ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు బబర్దస్త్ జడ్జిగా సుపరిచితం. సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్న రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె చిత్తూరు జిల్లా, చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు.
పొలిటికల్ సైన్స్ లో ఆమె నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహమాడిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. పెళ్లి అయిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రొడక్షన్ కంపెనీని నిర్మించి భర్త సెల్వమణిని దర్శకుడిగా పెట్టి అనేక సినిమాలను నిర్మించింది. దీనికి పెట్టుబడిగా ఆమె తన ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ను పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.
తర్వాత అతడి దర్శకత్వంలో మొదటి మూడు సినిమాలు హిట్ అయినా తర్వాత అంతగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. తర్వాత ఆమె ఆర్థికంగా ఎంతో ఇబ్బందులను గురవుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మొదట టీడీపీలో కి వెళ్లిన ఆమె 2004, 2009 శాసనసభ ఎన్నికలలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.
2014 శాసనసభ ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై గెలుపొందారు. తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటు జబర్దస్త్ లో కూడా ఆమె న్యాయ నిర్ణేతగా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆర్థిక పరమైన కష్టాల నుంచి బయటకు రావడానికి వైసీపీ, జబర్దస్త్ గట్టెకించాయనే చెప్పాలి.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…