాము. దీంతో డీజీపీ అందరూ పాల్గొని కరెక్షన్ ఉండకూడదు అంటూ ఎన్నో నియమాలు పెట్టాము. ఆ సమయంలోనే ఠాగూర్ సినిమా వస్తుందని తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేసాము. ఇక ఠాగూర్ సినిమా తెరకెక్కుతుండగా ప్రొడ్యూసర్ లతో కలిసి ఫర్ యు అనే ఒక వెబ్సైట్ పెట్టి పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేయాలని భావించాము.

Advertisement
Chiranjeevi: ఆ విషయంలో విజయశాంతిని చాలా అవమానించారు.. చిరంజీవి గారికి చెబుదామంటే కలవలేక పోయాను: సీవీల్ నరసింహారావు
Chiranjeevi: ఆ విషయంలో విజయశాంతిని చాలా అవమానించారు.. చిరంజీవి గారికి చెబుదామంటే కలవలేక పోయాను: సీవీల్ నరసింహారావు

చిరంజీవిని కలవలేము…

అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లు చూసిన తర్వాత మా వెబ్ సైట్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక మనం ఈ వెబ్ సైట్ ద్వారా ప్రమోషన్ చేయాల్సిన పనిలేదు. సినిమా మంచి హిట్ అయింది ఇక వెబ్ సైట్ తో పని లేదని చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత ఇలా కూడా ఉంటారా అని అనుకున్నాను. మరి ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లలేదా అంటే.. అప్పట్లో మనం చిరంజీవి గారిని డైరెక్టుగా కలవలేము కనుక ఈ విషయం అతని వరకు వెళ్లలేదని నరసింహారావు వెల్లడించారు.

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!