ఆ యువతి తన ప్రేమను పట్టుపట్టి సాధించుకుంది. పోలీసులు వారిద్దరిని ఒక్కటి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టేల కేశవాణి.. గాంధీనగర్ కు చెందిన యడ్ల భాస్కర్ రావు ప్రేమించుకున్నారు. ఏడేళ్ల నుంచి వారి ప్రేమ సాగుతోంది.
అయితే ఈ మధ్య అతడు తనను పెళ్లి చేసుకొమ్మని ఎన్నిసార్లు చెప్పిన దాట వేస్తూ వచ్చాడు. ఇలా అతడు పెళ్లికి నిరాకరిస్తూ వస్తుండగా.. ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిని స్టేషన్ కు పిలిపించి.. కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానంటూ అక్కడ నుంచి అతడు వెళ్లిపోయాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు కూడా స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచిపోయినా.. ఇంత వరకు అతడి నుంచి సమాధానం రాలేదు.
దీంతో చేసేది లేక.. ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కింది. పెళ్లికి ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి దూకి చనిపోతానంటూ.. ట్యాంక్ ఎక్కి అక్కడే కూర్చుంది. కింద నుంచి చూసే ప్రతీ ఒక్కరు కంగారు పడ్డారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ యువకుడి బంధువులు కూడా చేరుకున్నారు.
ఆమెకు అతడితో పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చి అక్కడ నుంచి కిందకు దించారు పోలీసులు. వారిని అక్కడ నుంచి నేరుగా స్టేషన్ కు తీసుకెళ్లి.. ఇరువురి బంధువులను పిలిపించారు. ఎట్టకేలకే పోలీసులే పెళ్లి పెద్దలై వారిద్దరికి స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దండలు మార్పించారు. సంవత్సరంలోపు పెళ్లి చేసుకుంటానని అతడు పోలీసులు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పట్టుపట్టి తన ప్రేమను సాధించుకుందని ఆమెను ప్రశంసించారు.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…