ప్రపంచంలోనే అతిపెద్ద ఖగోళశాస్త్ర మ్యూజియంను చైనాలోని షాంఘైలో ఇటీవల ప్రారంభించారు. ఈ మ్యూజియం దాదాపు 39 వేల చదరపు మీటర్లు ఉంది. అబ్జర్వేటరీ, ప్లానిటోరియం,78 అడుగుల పొడవైన టెలిస్కోప్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. ఈ మూజియం యొక్క డిజైన్ ను అమెరికన్ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎనిడ్ తీయారు చేసింది.

ఇది అండాకార ఆకారంలో ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాంటి మూలలు, రేఖలు ఉండవు. దీనిని ఆకాశం నుంచి చూస్తే ఆస్ట్రోలాబ్ లాగా కనిపిస్తుందని ప్రాజెక్ట్ లీడ్ డిజైనర్ థామస్ వాంగ్ తెలిపాడు. అయితే ఈ మూజియం యొక్క ప్రత్యేకతు ఏంటంటే.. ఖగోళశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎన్నో ఉల్కల నమూనాలు ఇక్కడ కనిపిస్తాయి.
అంగారక గ్రహానికి సంబంధించి ఎన్నో విశేషాలను తెలుసుకోవచ్చు. గుండ్రంగా ఉన్న ఈ మ్యూజియంలో పర్యాటకులు బరువులేని అనుభూతిని పొందుతారు. అంటే అంతరిక్షంలో ఎలాగైతే జీరో గ్రావిటీ ఉంటుందో ఇక్కడ కూడా బరువును కోల్పోయి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గాలిలో తేలుతున్న అనుభవం కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యూజియం సందర్శకుల కోసం తెరిచిన దగ్గర నుంచి విపరీతంగా సందర్శకులు తాకిడి ఎక్కువ అయింది.
ప్రపంచంలోనే ఎక్కువగా ఖగోళానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉండటంతో అతి పెద్ద మ్యూజియం ఇదే అని చెబుతున్నారు. ఆకాశంలో జరిగే వింతలకు సంబంధించి ప్రతీ విషయం ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. అలా వాటిని సెట్ చేశారు.




























