ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎటువంటి శుభకార్యాలు అయినా కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని ఆంక్షలు విధించారు. అయితే ఈ శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించినట్లు మనందరికీ తెలిసిన విషయమే.
ఈక్రమంలోనే ఒడిషాలోని చెలిగడ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకపోగా, పెద్ద ఎత్తున బంధువులను వివాహానికి ఆహ్వానించి ఎంతో ఘనంగా పెళ్లి నిర్వహించారు. వివాహం అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో శృతిరంజన్ పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు.
కరోనా సమయంలో ఇంత మంది గుమిగూడవద్దని తెలియదా? పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. అనంతరం వారి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా, పెళ్లి బృందం రెచ్చిపోయి అధికారులపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మార్వో ఎస్ఐలతో పాటు మరో నలుగురికి గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆర్.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు.
విషయం తెలుసుకున్న సబ్డివిజన్ పోలీస్ అధికారి దిలీప్కుమార్ గ్రామానికి చేరుకొని స్థానికులను ప్రశ్నించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి పారిపోవడంతో పలువురిపై కేసులు నమోదు చేసి విచారించారు. ఈ విషయంపై కలెక్టర్ ఆరా తీసింది నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…