ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎటువంటి శుభకార్యాలు అయినా కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని ఆంక్షలు విధించారు. అయితే ఈ శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించినట్లు మనందరికీ తెలిసిన విషయమే.
ఈక్రమంలోనే ఒడిషాలోని చెలిగడ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకపోగా, పెద్ద ఎత్తున బంధువులను వివాహానికి ఆహ్వానించి ఎంతో ఘనంగా పెళ్లి నిర్వహించారు. వివాహం అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో శృతిరంజన్ పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు.
కరోనా సమయంలో ఇంత మంది గుమిగూడవద్దని తెలియదా? పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. అనంతరం వారి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా, పెళ్లి బృందం రెచ్చిపోయి అధికారులపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మార్వో ఎస్ఐలతో పాటు మరో నలుగురికి గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆర్.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు.
విషయం తెలుసుకున్న సబ్డివిజన్ పోలీస్ అధికారి దిలీప్కుమార్ గ్రామానికి చేరుకొని స్థానికులను ప్రశ్నించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి పారిపోవడంతో పలువురిపై కేసులు నమోదు చేసి విచారించారు. ఈ విషయంపై కలెక్టర్ ఆరా తీసింది నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…