AP politics: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల జాబితాను తెలియజేశారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో అందరీ చూపు రెండు నియోజక వర్గాల పైనే ఉంది.
ఒకటి పిఠాపురం కాగా మరొకటి మంగళగిరి. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి గెలవాలనే ఉద్దేశంతో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కి పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీతా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఈమె ఈసారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.
ఇక మంగళగిరిలో గత ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన మరో నియోజకవర్గానికి వెళ్లకుండా ఈ ఎన్నికలలో కూడా అక్కడే విజయం సాధించాలన్న ధీమాతో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మంగళగిరి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈసారి ముడుగూరు లావణ్య అనే మహిళను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు.
పోటీగా మహిళా అభ్యర్థులు..
ఇక వీరిద్దరికీ మాత్రమే కాకుండా బాలయ్యకు పోటీగా కూడా మహిళా అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దీపిక రంగంలోకి దిగారు. ఇలా ఈ ముగ్గురికి పోటీగా జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యర్థులను నియమించి భారీ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ ఎన్నికలలో ఈ ముగ్గురు గెలిస్తే పర్వాలేదు కానీ లేకుంటే మహిళల చేతిలో ఓడిపోయారనే ఆపవాదం మూట కట్టుకోవాల్సి వస్తుందని చెప్పాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…