ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎటువంటి శుభకార్యాలు అయినా కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని ఆంక్షలు విధించారు. అయితే ఈ శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించినట్లు మనందరికీ తెలిసిన విషయమే.
ఈక్రమంలోనే ఒడిషాలోని చెలిగడ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకపోగా, పెద్ద ఎత్తున బంధువులను వివాహానికి ఆహ్వానించి ఎంతో ఘనంగా పెళ్లి నిర్వహించారు. వివాహం అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో శృతిరంజన్ పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు.
కరోనా సమయంలో ఇంత మంది గుమిగూడవద్దని తెలియదా? పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. అనంతరం వారి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా, పెళ్లి బృందం రెచ్చిపోయి అధికారులపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మార్వో ఎస్ఐలతో పాటు మరో నలుగురికి గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆర్.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు.
విషయం తెలుసుకున్న సబ్డివిజన్ పోలీస్ అధికారి దిలీప్కుమార్ గ్రామానికి చేరుకొని స్థానికులను ప్రశ్నించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి పారిపోవడంతో పలువురిపై కేసులు నమోదు చేసి విచారించారు. ఈ విషయంపై కలెక్టర్ ఆరా తీసింది నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…