Categories: FeaturedGeneral News

పెళ్లి చేసుకోమని వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రేయసి.. స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు చివరకు ఏం చేశారంటే..

ఆ యువతి తన ప్రేమను పట్టుపట్టి సాధించుకుంది. పోలీసులు వారిద్దరిని ఒక్కటి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టేల కేశవాణి.. గాంధీనగర్ కు చెందిన యడ్ల భాస్కర్ రావు ప్రేమించుకున్నారు. ఏడేళ్ల నుంచి వారి ప్రేమ సాగుతోంది.

అయితే ఈ మధ్య అతడు తనను పెళ్లి చేసుకొమ్మని ఎన్నిసార్లు చెప్పిన దాట వేస్తూ వచ్చాడు. ఇలా అతడు పెళ్లికి నిరాకరిస్తూ వస్తుండగా.. ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిని స్టేషన్ కు పిలిపించి.. కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానంటూ అక్కడ నుంచి అతడు వెళ్లిపోయాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు కూడా స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచిపోయినా.. ఇంత వరకు అతడి నుంచి సమాధానం రాలేదు.

దీంతో చేసేది లేక.. ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కింది. పెళ్లికి ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి దూకి చనిపోతానంటూ.. ట్యాంక్ ఎక్కి అక్కడే కూర్చుంది. కింద నుంచి చూసే ప్రతీ ఒక్కరు కంగారు పడ్డారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ యువకుడి బంధువులు కూడా చేరుకున్నారు.

ఆమెకు అతడితో పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చి అక్కడ నుంచి కిందకు దించారు పోలీసులు. వారిని అక్కడ నుంచి నేరుగా స్టేషన్ కు తీసుకెళ్లి.. ఇరువురి బంధువులను పిలిపించారు. ఎట్టకేలకే పోలీసులే పెళ్లి పెద్దలై వారిద్దరికి స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దండలు మార్పించారు. సంవత్సరంలోపు పెళ్లి చేసుకుంటానని అతడు పోలీసులు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పట్టుపట్టి తన ప్రేమను సాధించుకుందని ఆమెను ప్రశంసించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

1 hour ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

1 hour ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

3 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

3 hours ago

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…

4 hours ago

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…

4 hours ago