హీరోయిన్ పార్వతీ మెల్టన్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చే సినిమా ‘జల్సా’. ఆమె అందులో సెకండ్ హీరోయిన్ గా నటించారు. అందులో ఆమె తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఆ సినిమా నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ కూడా అయ్యారు. ఆమె అనేక తెలుగు మరియు మలయాళ సినిమాలలో కనిపించింది .
మొదట ఆమె తెలుగులో నటించిన సినిమా ‘వెన్నెల’. రాజాతో వెన్నెల చిత్రంలో నటించింది. దీనిలో కిషోర్ ఎక్కువగా ప్రాచూర్యం పొందాడు. అప్పటి నుంచి అతడికి ‘వెన్నెల కిషోర్ ’ అనే పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం హల్లోలో మోహన్ లాల్ తో నటించింది.
ఆమె మళ్లీ తెలుగులో మహేష్ బాబు సరసన దూకుడు అనే ఐటమ్ సాంగ్ ” పూవై పూవై ” లో సాంగ్ లో కనిపిస్తుంది. ఆమె 2013 లో శంసు లాలానిని వివాహం చేసుకుంది, తరువాత సినిమాల నుండి రిటైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఆమెను ఇద్దరు తెలుగు దర్శకులు మోసం చేయడంతో తన కెరీర్ నాశనం అయిందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
వాళ్ల పేర్లను మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆమె తన భర్తతో అమెరికాలో తన వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక 2012 సంవత్సరంలో తెలుగులో ‘యమమో యమ’ చిత్రంలో చివరి సినిమాలో నటించారు. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇలా ఆమె దర్శకుల పేర్లు చెప్పకపోవడంతో వివిధ రకాలుగా ఊహించుకుంటున్నారు నెటిజన్లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…